Political News

క్లాస్ అండ్ మాస్‌.. చంద్ర‌బాబు న్యూ యాంగిల్‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటే.. ఐటీ మ్యాన్ అనే పేరుంది. ఆయ‌న ఉన్న‌త వ‌ర్గాల‌కు చేరువ‌గా ఉంటార‌న్న నానుడి కూడా ఉంది. అయితే.. ఇది గ‌తం. కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ఆయ‌న మాస్‌కు చేరువ అవుతున్నారు. ప్ర‌తి నెలా 1న సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌ను పంపిణీ చేసేందుకు వెళ్లే క్ర‌మంలో ఆయ‌న పూర్తిస్థాయి మాస్ నాయ‌కుడిగా మారుతున్నారు. అంతేకాదు.. మాస్‌తో క‌లిసి పోతున్నారు. వారింట్లో టీ, కాఫీలు త‌యారు చేస్తూ.. తాను తాగుతూ.. వారికి కూడా ఇస్తున్నారు. ఇలా.. మాస్ యాంగిల్‌లో చంద్ర‌బాబు మెప్పిస్తున్నారు.

ఇదేస‌మ‌యంలో అమ‌రావ‌తి స‌హా ఇత‌ర ప్రాజెక్టుల విష‌యంపై ఉన్న‌త‌స్థాయి చ‌ర్చ‌లు జ‌ర‌పాల్సి వ‌చ్చిన‌ప్పుడు.. క్లాస్ కోణంలో క‌నిపిస్తున్నారు. అయితే.. ఎవ‌రినీ విడిచిపెట్ట‌కుండా ఆయా వ‌ర్గాల‌కు చేరువ అవుతున్నారు. అంటే.. ఒక‌ప్పుడు చంద్ర‌బాబుకు క్లాస్ అనే పేరున్న నేప‌థ్యంలో ఇప్పుడు ఆయ‌న క్లాస్‌-మాస్‌ల క‌ల‌యిక‌గా పాల‌న‌ను ముందుకు సాగిస్తున్నారు. త‌ద్వారా పేద‌ల‌కు చేరువ అవుతున్నారు. ఒక‌ప్పుడు మాస్ నాయ‌కుడిగా జ‌గ‌న్‌కు పేరుండేది. త‌ర్వాత‌.. ఆయ‌న అధికారంలోకి వ‌చ్చాక‌.. దానిని ప‌క్క‌న పెట్టారు. బ‌ట‌న్ నొక్కుడు వ‌ర‌కు ప‌రిమితం అయ్యారు. దీనివ‌ల్ల ప్ర‌జ‌ల‌కు చేరువ కాలేక పోయార‌న్న వాద‌న వినిపించింది.

ఈ నేప‌థ్యంలో క్లాస్‌తోపాటు మాస్‌ను కూడా ఆక‌ట్టుకునేందుకు చంద్ర‌బాబు ఇప్పుడు నూత‌న మార్గం ఎంపిక చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ప్ర‌తి నెలా 1న మాస్‌తో మ‌మేకం అవుతున్నారు. తాజాగా తూర్పుగోదావ‌రి జిల్లా మ‌ల‌క‌ప‌ల్లిలో ప‌ర్య‌టించిన ఆయ‌న‌.. చ‌ర్మ‌కార కుటుంబానికి చెందిన పోశ‌య్య‌తో క‌లిసి.. రెండు మూడు గంట‌ల‌పాటు గ‌డిపారు. వారి ఇంటికి వెళ్లారు. ఇంటి గుమ్మంలోని మెట్ల‌పైనే కూర్చున్నారు. వారి క‌ష్ట‌సుఖాలు తెలుసుకుని చెప్పులు ఎలాకుడ‌తారో అడిగి తెలుసుకున్నారు. డ‌ప్పు వాయించారు. ఇలా.. మాస్‌లో ఒక విధ‌మైన చ‌ర్చ‌కు వ‌చ్చేలా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించారు. ఈ త‌ర‌హా ప‌రిస్థితి చంద్ర‌బాబుకు మాస్ నేత‌గా ముద్ర వేసేందుకు అవ‌కాశం ఉందన్న వాద‌న వినిపిస్తోంది.

గ‌తానికి భిన్నంగా!

ఇక‌, చంద్ర‌బాబు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టుగా కూడా తెలుస్తోంది. ఆయ‌న ఎక్క‌డ‌కు వెళ్లినా స‌హ‌జంగా స్థానిక అధికారులు, నాయ‌కులు, ఆయా జిల్లాల‌కు చెందిన మంత్రులు పుష్ఫ‌గుచ్ఛాలు, శాలువాలతో ఘ‌నంగా ఎదురేగి స్వాగ‌తాలు ప‌లుకు తారు. అయితే.. ఇవ‌న్నీ వ‌ద్ద‌నుకున్నారో.. ఏమో చంద్ర‌బాబు తాజాగా తూర్పుగోదావ‌రి ప‌ర్య‌ట‌న‌లో వాటిని ప‌క్క‌న పెట్టారు. దీంతో నాయ‌కులు, అధికారులు కేవ‌లం ఒకే ఒక్క గులాబీ పువ్వుతో ఆయ‌న‌ను స్వాగ‌తం ప‌లికారు. ఇది కూడా డౌన్ టు ఎర్త్ అనే మాట‌ను గుర్తు చేసింది. మ‌రి దీనిని మున్ముందు కూడా కొన‌సాగిస్తారో.. లేదో చూడాలి.

Kumar

Recent Posts

ప్రభాస్ సినిమా పోతుందని ముందే తెలుసట

‘బాహుబలి’కి ముందు ప్రభాస్ కెరీర్లో అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘రెబల్’ ఒకటి. కింగ్ నాగార్జునతో ‘మాస్’ లాంటి బ్లాక్…

3 hours ago

లెనిన్ మీద మెగాభిమానుల గుస్సా

అదేంటి లెనిన్ మీద మెగా ఫ్యాన్స్ కి కోపం ఎందుకు వస్తుందనుకుంటున్నారా. మ్యాటర్ ఉంది లెండి. కొంచెం ఫ్లాష్ బ్యాక్…

4 hours ago

చిరుకు తండ్రిగా గ‌ర్వం… న‌టుడిగా క‌ష్టం

రెండో సినిమా మ‌గ‌ధీర‌తోనే తాను తండ్రికి త‌గ్గ త‌న‌యుడిని అని చాటుకున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. ఇక…

6 hours ago

పాప రాలేదు.. కుక్క ఇక లేదు.. ఏపీకి స‌వాల్‌గా కేసు!

ఏపీ ప్ర‌భుత్వానికి.. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా పోలీసుల‌కు కూడా ఓ కేసు స‌వాల్‌గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…

6 hours ago

కంగనా క్రేజ్ మటాష్

ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…

8 hours ago

ఐశ్వర్య చెప్పింది నిజమేనా?

ఈ రోజుల్లో ఏ సినిమా ఎలా ఆడుతుందో అంచనా వేయలేని పరిస్థితి. స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేస్తాయన్న గ్యారెంటీ…

9 hours ago