టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. నాలుగున్నర దశాబ్దాల తన రాజకీయ ప్రస్థానంలో తన పార్టీ వ్యవహారాలు కాకుండా ఇతరత్రా పార్టీల పనుల్లో చంద్రబాబు వేళ్లు, కాళ్లు పెట్టిన సందర్భాలే లేవని చెప్పాలి. ఇక పొత్తుల్లో ఉన్న పార్టీల వ్యవహారాల్లోనూ ఉమ్మడి నిర్ణయాలైతేనే చంద్రబాబు ఎంటర్ అవుతారు.. అలా కాకుండా కూటమిలోని ఏ ఒక్క రాజకీయ పార్టీ వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు. అలాంటి బాబుపై ఇప్పుడు ఓ ఆరోపణ వచ్చింది. ఆ ఆరోపణ చేసింది కాంగ్రెస్ పార్టీ అంట. దానిని ఖండించింది మాత్రం బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్. అంటే.. ఈ వ్యవహారంలో బాబు ప్రమేయం లేకుండానే ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి.
చంద్రబాబుపై వచ్చిన ఆ ఆరోపణ ఏమిటంటే… ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర శాఖల అధ్యక్షుల ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపుగా అభ్యర్థుల ఖరారు కూడా పూర్తి అయ్యింది. ఏపీకి మాధవ్, తెలంగాణకు రాంచందర్ రావులు ఎన్నికయ్యారు. అధికార ప్రకటన మంగళవారం రానుంది. ఇక్కడిదాకా బాగానే ఉన్నా.ఈ ఇద్దరి ఎంపికల వెనుక చంద్రబాబు హస్తం ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించిందట. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ అధినేత ఎలా చెబితే అలా నడిచేందుకు బీజేపీ నేతలు జీహుజూర్ అంటున్నారని ఆ పార్టీ నేతలు సెటైర్లు సంధించారు. అసలు కాంగ్రెస్ నుంచి ఈ ఆరోపణలు గుప్పించింది ఎవరన్న విషయం ఇప్పటిదాకా తెలియరాలేదు.
అసలు కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోపణలు చేసిందో, లేదో అన్న విషయాన్ని నిర్ధారించుకోకుండానే… తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష అభ్యర్థి ఎంపిక పూర్తి అయిన వెంటనే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మీడియా ముందుకు వచ్చి తన పార్టీ వ్యవహారాలను ప్రస్తావించడం మానేసి… చంద్రబాబు జోక్యంపై విమర్శలు గుప్పించారు. బీజేపీ సంస్థాగత ఎన్నికల్లో వేరే పార్టీలకు చెందిన నేతలకు ఎంతమాత్రం సంబంధం ఉండబోదని ఆయన అన్నారు. చంద్రబాబు సలహాలతో తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షులను నియమించుకునేంత దీన స్థితిలో బీజేపీ లేదని ఆయన ఓ రేంజిలో బాధ పడ్డారు. అనవసరమైన విషయాలను పట్టుకుని కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాస్తవంగా ఏపీలో మొన్నామధ్య మూడు ఎంపీ సీట్లు ఖాళీ అయితే రెండు సీట్లను తీసుకున్న టీడీపీ, ఓ సీటును బీజేపీకి కేటాయించింది. ఈ సీటును ఎవరికి కేటాయించాలన్న విషయంపై చంద్రబాబు మాటమాత్రంగా కూడా ప్రస్తావించలేదు. ఇక ఆ తర్వాత కూటమికి ఎమ్మెల్సీ సీట్లు లభించగా… వాటిలో ఓ సీటును బీజేపీకి కేటాయిస్తే… దానిని బీజేపీ అధిష్ఠానం చంద్రబాబు అంటే గిట్టని సోము వీర్రాజుకు కేటాయించింది. ఈ నిర్ణయాన్ని చంద్రబాబు ఆహ్వానించారు కూడా. ఇక ఇటీవలే రాజకీయాలకు గుడ్ బై చెప్పిన సాయిరెడ్డి కారణంగా ఖాళీ అయిన సీటును చంద్రబాబు బీజేపీకే కేటాయించారు. ఈ సీటును బీజేపీ అధిష్ఠానం ఏ ఒక్కరూ ఊహించని రీతిలో పాకా సత్యనారాయణకు కేటాయించింది. ఈ నిర్ణయాన్ని కూడా బాబు అసలు ఎంతమాత్రం పట్టించుకోలేదు. అలాంటి బాబు బీజేపీ సంస్థాగత ఎన్నికల్లో ఎందుకు కల్పించుకుంటారు?
This post was last modified on June 30, 2025 10:08 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…