గత ఏడాది ఎన్నికల్లో వైసీపీ తరఫున 175 మంది పోటీ చేస్తే.. 164 మంది పరాజయం పాలయ్యారు. వీరిలో ఉద్ధండులు.. మేదావులు.. అసలు గెలుపే తప్ప.. ఓటమి అన్న మాటే తెలియని నాయకులు ఉన్నారు. మరి ఎందుకు ఓడారంటే.. వైసీపీ వాదన ఒకవిధంగా ఉంది. కూటమి ప్రభావం, తమకంటే ఎక్కువ సంక్షేమం అమలు చేస్తామని కూటమి నాయకులు ఇచ్చిన హామీలతోనే తాము ఓడామని అంటున్నారు. కానీ, సర్వేపల్లి, గుడివాడ, ప్రొద్దుటూరు, నెల్లూరు సిటీ, ఆత్మకూరు వంటి కీలక నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ఓడింది.
ఇవేకాదు.. 75 బలమైన నియోజకవర్గాల్లో పార్టీ ఓడింది. అంటే.. కేవలం కూటమి ఇచ్చిన హామీలే కారణమా? అంటే.. వైసీపీ వాదన ఎలా ఉన్నా.. అక్కడి నుంచి పోటీ చేసిన వారిపైఉన్న వ్యతిరేకత పెరగడం వల్లేనని పరిశీలకులు చెబుతున్నారు. దీనికితోడు.. 30-40 నియోజకవర్గాల్లో చేసిన ప్రయోగాలు కూడా(ని యోజకవర్గాల షఫ్లింగ్) వికటించాయి. కట్ చేస్తే.. ఇప్పడు పరిస్థితి ఏంటి? ఓడిన వారు తిరిగి గెలుస్తారా? ఇప్పుడు వారిలో ఆ సత్తా ఉందా? అనేది ప్రశ్న.
ఎందుకంటే.. ప్రత్యామ్నాయ నాయకులను ఇంకా జగన్ వెతకడం లేదు. పైగా.. ఎవరూ కనిపించడం కూడా లేదు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకులు ఉన్నా.. చాలా వరకు నియోజకవర్గాల్లో తిరిగి పాతకాపులకే టికెట్లు ఇవ్వాలి. అయితే… వీరిపై ప్రజల్లో వ్యతిరేకత ఎంత అనేది వైసీపీ అంచనా వేయడం లేదు. అంతా కూటమి వల్లే.. కూటమి ప్రభావం వల్లే ఓడామని అంచనా వేసుకుని.. అక్కడే ఆగిపోతోంది. కానీ.. వాస్తవానికి వ్యక్తిగత వ్యతిరేకత కూడా ఉంటుంది.
దీనివల్ల కూడా వైసీపీ నాయకులు పరాజయం పాలయ్యారు. దీనిని అంచనా వేసి.. తప్పులు జరిగిన చోట సరిదిద్దే ప్రయత్నాలు ఇంకా చేయడం లేదు. ప్రజల్లోకి నాయకులను పంపిస్తున్నా.. టీడీపీ పాలనను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కానీ.. ప్రజల నుంచి `మీ హయాంలో ఏం జరిగిందన్న` ప్రశ్నలకు వైసీపీ నేతల వద్ద సమాధానం లేదు. దీనికి కారణం చాలా మంది నాయకులు వ్యక్తిగతంగా కూడా ఫేడ్ అవుట్ అయ్యారు. సో.. వీరిని సంస్కరించకుండా.. అలానే రంగంలోకి దిగితే.. గత ఎన్నికల్లో ఓడిన వీరు ఏమేరకు వికసిస్తారన్నది ప్రశ్నార్థకమేనని పరిశీలకులు చెబుతున్నారు.
This post was last modified on July 1, 2025 3:08 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…