తన సోదరుడు, ఏపీ మాజీ సీఎం జగన్ పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సందర్భానుసారంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీకి వెళ్లని అన్నయ్యపై షర్మిల వేసిన సెటైర్లు వైరల్ గా కూడా మారాయి. మోదీకి జగన్ దత్తపుత్రుడు అని పలుమార్లు విమర్శించిన షర్మిల తాజాగా మరోసారి మోదీని పల్లెత్తు మాట అనే దమ్ము, ధైర్యం జగన్ కు లేవని షాకింగ్ కామెంట్లు చేశారు. అధికారం లేకపోయినప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగా, మోదీకి వ్యతిరేకంగా జగన్ ఏమీ మాట్లాడడం లేదని విమర్శించారు.
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రధాని మోదీకి జగన్ దాసోహమయ్యారని షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. విభజన హామీల కోసం ఏనాడూ జగన్ పోరాడలేదని, ఏపీకి జరిగిన అన్యాయం గురించి ఏనాడూ కేంద్రాన్ని నిలదీయలేదని మండిపడ్డారు. కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ చివరికి తన మెడనే మోదీ ముందు వంచారని చురకలంటించారు. మోదీని జగన్ ఒక్క మాట అనకుండా, కేవలం చంద్రబాబును విమర్శిస్తున్నారని, మోదీకి దత్తపుత్రుడిలా వ్యవహరిస్తున్నారని ఏకిపారేశారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41 మీటర్లకు కుదించారని, దానిపై ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదని విమర్శించారు. రాజధాని అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా అప్పులు ఇవ్వడమేంటని ఆమె ప్రశ్నించారు. విభజన హామీలు అమలు కాకపోయినా మోదీకి జగన్ మద్దతు పలికారని విమర్శించారు. ముందు నుంచి బీజేపీని వైఎస్ వ్యతిరేకించారని, కానీ జగన్ మాత్రం మోదీకి గులాంగిరీ చేశారని ఎద్దేవా చేశారు.
This post was last modified on June 30, 2025 5:49 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…