Political News

`చెల్లి` మాటెత్త‌కుండా.. `అమ్మ‌`కు జ‌గ‌న్‌ క్రెడిట్!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. తాజాగా వైసీపీ యువ జ‌న విభాగం కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌తో తాడేప‌ల్లిలోని నివా సంలో భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువ‌జ‌న విభాగం కార్య‌క‌ర్త‌ల‌ను ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పార్టీ ప్ర‌స్తానం నుంచి గ‌త ఏడాది ఎన్నిక‌ల వ‌ర‌కు జ‌రిగిన అన్ని విష‌యాల‌ను వారితో పంచుకున్నారు. అంతేకాదు.. యువ‌జ‌న విభాగంతో జ‌గ‌న్ భేటీ కావ‌డం కూడా.. గ‌త 7 సంవ‌త్స‌రాల్లోఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.

ఈ క్ర‌మంలో జ‌గ‌న్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి అన్యాయం చేసింద‌ని.. అందుకే తాను ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాన‌న్నారు. ఈ క్ర‌మంలోనే “అమ్మ‌(విజ‌య‌మ్మ‌) నేను క‌లిసి పార్టీ పెట్టాం. అనేక క‌ష్టాలు ఎదుర్కొన్నాం. పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాం. దీనికి కొంద‌రు సాయం చేశారు. మ‌రికొంద‌రు స్వ‌చ్ఛందంగా త‌ర‌లి వ‌చ్చారు. అంద‌రూ క‌లిసి పార్టీని బ‌లోపేతం చేసుకున్నారు“ అని జ‌గ‌న్ వివ‌రించారు.

2019లో పార్టీ విజ‌యం ద‌క్కించుకుని అధికారంలోకి వ‌చ్చింద‌ని.. 2014లో తృటిలో అధికారం కోల్పోయిందని ఆయ‌న వివ‌రించారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి యువ‌త మ‌రింత కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని జ‌గ‌న్ చెప్పారు. సోష‌ల్ మీడియా ద్వారా యుద్ధం చేయాల‌ని యువ‌త‌కు దిశానిర్దేశం చేశారు. అంతేకాదు.. యువ‌త ఇప్పుడు యాక్టివ్ గా ఉంటే.. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వారికి ప్రాధాన్యం ఇస్తామ‌న్నారు. ఈ విష‌యంలో అంద‌రూ స్పందించాల‌ని కోరారు.

కాగా.. పార్టీ ఇబ్బందుల్లో ఉన్న స‌మ‌యంలో అమ్మ-నేను అంటూ.. జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై యువ‌త సైతం విస్మ‌యం వ్య‌క్తం చేశారు. విజ‌య‌మ్మ‌, జ‌గ‌న్‌తోపాటు.. ష‌ర్మిల కూడా చ‌మ‌టొడ్చిన విష‌యం ఎవ‌రూ మ‌రిచి పోలేదు. ఆమెతో ఇప్పుడు రాజ‌కీయంగా వివాదాలు.. ఆస్తుల ప‌రంగా కొట్లాట‌లు ఉన్నా.. గ‌తంలో పార్టీ కోసంఆమె 3 వేల కిలో మీట‌ర్ల మేర‌కు పాద‌యాత్ర చేసిన విష‌యం జ‌గ‌న్ మ‌రిచిపోవ‌డం స‌రికాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మైంది. “అమ్మ‌-నేను.. ష‌ర్మిల కూడా పార్టీ కోసం క‌ష్ట‌ప‌డ్డాం“ అని ఒక్క మాట అని ఉంటే బాగుండేద‌న్న అభిప్రాయం చాలా మంది వ్య‌క్తం చేశారు.

This post was last modified on July 1, 2025 3:19 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

39 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

12 hours ago