ఏపీ బీజేపీ అధ్యక్ష పీఠానికి ఎవరిని ఎన్నుకుంటారు? ఎవరికి పగ్గాలు అప్పగిస్తారు? సామాజికవర్గ సమీకరణకు ప్రాధాన్యం ఇస్తారా? లేక డబ్బులున్న వారికే కట్టబెడతారా? అనే సుదీర్ఘ చర్చలకు తెర దించుతూ .. బీజేపీ అధిష్టానం.. ఏపీ బీజేపీ సారథిగా పోకల వంశీ నాగేంద్ర మాధవ్(పీవీఎన్ మాధవ్)కు అవకాశం ఇచ్చింది. అయితే.. యథావిధిగా ఎన్నికల క్రతువు అయితే జరుగుతుంది. కానీ, ఇది లాంఛన ప్రాయమే. ఉత్తరాంధ్రలోని విశాఖకు చెందిన మాధవ్ ఎమ్మెల్సీగా గతంలో పనిచేశారు.
అయితే.. ఈ ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి అధిష్టానం నుంచి టికెట్ తెచ్చుకున్నా.. అనూహ్యంగా ఆయన పరాజయం పాలయ్యారు. కాగా.. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న మాధవ్.. విధేయతకు, విశ్వసనీయతకు మారు పేరు. విమర్శలకు వివాదాలకు కడు దూరంగా ఉండే మాధవ్ ఆర్ ఎస్ ఎస్ సిద్దాంతాలు.. హిందూత్వకు పెద్దపీట వేస్తారు. గతంలో తన తండ్రి చలపతిరావు రాజకీయ వారసుడిగా వచ్చిన ఆయన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి చేశారు.
అంతేకాదు.. అన్ని పార్టీలనూ కలుపుకొని పోయే నాయకుడిగా కూడా మాధవ్ పేరు తెచ్చుకున్నారు. మంగళవారం నిర్వహించే ఎన్నికలకు పార్టీ అధిష్టానం.. మాధవ్ పేరునే సూచించింది. దీంతో ఆయన నామినే షన్ వేయడంతోపాటు.. ఎన్నిక కూడా లాంఛనమే. కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి సర్కారు ఉన్న నేపథ్యంలో బీజేపీని టీడీపీ-జనసేనతో సమాంతరంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మాధవ్పైనే ఉంటుంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన మాధవ్… వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్న దరిమిలా.. ఆయన అనుభవం కూడా పార్టీని పుంజుకునేలా చేస్తుందనడంలో సందేహం లేదు.
This post was last modified on June 30, 2025 6:35 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…