ఏపీ బీజేపీ అధ్యక్ష పీఠానికి ఎవరిని ఎన్నుకుంటారు? ఎవరికి పగ్గాలు అప్పగిస్తారు? సామాజికవర్గ సమీకరణకు ప్రాధాన్యం ఇస్తారా? లేక డబ్బులున్న వారికే కట్టబెడతారా? అనే సుదీర్ఘ చర్చలకు తెర దించుతూ .. బీజేపీ అధిష్టానం.. ఏపీ బీజేపీ సారథిగా పోకల వంశీ నాగేంద్ర మాధవ్(పీవీఎన్ మాధవ్)కు అవకాశం ఇచ్చింది. అయితే.. యథావిధిగా ఎన్నికల క్రతువు అయితే జరుగుతుంది. కానీ, ఇది లాంఛన ప్రాయమే. ఉత్తరాంధ్రలోని విశాఖకు చెందిన మాధవ్ ఎమ్మెల్సీగా గతంలో పనిచేశారు.
అయితే.. ఈ ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి అధిష్టానం నుంచి టికెట్ తెచ్చుకున్నా.. అనూహ్యంగా ఆయన పరాజయం పాలయ్యారు. కాగా.. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న మాధవ్.. విధేయతకు, విశ్వసనీయతకు మారు పేరు. విమర్శలకు వివాదాలకు కడు దూరంగా ఉండే మాధవ్ ఆర్ ఎస్ ఎస్ సిద్దాంతాలు.. హిందూత్వకు పెద్దపీట వేస్తారు. గతంలో తన తండ్రి చలపతిరావు రాజకీయ వారసుడిగా వచ్చిన ఆయన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి చేశారు.
అంతేకాదు.. అన్ని పార్టీలనూ కలుపుకొని పోయే నాయకుడిగా కూడా మాధవ్ పేరు తెచ్చుకున్నారు. మంగళవారం నిర్వహించే ఎన్నికలకు పార్టీ అధిష్టానం.. మాధవ్ పేరునే సూచించింది. దీంతో ఆయన నామినే షన్ వేయడంతోపాటు.. ఎన్నిక కూడా లాంఛనమే. కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి సర్కారు ఉన్న నేపథ్యంలో బీజేపీని టీడీపీ-జనసేనతో సమాంతరంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మాధవ్పైనే ఉంటుంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన మాధవ్… వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్న దరిమిలా.. ఆయన అనుభవం కూడా పార్టీని పుంజుకునేలా చేస్తుందనడంలో సందేహం లేదు.
‘గుంటూరు కారం’ తర్వాత స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తీయాలనుకున్న చిత్రం.. గాడ్ ఆఫ్ వార్. తన కెరీర్లో తొలిసారిగా…
ఈ వారం విడుదల కాబోతున్న సింగ్ గీతం సినిమాకు టీమ్ చేస్తున్న ప్రమోషన్లు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. 94 వయసులో…
సుప్రసిద్ధ గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి బయోపిక్ తెరకెక్కించేందుకు గీత ఆర్ట్స్, బన్నీ వాస్ సంయక్తంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన హిట్ ఫ్రాంచైజ్ 'వెల్కమ్ టు ది జంగిల్' (వెల్కమ్ 3) కోసం…
పెద్ది మొదటి వారాంతం ఘనంగా పూర్తి చేసుకుంది. రెండు వందల యాభై కోట్లకు కొంచెం అటు ఇటు నెంబర్ నమోదు…
తెలంగాణ రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలతో మరోమారు వేడి రాజుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి జి.కిషన్…