Political News

క్లాస్ అండ్ మాస్‌.. చంద్ర‌బాబు న్యూ యాంగిల్‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటే.. ఐటీ మ్యాన్ అనే పేరుంది. ఆయ‌న ఉన్న‌త వ‌ర్గాల‌కు చేరువ‌గా ఉంటార‌న్న నానుడి కూడా ఉంది. అయితే.. ఇది గ‌తం. కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ఆయ‌న మాస్‌కు చేరువ అవుతున్నారు. ప్ర‌తి నెలా 1న సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌ను పంపిణీ చేసేందుకు వెళ్లే క్ర‌మంలో ఆయ‌న పూర్తిస్థాయి మాస్ నాయ‌కుడిగా మారుతున్నారు. అంతేకాదు.. మాస్‌తో క‌లిసి పోతున్నారు. వారింట్లో టీ, కాఫీలు త‌యారు చేస్తూ.. తాను తాగుతూ.. వారికి కూడా ఇస్తున్నారు. ఇలా.. మాస్ యాంగిల్‌లో చంద్ర‌బాబు మెప్పిస్తున్నారు.

ఇదేస‌మ‌యంలో అమ‌రావ‌తి స‌హా ఇత‌ర ప్రాజెక్టుల విష‌యంపై ఉన్న‌త‌స్థాయి చ‌ర్చ‌లు జ‌ర‌పాల్సి వ‌చ్చిన‌ప్పుడు.. క్లాస్ కోణంలో క‌నిపిస్తున్నారు. అయితే.. ఎవ‌రినీ విడిచిపెట్ట‌కుండా ఆయా వ‌ర్గాల‌కు చేరువ అవుతున్నారు. అంటే.. ఒక‌ప్పుడు చంద్ర‌బాబుకు క్లాస్ అనే పేరున్న నేప‌థ్యంలో ఇప్పుడు ఆయ‌న క్లాస్‌-మాస్‌ల క‌ల‌యిక‌గా పాల‌న‌ను ముందుకు సాగిస్తున్నారు. త‌ద్వారా పేద‌ల‌కు చేరువ అవుతున్నారు. ఒక‌ప్పుడు మాస్ నాయ‌కుడిగా జ‌గ‌న్‌కు పేరుండేది. త‌ర్వాత‌.. ఆయ‌న అధికారంలోకి వ‌చ్చాక‌.. దానిని ప‌క్క‌న పెట్టారు. బ‌ట‌న్ నొక్కుడు వ‌ర‌కు ప‌రిమితం అయ్యారు. దీనివ‌ల్ల ప్ర‌జ‌ల‌కు చేరువ కాలేక పోయార‌న్న వాద‌న వినిపించింది.

ఈ నేప‌థ్యంలో క్లాస్‌తోపాటు మాస్‌ను కూడా ఆక‌ట్టుకునేందుకు చంద్ర‌బాబు ఇప్పుడు నూత‌న మార్గం ఎంపిక చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ప్ర‌తి నెలా 1న మాస్‌తో మ‌మేకం అవుతున్నారు. తాజాగా తూర్పుగోదావ‌రి జిల్లా మ‌ల‌క‌ప‌ల్లిలో ప‌ర్య‌టించిన ఆయ‌న‌.. చ‌ర్మ‌కార కుటుంబానికి చెందిన పోశ‌య్య‌తో క‌లిసి.. రెండు మూడు గంట‌ల‌పాటు గ‌డిపారు. వారి ఇంటికి వెళ్లారు. ఇంటి గుమ్మంలోని మెట్ల‌పైనే కూర్చున్నారు. వారి క‌ష్ట‌సుఖాలు తెలుసుకుని చెప్పులు ఎలాకుడ‌తారో అడిగి తెలుసుకున్నారు. డ‌ప్పు వాయించారు. ఇలా.. మాస్‌లో ఒక విధ‌మైన చ‌ర్చ‌కు వ‌చ్చేలా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించారు. ఈ త‌ర‌హా ప‌రిస్థితి చంద్ర‌బాబుకు మాస్ నేత‌గా ముద్ర వేసేందుకు అవ‌కాశం ఉందన్న వాద‌న వినిపిస్తోంది.

గ‌తానికి భిన్నంగా!

ఇక‌, చంద్ర‌బాబు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టుగా కూడా తెలుస్తోంది. ఆయ‌న ఎక్క‌డ‌కు వెళ్లినా స‌హ‌జంగా స్థానిక అధికారులు, నాయ‌కులు, ఆయా జిల్లాల‌కు చెందిన మంత్రులు పుష్ఫ‌గుచ్ఛాలు, శాలువాలతో ఘ‌నంగా ఎదురేగి స్వాగ‌తాలు ప‌లుకు తారు. అయితే.. ఇవ‌న్నీ వ‌ద్ద‌నుకున్నారో.. ఏమో చంద్ర‌బాబు తాజాగా తూర్పుగోదావ‌రి ప‌ర్య‌ట‌న‌లో వాటిని ప‌క్క‌న పెట్టారు. దీంతో నాయ‌కులు, అధికారులు కేవ‌లం ఒకే ఒక్క గులాబీ పువ్వుతో ఆయ‌న‌ను స్వాగ‌తం ప‌లికారు. ఇది కూడా డౌన్ టు ఎర్త్ అనే మాట‌ను గుర్తు చేసింది. మ‌రి దీనిని మున్ముందు కూడా కొన‌సాగిస్తారో.. లేదో చూడాలి.

This post was last modified on July 2, 2025 9:46 am

Share
Show comments
Published by
Kumar
Tags: Chandrababu

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

23 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago