Political News

“కూట‌మి పాల‌న చూసి జ‌గ‌న్‌కు నిద్ర‌ప‌ట్ట‌ట్లేదట‌”

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌పై ఏపీ సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లుచేశారు. కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న చూసిన తర్వాత‌.. జ‌గ‌న్‌కు నిద్ర‌ప‌ట్ట‌డం లేద‌ని చెప్పారు. ఈ విష‌యాన్ని త‌న‌కు కొంద‌రు చెప్పార‌న్న ఆయ‌న‌.. కూట‌మి పాల‌న‌లో పార ద‌ర్శ‌క‌త‌, జ‌వాబుదారీ త‌నం చూసి.. వైసీపీ నాయ‌కులు బెంబేలెత్తుతున్నార‌ని చెప్పారు. ఇలాంటి పాల‌న‌ను ప్ర‌జ‌లు వ‌దులు కోర‌ని తెలిసి.. ఏం చేయాలో తెలియ‌క తాడేప‌ల్లి కొంప‌లో జాగారం చేస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. మంగ‌ళ‌వారం.. సీఎం చంద్ర‌బాబు తూర్పుగోదావ‌రి జిల్లాలోని మ‌ల‌క‌ప‌ల్లి గ్రామంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా పింఛ‌న్ల‌ను ఆయ‌న పంపిణీ చేశారు.

అనంత‌రం చంద్ర‌బాబు మాట్లాడుతూ.. ‘సూప‌ర్ 6’ హామీల‌ను తూ.చ‌. త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు. అయితే.. కొంద‌రు సూప‌ర్ 6 హామీల‌పై అవాకులు చ‌వాకులు పేలార‌ని ప‌రోక్షంగా వైసీపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. సూప‌ర్ 6ను అమ‌లు చేయ‌లేమ‌ని చెప్పార‌ని.. కానీ, వీటిని అమ‌లు చేస్తుండ‌డంతో వారు నిద్ర‌లేని రాత్రులు గడుపుతున్నార‌ని చెప్పారు. ఇప్ప‌టికే పింఛ‌న్ల‌ను రూ.1000 చొప్పున పెంచి ఇస్తున్నామ‌ని.. గ్యాస్ సిలిండ‌ర్ల‌ను ఉచితంగా అందిస్తున్నామ‌ని చెప్పిన చంద్ర‌బాబు.. ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణాన్ని మ‌రో 45 రోజ‌ల్లోనే అమ‌లు చేయ‌నున్న‌ట్టు తెలిపారు.

ఇవ‌న్నీ చూశాక‌.. వైసీపీ నాయ‌కుల‌కు నిద్ర ప‌ట్ట‌డం లేద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. దోచుకోవ‌డం.. దాచుకోవడానికి అల‌వాటు ప‌డిన వారికి ఇప్పుడు పార‌దర్శ‌క పాల‌న అందిస్తుంటే నిద్ర ఎలా ప‌డుతుంద‌ని ఎద్దేవా చేశారు. సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌కు నెలా నెలా రూ.2750 కోట్ల ను ఖ‌ర్చు చేస్తున్నామ‌ని.. వీటిని పార‌ద‌ర్శ‌కంగా అందిస్తున్నామ‌న్నారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం పార‌ద‌ర్శ‌కత‌ను పాతిపెట్టింద‌ని.. పింఛ‌న్ల‌ను కూడా స‌రిగా అందించ‌లేక పోయింద‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు నుంచి అనేక ప‌థ‌కాల‌ను ఎగ్గొట్టార‌ని.. అప్ప‌టికి కూడా అప్పులు పెట్టి పోయార‌ని దుయ్య‌బ‌ట్టారు.

రాష్ట్రంలో కూట‌మి బ‌లంగా ఉంద‌న్న చంద్ర‌బాబు.. ప్ర‌జ‌ల‌కు మేలు చేసేందుకు అనేక కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తున్నామ‌న్నా రు. ప్ర‌జ‌ల‌కు సంక్షేమం ఆగ‌బోద‌ని.. అదేస‌మ‌యంలో అభివృద్ధిని కూడా ప‌రుగులు పెట్టిస్తామ‌ని చెప్పారు. దీనిని చూసి పొరుగు రాష్ట్రాల వారు కూడా నేర్చుకుంటున్నార‌ని తెలిపారు. అమ‌రావ‌తిలో క్వాంట‌మ్ వ్యాలీ వ‌స్తే.. ఇక‌, రాష్ట్రం పేరు ప్ర‌పంచ ప‌టంలోకి ఎక్కుతుంద‌ని చంద్ర‌బాబు చెప్పారు.

This post was last modified on July 2, 2025 10:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

48 minutes ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

2 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

3 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

4 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

5 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

7 hours ago