వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలుచేశారు. కూటమి ప్రభుత్వ పాలన చూసిన తర్వాత.. జగన్కు నిద్రపట్టడం లేదని చెప్పారు. ఈ విషయాన్ని తనకు కొందరు చెప్పారన్న ఆయన.. కూటమి పాలనలో పార దర్శకత, జవాబుదారీ తనం చూసి.. వైసీపీ నాయకులు బెంబేలెత్తుతున్నారని చెప్పారు. ఇలాంటి పాలనను ప్రజలు వదులు కోరని తెలిసి.. ఏం చేయాలో తెలియక తాడేపల్లి కొంపలో జాగారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మంగళవారం.. సీఎం చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లాలోని మలకపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా పింఛన్లను ఆయన పంపిణీ చేశారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘సూపర్ 6’ హామీలను తూ.చ. తప్పకుండా అమలు చేస్తున్నామని చెప్పారు. అయితే.. కొందరు సూపర్ 6 హామీలపై అవాకులు చవాకులు పేలారని పరోక్షంగా వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. సూపర్ 6ను అమలు చేయలేమని చెప్పారని.. కానీ, వీటిని అమలు చేస్తుండడంతో వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని చెప్పారు. ఇప్పటికే పింఛన్లను రూ.1000 చొప్పున పెంచి ఇస్తున్నామని.. గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తున్నామని చెప్పిన చంద్రబాబు.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని మరో 45 రోజల్లోనే అమలు చేయనున్నట్టు తెలిపారు.
ఇవన్నీ చూశాక.. వైసీపీ నాయకులకు నిద్ర పట్టడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దోచుకోవడం.. దాచుకోవడానికి అలవాటు పడిన వారికి ఇప్పుడు పారదర్శక పాలన అందిస్తుంటే నిద్ర ఎలా పడుతుందని ఎద్దేవా చేశారు. సామాజిక భద్రతా పింఛన్లకు నెలా నెలా రూ.2750 కోట్ల ను ఖర్చు చేస్తున్నామని.. వీటిని పారదర్శకంగా అందిస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పారదర్శకతను పాతిపెట్టిందని.. పింఛన్లను కూడా సరిగా అందించలేక పోయిందని చంద్రబాబు విమర్శించారు. ఎన్నికలకు ఏడాది ముందు నుంచి అనేక పథకాలను ఎగ్గొట్టారని.. అప్పటికి కూడా అప్పులు పెట్టి పోయారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో కూటమి బలంగా ఉందన్న చంద్రబాబు.. ప్రజలకు మేలు చేసేందుకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నా రు. ప్రజలకు సంక్షేమం ఆగబోదని.. అదేసమయంలో అభివృద్ధిని కూడా పరుగులు పెట్టిస్తామని చెప్పారు. దీనిని చూసి పొరుగు రాష్ట్రాల వారు కూడా నేర్చుకుంటున్నారని తెలిపారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వస్తే.. ఇక, రాష్ట్రం పేరు ప్రపంచ పటంలోకి ఎక్కుతుందని చంద్రబాబు చెప్పారు.
This post was last modified on July 2, 2025 10:56 am
మార్చి నుంచి ఆగస్టుకి విడుదల తేదీ వాయిదా వేసుకున్న నాని ది ప్యారడైజ్ ఖచ్చితంగా చెప్పిన డేట్ కి విడుదలవుతుందా…
జన నాయకుడు పైరసీని పూర్తి స్థాయిలో కాకపోయినా గరిష్ట స్థాయిలో కట్టడి చేయడంలో నిర్మాణ సంస్థ సక్సెస్ అయ్యింది. వీడియో…
అదేంటో కానీ.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పలు కీలక విషయాలు సాధారణ రోజుల్లో ఎక్కడా గుర్తుకు ఉండవు... రావు. ఎన్నికల…
సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…
జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లిపోతే పరిణామాలు ఎలా ఉంటాయో మరోసారి రుజువైంది. పవన్ కళ్యాణ్, రామ్…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…