Political News

జగన్ అప్పుకీ బాబు అప్పుకీ అదే తేడా

“ఔను.. అప్పు చేశాం. కూట‌మి ప్ర‌భుత్వంలోనూ అప్పులు చేశార‌ని కొంద‌రు(వైసీపీ) యాగీ చేస్తున్నారు. కానీ, వారిలా కాదు. మేం చేసిన అప్పులు అభివృద్ధికి వినియోగించాం. దీని నుంచి సంప‌ద సృష్టిస్తున్నాం. దానినే ప్ర‌జ‌ల‌కు సంక్షేమం రూపంలో అందిస్తున్నాం. వారిలా(జ‌గ‌న్‌) అప్పులు చేసి దానిని తీర్చేందుకు కూడా మ‌ళ్లీ అప్పులు చేయాల్సిన ప‌రిస్థితి మాకు లేదు. అస‌లు అప్పుల గురించి జ‌గ‌న్‌కు మాట్లాడే హ‌క్కు లేదు.” అని సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. తాజాగా బుధ‌వారం సాయంత్రం ఆయ‌న త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పం లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన “ప్రజావేదిక” సభలో ప్ర‌సంగించారు.

తొలుత.. ‘స్వర్ణ కుప్పం’ ప్రాజెక్టులో భాగంగా 1320 కోట్ల రూపాయ‌ల విలువైన‌ అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టా రు. అనంతరం ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ.. విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని వికాసం వైపుగా నడుపుతున్నామ‌న్నారు. సుపరిపాల నలో తొలి అడుగులో భాగంగా మీ ముందుకు వచ్చాన‌ని చెప్పారు. దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పాన్ని తయారు చేస్తామ‌ని హామీ ఇచ్చామ‌న్న ఆయ‌న‌.. దీనిని సాకారం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు వివ‌రించారు. రూ.3,890 కోట్ల వ్యయం చేసి హంద్రినీవా పనులు పూర్తి చేస్తున్నామ‌ని చెప్పారు. కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలోని రైతుల‌కు చివరి ఆయకట్టు వరకూ నీళ్లు తీసుకువస్తామ‌ని ఉద్ఘాటించారు.

ఈ ఏడాదిలోనే కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా నీళ్లు పారిస్తామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. అభివృద్ధి చేసే వారికి మాత్రమే సంక్షేమం గురించి మాట్లాడే హక్కు ఉంటుందన్నారు. “అప్పు చేసి సంక్షేమం చేస్తామనటం ఏం పరిపాలన..? అప్పు తెచ్చి అభివృద్ధి చేసి వచ్చిన ఆదాయాన్ని సంక్షేమానికి ఖర్చు చేయటమే నిజమైన ఆర్ధిక వ్యవస్థ. గతేడాదిగా రాష్ట్రంలో ఈ విధానాన్నే అవలంబిస్తున్నాం. ప్రజలంతా ఆశీర్వదించబట్టే ఏడాదిగా సుపరిపాలనను రాష్ట్రంలో అందిస్తున్నాం.” అని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు.

కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో రూ.1292 కోట్ల విలువైన పనుల్ని చేస్తున్నామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఇప్పటికే రూ.125 కోట్ల విలువైన పనులు కూడా పూర్తి అయ్యాయన్నారు. `’రాష్ట్రంలో గుంతలు లేని రహదారులే లక్ష్యంగా పని చేసాం. గతంలో మహిళలు కట్టెల పొయ్యిపై వంట చేయకూడదని దీపం పథకం అమలు చేశాం. నాడు దీపంతో గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం.. నేడు దీపం 2.0తో ఉచిత సిలెండర్లు ఇస్తున్నాం. స్వ‌ర్ణ కుప్పం ప్రాజెక్టులో భాగంగా రహదారులను సీసీ, బీటీ రోడ్లుగా మారుస్తున్నాం. కుప్పం నియోజకవర్గంలో ప్రతీ ఇంటిలోనూ వంట గ్యాస్ ఉంది. సూర్య ఘ‌ర్ ప‌థ‌కంలో ఇక్క‌డి ప్ర‌తి ఇంటినీ చేర్చాం.” అని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు.

This post was last modified on July 3, 2025 12:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

గేమ్ కోసం ఫోన్ ఇవ్వలేదని ముగ్గురు అక్కాచెల్లెళ్ళు…

​ఘజియాబాద్‌లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…

2 hours ago

అల్లరోడి ఆల్కహాల్ అడ్రస్ ఎక్కడ

అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…

2 hours ago

మామతో దళపతి… మాజీ అల్లుడితో ఎమోషనల్ డ్రామా

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…

2 hours ago

దిల్ రాజుకు, నాగవంశీకి చెడిందా?

టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే…

3 hours ago

చిరుపై విమర్శకులకు లావణ్య కౌంటర్

ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని సంతోషంలో ముంచెత్తే పరిణామం చోటుచేసుకుంది. చిరు తనయుడు రామ్ చరణ్ కవల పిల్లలకు తండ్రి…

3 hours ago

రెండు షాట్ల కోసం మహేష్ ఆరు నెలల కష్టం

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు.. ఈ వార్త నిజం కావడానికి దశాబ్దంన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అభిమానులు. వీరి…

4 hours ago