“నీతీరేంది సామీ.. నువ్వే పార్టీలో ఉన్నావ్.. ? ఏం చేస్తున్నావ్?” ఇదీ.. వైసీపీకి చెందిన ఓ కీలక ఎంపీని ఉద్దేశించి.. ఆ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు. గత ఎన్నికల్లో వైసీపీకి నాలుగు ఎంపీ సీట్లు దక్కాయి. వీటిలో రాజంపేట నుంచి మిథున్ రెడ్డి, తిరుపతి నుంచి గురుమూర్తి, కడప నుంచి అవినాష్ రెడ్డి విజయం దక్కించుకున్నారు. అరకు నుంచి మాత్రం తనూజా రాణి తొలిసారి గెలుపు గుర్రం ఎక్కారు. ఈమె మహిళా నాయకురాలు. పైగా తొలిసారి రాజకీయాల్లోకి వచ్చారు.
అయితే.. తాజాగా తనూజా రాణి వ్యవహారంపై వైసీపీలో చర్చ జరుగుతోంది. ఆమె ఓ కీలక కూటమి పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని గత ఏడాది అక్టోబరులోనే రాజకీయ పొగ రాజుకుంది. అయితే.. దీనిని అప్పట్లో వైసీపీ లైట్ తీసుకుంది. కానీ, రానురాను ఆమె పార్టీకి దూరంగా ఉండడంతోపాటు కూటమిలోని ఓ కీలక పార్టీకి చేరువగా ఉండడంతో పార్టీ నాయకులు ఆమెపై ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. దీంతో జగన్ తాజాగా ఆమెపై సీరియస్ అయినట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.
కూటమి పార్టీల్లో ఉన్న ఓ కీలక పార్టీకి తనూజా రాణి చేరువగా ఉన్నారన్నది కొన్నాళ్లుగా వినిపిస్తున్నమాట. అయితే.. తొలిసారి ఎంపీ కావడంతోపాటు.. ఆమె వైసీపీ గీత దాటదని అనుకున్నారు. కానీ, గతంలో ఒక మహిళా ఎంపీ కూడా.. ఇలానే చేసిన నేపథ్యంలో వైసీపీ అలెర్టు అయింది. అంతేకాదు.. తాజాగా వెలుగు చూసిన సమాచారం మేరకు.. జగన్ను ధ్వేషించే ఓ మాజీ మహిళా ఎంపీనే ఇప్పుడు తనూజా రాణిని రాజకీయంగా ఎంగేజ్ చేస్తున్నట్టు ప్రచారంలో ఉంది.
ఈ నేపథ్యంలోనే జగన్ “నీతీరేంది సామీ..” అంటూ.. తనదైన పడికట్టు భాషలో ఆమెను ప్రశ్నించారని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఇంటింటికీ కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత కూడా..తనూజ ఎక్కడ కనిపించడం లేదని నాయకుల నుంచి రిపోర్టులు అందాయి. ఈ నేపథ్యంలో నువ్వు ఏ పార్టీ ఉన్నావ్? ఏం చేస్తున్నావ్? అని జగన్ గట్టిగానే తగులుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ PK .. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రత్యక్ష…
తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై…
వరసగా మూడు సూపర్ హిట్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ కి…
116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల…