Political News

సిగాచీ యాజమాన్యానికి ఎందుకింత నిర్లక్ష్యం..?

తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు పటాన్ చెరు పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలో కార్యకలాపాలు సాగిస్తున్న సిగాచీ కెమికల్ కంపెనీపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిగాచీలో సోమవారం ఉదయం భారీ రియాక్టర్ పేలగా.. ప్రమాదంలో ఇప్పటిదాకా 39 మంది చనిపోగా… 35 మంది చికిత్స పొందుతున్నారు. ఇక ఇంకో 43 మంది కంపెనీ కార్మికుల జాడే తెలియడం లేదు. ప్రమాదం జరిగి బుధవారం ఉదయానికి 48 గంటలు పూర్తి కానుంది. అయినా కూడా కంపెనీ యాజమాన్యం నుంచి ఇప్పటిదాకా చిన్న ప్రకటన కూడా విడుదల కాలేదు.

సిగారీ కంపెనీ యాజమాన్యం గురించిన వివరాల్లోకి వెళ్లితే… ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని ఆ రాష్ట్ర వాణిజ్య రాజధాని అహ్మదాబాద్ కు చెందిన బడా పారిశ్రామికవేత్తల కుటుంబం ఈ కంపెనీని నడుపుతోంది. ఈ కంపెనీకి దాదాపుగా 40 ఏళ్ల ప్రస్థానం ఉంది. హైదరాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా మరో 3 యూనిట్లు ఈ కంపెనీకి ఉన్నాయి. ఇదే విషయాన్ని మంగళవారం ఉదయం ప్రమాద స్థలిని పరిశీలించిన సందర్బంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. కంపెనీకి ఇంకా యూనిట్లు ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ రావడం కాస్త ఆలస్యం అయ్యిందని ఆయన చెప్పుకొచ్చారు.

ఇక సిగాచీ తయారు చేస్తున్న కెమికల్ ఉత్పత్తులు ప్రపంచంలోని చాలా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీ వార్షిక టర్నోవర్ రూ.500 కోట్లకు పైగానే ఉందని సమాచారం. ఈ లెక్కన ఈ కంపెనీ ఏ రకంగా చూసినా చిన్న కంపెనీ ఏమీ కాదు. ఏళ్ల తరబడి కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీ ద్వారా యాజమాన్యం భారీ ఎత్తున లాభాలు గడించి ఉంటుందని కూడా విశ్లేషణలు సాగుతున్నాయి. ఇంత సమర్థత ఉండి, ఆర్థిక వనరులు ఉండి కూడా ఆ కంపెనీ యాజమాన్యం ఎందుకు ఇంకా దోబూచులాడుతోందన్నది అర్థం కాని ప్రశ్న.

కంపెనీ యాజమాన్యం నుంచి స్పందన లేని తీరును చూసి మంగళవారం ఉదయం ప్రమాద స్థలిని సందర్శించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీకి సంబంధించి అందుబాటులో ఉన్న ప్రతినిదులతో మాట్లాడిన ఆయన మరింతగా ఆగ్రహానికి గురయ్యారు. వెరసి కంపెనీ యాజమాన్యంపై తక్షణమే కేసు నమోదు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేయగా… మంగళవారం మధ్యాహ్నమే కేసు నమోదు అయిపోయింది. ఇక బుధవారం కూడా యాజమాన్యం నుంచి స్పందన లేకపోతే మాత్రం కంపెనీ ఆస్తులను సీజ్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.

This post was last modified on July 1, 2025 10:43 pm

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

1 hour ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

3 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

3 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

3 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

5 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

8 hours ago