టీడీపీ ఎమ్మెల్యేలకు, నాయకులకు సీఎం చంద్రబాబు మంచి టార్గెట్ పెట్టారు. ప్రతి ఒక్కరూ ప్రజలను కలుసుకోవాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించాలని చెప్పుకొచ్చారు. అదేసమయంలో పథ కాలపైనా ప్రచారం చేయాలన్నారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు అవకాశం ఉంటుందని తేల్చి చెప్పారు. కట్ చేస్తే.. ఈ ఒక్కటే కాకుండా.. ఇలా చేసిన వారిని మాత్రమే వచ్చే ఎన్ని కలలో పోటీకి అర్హులుగా నిర్ణయిస్తామని కూడాతేల్చేశారు.
ఇది ఒక రకంగా.. పార్టీలో నాయకులకు ఒక మెలికేనని చెప్పాలి. ఇప్పటి వరకు పార్టీ తరఫున ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకోవాలని చంద్రబాబు చెబుతున్నా.. చాలా మంది నాయకులు పెడ చెవిన పెడుతున్నారు. దీనిని చంద్రబాబు సీరియస్గానే తీసుకున్నారు. అయితే.. ఇప్పటికిప్పుడు వారిపై ఒత్తిడి పెంచితే ఇబ్బంది అవుతుందని భావిస్తున్న ఆయన.. దీనికి సరైన రూట్ వేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో టికెట్ వ్యవహారంతో నాయకులకు లింకు పెట్టారు.
వాస్తవానికి గత ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు కూడా.. చంద్రబాబు ఇలానే టార్గెట్ పెట్టారు. కానీ, అప్పట్లో ఏడాది, ఏడాదిన్నర ముందే ఈ టార్గెట్ పెట్టారు. పనిచేసేవారికే టికెట్లు ఇస్తామని అటు చంద్ర బాబు ఇటు నారా లోకేష్ కూడా ప్రకటించారు. దీంతో నాయకులు ముందుకు కదిలారు. అయినా.. కదలని వారు కూడా ఉన్నారు. ఇక, ఇప్పుడు ఏకంగా నాలుగు సంవత్సరాల ముందే చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దీని నుంచి తమ్ముళ్లు తప్పించుకునే అవకాశం లేదని టాక్.
ఎందుకంటే.. ఎన్నికలకు ఏడాదో ఏడాదిన్నరో సమయం ఉంటే.. ఒక ఆర్నెల్లు టైం పాస్ చేసి.. ఎన్నిక లకు ఏడాది ముందు కార్యరంగంలోకి దిగే అవకాశం ఉండేది. కానీ, చంద్రబాబు ఇప్పటి నుంచే తరుము తున్న నేపథ్యంలో ఆయన నుంచి తప్పించుకోవడం నాయకులకు సాధ్యం కాదు. పైగా టికెట్తో ముడి పెట్టడం.. కొత్త నాయకులకు అవకాశం ఇస్తామని.. పాత నేతలు తమ మాట వినిపించుకోకపోతే.. వదిలేస్తామని కూడా చంద్రబాబు చెప్పడంతో నాయకులకు మింగుడు పడడం లేదు. దీంతో ప్రజల మధ్యకు రాక తప్పదన్న చర్చ అయితే.. ప్రారంభమైంది. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on June 30, 2025 5:51 pm
అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…
టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే…
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని సంతోషంలో ముంచెత్తే పరిణామం చోటుచేసుకుంది. చిరు తనయుడు రామ్ చరణ్ కవల పిల్లలకు తండ్రి…
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు.. ఈ వార్త నిజం కావడానికి దశాబ్దంన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అభిమానులు. వీరి…
రామ్ గోపాల్ వర్మ సత్యతో స్టార్ ఆర్టిస్టుగా మారిపోయిన మనోజ్ బాజ్ పాయ్ తెలుగులోనూ హ్యాపీ, ప్రేమకథ, కొమరం పులి…