ఏపీలో ఒకేసారి కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న టీడీపీ, ప్రతిపక్షం వైసీపీ రెండు కార్యక్రమాలు చేపట్టాయి. టీడీపీ గత ఏడాది కూటమి పాలనలో జరిగిన మేలు, చేపట్టిన సంక్షేమం, ప్రజలకు ఇచ్చిన పథకాలు వంటివాటిని వివరించే ప్రయత్నం చేసింది. దీనికి సుపరిపాలనలో తొలి అడుగు-ఇది మంచి ప్రభుత్వం అని పేరు పెట్టింది. ఇక, ప్రతిపక్షం(ప్రధాన కాదు) వైసీపీ కూడా ఇదే తరహాలో ప్రజలకు చేరువ అయ్యే ప్రయత్నం చేసింది. గత ఏడాది కిందట చంద్రబాబు ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
రీకాల్ చంద్రబాబూస్ మేనిఫెస్టో పేరుతో వైసీపీ నాయకులు ఇంటింటికీ తిరుగుతున్నారు. గత మూడు రోజుల నుంచే వైసీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే.. జూలై 2 బుధవారం నుంచి టీడీపీ కూడా ప్రజాహిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో రెండు కార్యక్రమాలూ కూడా ఒకేసారి ప్రజల మధ్యకు చేరినట్టు అయింది. అయితే.. ఇవి రెండు పరస్పర వ్యతిరేక కార్యక్రమాలు!. మేం మంచి చేశామని టీడీపీ నాయకులు, కాదు, వారు అసలు ఏమీ చేయలేదని వైసీపీ నాయకులు ఒకరకంగా భారీ భీకర ప్రచారానికి ఇరు పక్షాలు తెరదీశాయి. దీంతో ఈ కార్యక్రమాలు ఎలా జరిగాయన్నది ఆసక్తిగా మారింది.
టీడీపీ విషయాన్ని తీసుకుంటే.. రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పార్టీ ప్రచురించిన ఏడాది పాలనలో చేపట్టిన కార్యక్రమాలపై వివరాలను మరోసారి ప్రజలకు వివరించారు. పింఛన్లు అందుతున్నాయా? పథకాలు వస్తున్నాయా? అని ఆరాతీశారు.
ఇక, వైసీపీ విషయానికి వస్తే.. రీకాల్ చంద్రబాబూస్ మేనిఫెస్టో కార్యక్రమంలోనూ చాలా వరకు తక్కువమందే పార్టిసిపేట్ చేస్తున్నారు. కేవలం ఒకటి రెండు జిల్లాల్లో మాత్రమే ఈ కార్యక్రమానికి నాయకులు స్పందిస్తున్నారు. కార్యకర్తలు పెద్దగా రావడం లేదు. పైగా.. వర్షాలు కురుస్తుండడంతో కొన్ని గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. చిత్రం ఏంటంటే.. వీరు ఎంపిక చేసుకున్న ఇళ్లకు మాత్రమే వెళ్తున్నారు. సహజంగానే వారికి సానుభూతి కోణంలో ఎంపిక చేసుకున్న కుటుంబాల నుంచి సమాచారం అందుతోంది.
గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ బాగా గ్యాప్ తీసుకున్నారు. అతిథి పాత్ర కాబట్టి మన…
తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…
ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…
మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…