బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కొంతకాలంగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాజా సింగ్ కు టికెట్ కూడా ఇవ్వరేమో అనుకున్నప్పటికీ…చివరకు ఆయనవైపే అధిష్టానం మొగ్గు చూపింది. ఆ తర్వాత కూడా బీజేపీపై రాజా సింగ్ సందర్భానుసారంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. దానికితోడు బీజేపీ చీఫ్ పదవికి ఎన్నిక నిర్వహించాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. అయితే, ఈ విషయం హైకమాండ్ కు నచ్చలేదు.
తాజాాగా తెలంగాణ బీజేపీ చీఫ్ రేసులో రాజా సింగ్ ఉన్నారు. అయితే, ఆయన నామినేషన్ స్వీకరించలేదు. ఈ క్రమంలోనే రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి అందజేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి వచ్చానని, తన అనుచరులను బెదిరించారని రాజా సింగ్ అసహనం వ్యక్తం చేశారు. బీజేపీకి రాజీనామా చేశానని, రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి అందజేశానని అన్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం తాను పోటీ పడగా ముగ్గురు కౌన్సిల్ మెంబర్స్ మద్దతుగా సంతకం పెట్టారని, వారిని బెదిరించారని ఆరోపించారు. ఈ ఎన్నికలు కేవలం నామామాత్రమేనని, ఎవరిని ప్రెసిడెంట్ చేయాలో ఆల్రెడీ డిసైడ్ చేశారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకూడదనుకునే వారి సంఖ్య పార్టీలో ఎక్కువైందని చెప్పారు. మీకో దండం.. మీ పార్టీకో దండం అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇన్ని సంవత్సరాలుగా పార్టీలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
This post was last modified on June 30, 2025 5:54 pm
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…