హైదరాబాద్ నడిబొడ్డులోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకు ఇంకా చాలా సమయమే ఉంది. మాగంటి గోపీనాథ్ మృతితో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఇదిలావుంటే.. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. గత ఎన్నికల్లో తృటిలో తమ అభ్యర్థి ఓడిపోయారని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఉప ఎన్నికలో మాత్రం గెలిచి తీరాలని నిర్ణయించు కుంది. ఇక, అభ్యర్థుల పరంగా కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా మంది క్యూలో ఉన్నారు.
వాస్తవానికి 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అజారుద్దీన్ పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇ ప్పుడు ఆయనే తిరిగి పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై బహిరంగంగా కూడా అజారుద్దీన్ ప్రకటన చేశారు. దీనిపై అధిష్టానం నిర్ణయం తీసుకునేందుకు ఇంకా చాలానే సమయం ఉంది. మరోవైపు తాజాగా.. ఇంకో పేరు కూడా తెరమీదికి వచ్చింది. జీవీఎంసీ మేయర్, సీనియర్ నాయకుడు కేకే కుమార్తె.. గద్వాల విజయలక్ష్మీ కూడా.. పోటీకి రెడీ అవుతున్నారన్న గుసగుస వినిపిస్తోంది.
నియోజకవర్గంలో చురుగ్గా పాల్గొనడంతోపాటు.. వీధి వీధిలోనూ విజయలక్ష్మీ పర్యటిస్తున్నారు. అంతేకాదు .. స్థానికులను మచ్చి క చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. అసలు విషయం ఎలా ఉన్నా.. ఆమె మాత్రం.. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని.. అందుకే ఇలా నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్టు పేర్కొన్నారు. కానీ..ఊరకరారు మహానుభావులు అన్నట్టుగా.. గద్వాల విజయలక్ష్మి పర్యటనలు.. చేస్తున్న కార్యక్రమాలు ఆమె ఇక్కడ ఉప పోరులో పోటీ చేయడం కోసమేనన్న వాదన బలంగా వినిపిస్తోంది.
కట్ చేస్తే.. అసలు ఈ సిట్టింగ్ సీటు సొంతం చేసుకున్న బీఆర్ ఎస్ పరిస్థితి ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. ఇక్కడ నుంచి జరగనున్న ఉప పోరులో మాగంటి కుమారుడికి అవకాశం ఇస్తామని.. ఇప్పటికే కేసీఆర్ ప్రకటన చేశారు. ఈక్రమంలో ఎలాంటి పోటీ లేకుండా.. ఏకగ్రీవంగా విజయం దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. ఎంఐఎం ఎలానూ.. అనుకూలమే కాబట్టి.. కాంగ్రెస్, బీజేపీలను ఏకగ్రీవం అయ్యేలా కోరే ఉద్దేశం ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on July 2, 2025 2:18 pm
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…
టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…