Political News

“కూట‌మి పాల‌న చూసి జ‌గ‌న్‌కు నిద్ర‌ప‌ట్ట‌ట్లేదట‌”

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌పై ఏపీ సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లుచేశారు. కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న చూసిన తర్వాత‌.. జ‌గ‌న్‌కు నిద్ర‌ప‌ట్ట‌డం లేద‌ని చెప్పారు. ఈ విష‌యాన్ని త‌న‌కు కొంద‌రు చెప్పార‌న్న ఆయ‌న‌.. కూట‌మి పాల‌న‌లో పార ద‌ర్శ‌క‌త‌, జ‌వాబుదారీ త‌నం చూసి.. వైసీపీ నాయ‌కులు బెంబేలెత్తుతున్నార‌ని చెప్పారు. ఇలాంటి పాల‌న‌ను ప్ర‌జ‌లు వ‌దులు కోర‌ని తెలిసి.. ఏం చేయాలో తెలియ‌క తాడేప‌ల్లి కొంప‌లో జాగారం చేస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. మంగ‌ళ‌వారం.. సీఎం చంద్ర‌బాబు తూర్పుగోదావ‌రి జిల్లాలోని మ‌ల‌క‌ప‌ల్లి గ్రామంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా పింఛ‌న్ల‌ను ఆయ‌న పంపిణీ చేశారు.

అనంత‌రం చంద్ర‌బాబు మాట్లాడుతూ.. ‘సూప‌ర్ 6’ హామీల‌ను తూ.చ‌. త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు. అయితే.. కొంద‌రు సూప‌ర్ 6 హామీల‌పై అవాకులు చ‌వాకులు పేలార‌ని ప‌రోక్షంగా వైసీపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. సూప‌ర్ 6ను అమ‌లు చేయ‌లేమ‌ని చెప్పార‌ని.. కానీ, వీటిని అమ‌లు చేస్తుండ‌డంతో వారు నిద్ర‌లేని రాత్రులు గడుపుతున్నార‌ని చెప్పారు. ఇప్ప‌టికే పింఛ‌న్ల‌ను రూ.1000 చొప్పున పెంచి ఇస్తున్నామ‌ని.. గ్యాస్ సిలిండ‌ర్ల‌ను ఉచితంగా అందిస్తున్నామ‌ని చెప్పిన చంద్ర‌బాబు.. ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణాన్ని మ‌రో 45 రోజ‌ల్లోనే అమ‌లు చేయ‌నున్న‌ట్టు తెలిపారు.

ఇవ‌న్నీ చూశాక‌.. వైసీపీ నాయ‌కుల‌కు నిద్ర ప‌ట్ట‌డం లేద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. దోచుకోవ‌డం.. దాచుకోవడానికి అల‌వాటు ప‌డిన వారికి ఇప్పుడు పార‌దర్శ‌క పాల‌న అందిస్తుంటే నిద్ర ఎలా ప‌డుతుంద‌ని ఎద్దేవా చేశారు. సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌కు నెలా నెలా రూ.2750 కోట్ల ను ఖ‌ర్చు చేస్తున్నామ‌ని.. వీటిని పార‌ద‌ర్శ‌కంగా అందిస్తున్నామ‌న్నారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం పార‌ద‌ర్శ‌కత‌ను పాతిపెట్టింద‌ని.. పింఛ‌న్ల‌ను కూడా స‌రిగా అందించ‌లేక పోయింద‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు నుంచి అనేక ప‌థ‌కాల‌ను ఎగ్గొట్టార‌ని.. అప్ప‌టికి కూడా అప్పులు పెట్టి పోయార‌ని దుయ్య‌బ‌ట్టారు.

రాష్ట్రంలో కూట‌మి బ‌లంగా ఉంద‌న్న చంద్ర‌బాబు.. ప్ర‌జ‌ల‌కు మేలు చేసేందుకు అనేక కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తున్నామ‌న్నా రు. ప్ర‌జ‌ల‌కు సంక్షేమం ఆగ‌బోద‌ని.. అదేస‌మ‌యంలో అభివృద్ధిని కూడా ప‌రుగులు పెట్టిస్తామ‌ని చెప్పారు. దీనిని చూసి పొరుగు రాష్ట్రాల వారు కూడా నేర్చుకుంటున్నార‌ని తెలిపారు. అమ‌రావ‌తిలో క్వాంట‌మ్ వ్యాలీ వ‌స్తే.. ఇక‌, రాష్ట్రం పేరు ప్ర‌పంచ ప‌టంలోకి ఎక్కుతుంద‌ని చంద్ర‌బాబు చెప్పారు.

This post was last modified on July 2, 2025 10:56 am

Share

Recent Posts

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

19 seconds ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

6 minutes ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

1 hour ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

3 hours ago

పైరసీ రూపంలో కొత్త తలనెప్పి

ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…

5 hours ago

పోలీస్ దుస్తుల్లో సూర్య షాకింగ్ ట్విస్టు

కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…

5 hours ago