గత ఏడాది ఎన్నికల్లో వైసీపీ తరఫున 175 మంది పోటీ చేస్తే.. 164 మంది పరాజయం పాలయ్యారు. వీరిలో ఉద్ధండులు.. మేదావులు.. అసలు గెలుపే తప్ప.. ఓటమి అన్న మాటే తెలియని నాయకులు ఉన్నారు. మరి ఎందుకు ఓడారంటే.. వైసీపీ వాదన ఒకవిధంగా ఉంది. కూటమి ప్రభావం, తమకంటే ఎక్కువ సంక్షేమం అమలు చేస్తామని కూటమి నాయకులు ఇచ్చిన హామీలతోనే తాము ఓడామని అంటున్నారు. కానీ, సర్వేపల్లి, గుడివాడ, ప్రొద్దుటూరు, నెల్లూరు సిటీ, ఆత్మకూరు వంటి కీలక నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ఓడింది.
ఇవేకాదు.. 75 బలమైన నియోజకవర్గాల్లో పార్టీ ఓడింది. అంటే.. కేవలం కూటమి ఇచ్చిన హామీలే కారణమా? అంటే.. వైసీపీ వాదన ఎలా ఉన్నా.. అక్కడి నుంచి పోటీ చేసిన వారిపైఉన్న వ్యతిరేకత పెరగడం వల్లేనని పరిశీలకులు చెబుతున్నారు. దీనికితోడు.. 30-40 నియోజకవర్గాల్లో చేసిన ప్రయోగాలు కూడా(ని యోజకవర్గాల షఫ్లింగ్) వికటించాయి. కట్ చేస్తే.. ఇప్పడు పరిస్థితి ఏంటి? ఓడిన వారు తిరిగి గెలుస్తారా? ఇప్పుడు వారిలో ఆ సత్తా ఉందా? అనేది ప్రశ్న.
ఎందుకంటే.. ప్రత్యామ్నాయ నాయకులను ఇంకా జగన్ వెతకడం లేదు. పైగా.. ఎవరూ కనిపించడం కూడా లేదు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకులు ఉన్నా.. చాలా వరకు నియోజకవర్గాల్లో తిరిగి పాతకాపులకే టికెట్లు ఇవ్వాలి. అయితే… వీరిపై ప్రజల్లో వ్యతిరేకత ఎంత అనేది వైసీపీ అంచనా వేయడం లేదు. అంతా కూటమి వల్లే.. కూటమి ప్రభావం వల్లే ఓడామని అంచనా వేసుకుని.. అక్కడే ఆగిపోతోంది. కానీ.. వాస్తవానికి వ్యక్తిగత వ్యతిరేకత కూడా ఉంటుంది.
దీనివల్ల కూడా వైసీపీ నాయకులు పరాజయం పాలయ్యారు. దీనిని అంచనా వేసి.. తప్పులు జరిగిన చోట సరిదిద్దే ప్రయత్నాలు ఇంకా చేయడం లేదు. ప్రజల్లోకి నాయకులను పంపిస్తున్నా.. టీడీపీ పాలనను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కానీ.. ప్రజల నుంచి `మీ హయాంలో ఏం జరిగిందన్న` ప్రశ్నలకు వైసీపీ నేతల వద్ద సమాధానం లేదు. దీనికి కారణం చాలా మంది నాయకులు వ్యక్తిగతంగా కూడా ఫేడ్ అవుట్ అయ్యారు. సో.. వీరిని సంస్కరించకుండా.. అలానే రంగంలోకి దిగితే.. గత ఎన్నికల్లో ఓడిన వీరు ఏమేరకు వికసిస్తారన్నది ప్రశ్నార్థకమేనని పరిశీలకులు చెబుతున్నారు.
This post was last modified on July 1, 2025 3:08 pm
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…
ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…
వైసీపీ అధినేత జగన్కు సోదరుడి వరుసయ్యే కడప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…