బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కొంతకాలంగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాజా సింగ్ కు టికెట్ కూడా ఇవ్వరేమో అనుకున్నప్పటికీ…చివరకు ఆయనవైపే అధిష్టానం మొగ్గు చూపింది. ఆ తర్వాత కూడా బీజేపీపై రాజా సింగ్ సందర్భానుసారంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. దానికితోడు బీజేపీ చీఫ్ పదవికి ఎన్నిక నిర్వహించాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. అయితే, ఈ విషయం హైకమాండ్ కు నచ్చలేదు.
తాజాాగా తెలంగాణ బీజేపీ చీఫ్ రేసులో రాజా సింగ్ ఉన్నారు. అయితే, ఆయన నామినేషన్ స్వీకరించలేదు. ఈ క్రమంలోనే రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి అందజేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి వచ్చానని, తన అనుచరులను బెదిరించారని రాజా సింగ్ అసహనం వ్యక్తం చేశారు. బీజేపీకి రాజీనామా చేశానని, రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి అందజేశానని అన్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం తాను పోటీ పడగా ముగ్గురు కౌన్సిల్ మెంబర్స్ మద్దతుగా సంతకం పెట్టారని, వారిని బెదిరించారని ఆరోపించారు. ఈ ఎన్నికలు కేవలం నామామాత్రమేనని, ఎవరిని ప్రెసిడెంట్ చేయాలో ఆల్రెడీ డిసైడ్ చేశారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకూడదనుకునే వారి సంఖ్య పార్టీలో ఎక్కువైందని చెప్పారు. మీకో దండం.. మీ పార్టీకో దండం అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇన్ని సంవత్సరాలుగా పార్టీలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
This post was last modified on June 30, 2025 5:54 pm
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…