Political News

‘సుప‌రిపాల‌న‌’ బాగుంది.. జగన్ పిలుపుకు స్పందన కరువు

ఏపీలో ఒకేసారి కూట‌మి ప్ర‌భుత్వానికి నేతృత్వం వ‌హిస్తున్న టీడీపీ, ప్ర‌తిప‌క్షం వైసీపీ రెండు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాయి. టీడీపీ గ‌త ఏడాది కూట‌మి పాల‌న‌లో జ‌రిగిన మేలు, చేప‌ట్టిన సంక్షేమం, ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ప‌థ‌కాలు వంటివాటిని వివ‌రించే ప్ర‌య‌త్నం చేసింది. దీనికి సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు-ఇది మంచి ప్ర‌భుత్వం అని పేరు పెట్టింది. ఇక‌, ప్ర‌తిపక్షం(ప్ర‌ధాన కాదు) వైసీపీ కూడా ఇదే త‌ర‌హాలో ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యే ప్ర‌య‌త్నం చేసింది. గ‌త ఏడాది కిందట చంద్ర‌బాబు ఇచ్చిన హామీల‌ను ప్ర‌జ‌ల‌కు గుర్తు చేసే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది.

రీకాల్ చంద్ర‌బాబూస్ మేనిఫెస్టో పేరుతో వైసీపీ నాయ‌కులు ఇంటింటికీ తిరుగుతున్నారు. గ‌త మూడు రోజుల నుంచే వైసీపీ నాయ‌కులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు. అయితే.. జూలై 2 బుధ‌వారం నుంచి టీడీపీ కూడా ప్ర‌జాహిత కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌డంతో రెండు కార్య‌క్ర‌మాలూ కూడా ఒకేసారి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు చేరిన‌ట్టు అయింది. అయితే.. ఇవి రెండు ప‌ర‌స్ప‌ర వ్య‌తిరేక కార్య‌క్ర‌మాలు!. మేం మంచి చేశామ‌ని టీడీపీ నాయ‌కులు, కాదు, వారు అస‌లు ఏమీ చేయ‌లేద‌ని వైసీపీ నాయ‌కులు ఒక‌ర‌కంగా భారీ భీక‌ర ప్ర‌చారానికి ఇరు ప‌క్షాలు తెర‌దీశాయి. దీంతో ఈ కార్య‌క్ర‌మాలు ఎలా జ‌రిగాయ‌న్న‌ది ఆస‌క్తిగా మారింది.

టీడీపీ విష‌యాన్ని తీసుకుంటే.. రాష్ట్ర‌వ్యాప్తంగా కార్య‌క్ర‌మాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పార్టీ ప్ర‌చురించిన ఏడాది పాల‌న‌లో చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌పై వివ‌రాల‌ను మ‌రోసారి ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. పింఛ‌న్లు అందుతున్నాయా? ప‌థ‌కాలు వ‌స్తున్నాయా? అని ఆరాతీశారు.

ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. రీకాల్ చంద్ర‌బాబూస్ మేనిఫెస్టో కార్య‌క్ర‌మంలోనూ చాలా వ‌ర‌కు త‌క్కువ‌మందే పార్టిసిపేట్ చేస్తున్నారు. కేవ‌లం ఒక‌టి రెండు జిల్లాల్లో మాత్ర‌మే ఈ కార్య‌క్ర‌మానికి నాయ‌కులు స్పందిస్తున్నారు. కార్య‌కర్త‌లు పెద్ద‌గా రావ‌డం లేదు. పైగా.. వ‌ర్షాలు కురుస్తుండ‌డంతో కొన్ని గ్రామాల‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. చిత్రం ఏంటంటే.. వీరు ఎంపిక చేసుకున్న ఇళ్లకు మాత్ర‌మే వెళ్తున్నారు. స‌హ‌జంగానే వారికి సానుభూతి కోణంలో ఎంపిక చేసుకున్న కుటుంబాల నుంచి స‌మాచారం అందుతోంది.

This post was last modified on July 3, 2025 12:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

1 hour ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

3 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

4 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

6 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

9 hours ago