టీడీపీ ఎమ్మెల్యేలకు, నాయకులకు సీఎం చంద్రబాబు మంచి టార్గెట్ పెట్టారు. ప్రతి ఒక్కరూ ప్రజలను కలుసుకోవాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించాలని చెప్పుకొచ్చారు. అదేసమయంలో పథ కాలపైనా ప్రచారం చేయాలన్నారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు అవకాశం ఉంటుందని తేల్చి చెప్పారు. కట్ చేస్తే.. ఈ ఒక్కటే కాకుండా.. ఇలా చేసిన వారిని మాత్రమే వచ్చే ఎన్ని కలలో పోటీకి అర్హులుగా నిర్ణయిస్తామని కూడాతేల్చేశారు.
ఇది ఒక రకంగా.. పార్టీలో నాయకులకు ఒక మెలికేనని చెప్పాలి. ఇప్పటి వరకు పార్టీ తరఫున ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకోవాలని చంద్రబాబు చెబుతున్నా.. చాలా మంది నాయకులు పెడ చెవిన పెడుతున్నారు. దీనిని చంద్రబాబు సీరియస్గానే తీసుకున్నారు. అయితే.. ఇప్పటికిప్పుడు వారిపై ఒత్తిడి పెంచితే ఇబ్బంది అవుతుందని భావిస్తున్న ఆయన.. దీనికి సరైన రూట్ వేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో టికెట్ వ్యవహారంతో నాయకులకు లింకు పెట్టారు.
వాస్తవానికి గత ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు కూడా.. చంద్రబాబు ఇలానే టార్గెట్ పెట్టారు. కానీ, అప్పట్లో ఏడాది, ఏడాదిన్నర ముందే ఈ టార్గెట్ పెట్టారు. పనిచేసేవారికే టికెట్లు ఇస్తామని అటు చంద్ర బాబు ఇటు నారా లోకేష్ కూడా ప్రకటించారు. దీంతో నాయకులు ముందుకు కదిలారు. అయినా.. కదలని వారు కూడా ఉన్నారు. ఇక, ఇప్పుడు ఏకంగా నాలుగు సంవత్సరాల ముందే చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దీని నుంచి తమ్ముళ్లు తప్పించుకునే అవకాశం లేదని టాక్.
ఎందుకంటే.. ఎన్నికలకు ఏడాదో ఏడాదిన్నరో సమయం ఉంటే.. ఒక ఆర్నెల్లు టైం పాస్ చేసి.. ఎన్నిక లకు ఏడాది ముందు కార్యరంగంలోకి దిగే అవకాశం ఉండేది. కానీ, చంద్రబాబు ఇప్పటి నుంచే తరుము తున్న నేపథ్యంలో ఆయన నుంచి తప్పించుకోవడం నాయకులకు సాధ్యం కాదు. పైగా టికెట్తో ముడి పెట్టడం.. కొత్త నాయకులకు అవకాశం ఇస్తామని.. పాత నేతలు తమ మాట వినిపించుకోకపోతే.. వదిలేస్తామని కూడా చంద్రబాబు చెప్పడంతో నాయకులకు మింగుడు పడడం లేదు. దీంతో ప్రజల మధ్యకు రాక తప్పదన్న చర్చ అయితే.. ప్రారంభమైంది. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on June 30, 2025 5:51 pm
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…