గత ఏడాది ఎన్నికల్లో వైసీపీ తరఫున 175 మంది పోటీ చేస్తే.. 164 మంది పరాజయం పాలయ్యారు. వీరిలో ఉద్ధండులు.. మేదావులు.. అసలు గెలుపే తప్ప.. ఓటమి అన్న మాటే తెలియని నాయకులు ఉన్నారు. మరి ఎందుకు ఓడారంటే.. వైసీపీ వాదన ఒకవిధంగా ఉంది. కూటమి ప్రభావం, తమకంటే ఎక్కువ సంక్షేమం అమలు చేస్తామని కూటమి నాయకులు ఇచ్చిన హామీలతోనే తాము ఓడామని అంటున్నారు. కానీ, సర్వేపల్లి, గుడివాడ, ప్రొద్దుటూరు, నెల్లూరు సిటీ, ఆత్మకూరు వంటి కీలక నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ఓడింది.
ఇవేకాదు.. 75 బలమైన నియోజకవర్గాల్లో పార్టీ ఓడింది. అంటే.. కేవలం కూటమి ఇచ్చిన హామీలే కారణమా? అంటే.. వైసీపీ వాదన ఎలా ఉన్నా.. అక్కడి నుంచి పోటీ చేసిన వారిపైఉన్న వ్యతిరేకత పెరగడం వల్లేనని పరిశీలకులు చెబుతున్నారు. దీనికితోడు.. 30-40 నియోజకవర్గాల్లో చేసిన ప్రయోగాలు కూడా(ని యోజకవర్గాల షఫ్లింగ్) వికటించాయి. కట్ చేస్తే.. ఇప్పడు పరిస్థితి ఏంటి? ఓడిన వారు తిరిగి గెలుస్తారా? ఇప్పుడు వారిలో ఆ సత్తా ఉందా? అనేది ప్రశ్న.
ఎందుకంటే.. ప్రత్యామ్నాయ నాయకులను ఇంకా జగన్ వెతకడం లేదు. పైగా.. ఎవరూ కనిపించడం కూడా లేదు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకులు ఉన్నా.. చాలా వరకు నియోజకవర్గాల్లో తిరిగి పాతకాపులకే టికెట్లు ఇవ్వాలి. అయితే… వీరిపై ప్రజల్లో వ్యతిరేకత ఎంత అనేది వైసీపీ అంచనా వేయడం లేదు. అంతా కూటమి వల్లే.. కూటమి ప్రభావం వల్లే ఓడామని అంచనా వేసుకుని.. అక్కడే ఆగిపోతోంది. కానీ.. వాస్తవానికి వ్యక్తిగత వ్యతిరేకత కూడా ఉంటుంది.
దీనివల్ల కూడా వైసీపీ నాయకులు పరాజయం పాలయ్యారు. దీనిని అంచనా వేసి.. తప్పులు జరిగిన చోట సరిదిద్దే ప్రయత్నాలు ఇంకా చేయడం లేదు. ప్రజల్లోకి నాయకులను పంపిస్తున్నా.. టీడీపీ పాలనను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కానీ.. ప్రజల నుంచి `మీ హయాంలో ఏం జరిగిందన్న` ప్రశ్నలకు వైసీపీ నేతల వద్ద సమాధానం లేదు. దీనికి కారణం చాలా మంది నాయకులు వ్యక్తిగతంగా కూడా ఫేడ్ అవుట్ అయ్యారు. సో.. వీరిని సంస్కరించకుండా.. అలానే రంగంలోకి దిగితే.. గత ఎన్నికల్లో ఓడిన వీరు ఏమేరకు వికసిస్తారన్నది ప్రశ్నార్థకమేనని పరిశీలకులు చెబుతున్నారు.
This post was last modified on July 1, 2025 3:08 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…