వైసీపీ హయాంలో చేసిన అరాచకాలకు సంబంధించి నమోదు అయిన కేసుల నుంచి ఎట్టకేలకు తాత్కాలిక ఉపశమనం పొందిన ఆ పార్టీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ గురువారం పార్టీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం తన సతీమణిని వెంటబెట్టుకుని తాడేపల్లిలోని జగన్ ఇంటికి వెళ్లిన వంశీ… జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వంశీని జగన్ ఆప్యాయంగా భుజం తట్టడం కనిపించింది.
జైలులో ఉండగా… పూర్తిగా గుర్తు పట్టలేనంతగా మారిపోయిన వంశీ… జైలు నుంచి విడుదలైన మరునాటికే ఒకింత యాక్టివ్ గా కనిపించారు. జగన్ తో చిరునవ్వులు చిందిస్తూ ఆయన ఫొటోలకు ఫోజులిచ్చారు. జగన్ కు ఓ వైపు వంశీ నిలబడగా… ఆయన సతీమణి జగన్ కు మరోవైపు నిలుచుని కనిపించారు. ఆ తర్వాత బార్యాభర్తలిద్దరూ జగన్ తో కొంతసేపు చర్చించారు. ఈ సందర్భంగా ఇక భయం ఏమీ లేదని తామంతా అండగా ఉన్నామని వంశీకి జగన్ భరోసా ఇచ్చారు. గన్నవరం రాజకీయాలపైనా వారి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం.
ఇదిలా ఉంటే.. దళిత యువకుడు సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్టైన వంశీపై ఆ తర్వాత అంతకుముందు నమోదు అయిన కేసులన్నీ ఓపెన్ అయిపోయాయి. దీంతో ఓ కేసులో బెయిల్ వచ్చినా… మరో కేసులో రిమాండ్ తో వంశీ ఏకంగా 4 నెలల 20 రోజుల పాటు జైలులోనే ఉండిపోవాల్సి వచ్చింది. వంశీ జైలులో ఉండగా..జగన్ స్వయంగా బెజవాడ జిల్లా జైలుకు వెళ్లి మరీ వంశీని పరామర్శించారు.
This post was last modified on July 3, 2025 3:21 pm
యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…
ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కి నిజంగానే బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి. అదికార డీఎంకేతో…
మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…