తన సోదరుడు, ఏపీ మాజీ సీఎం జగన్ పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సందర్భానుసారంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీకి వెళ్లని అన్నయ్యపై షర్మిల వేసిన సెటైర్లు వైరల్ గా కూడా మారాయి. మోదీకి జగన్ దత్తపుత్రుడు అని పలుమార్లు విమర్శించిన షర్మిల తాజాగా మరోసారి మోదీని పల్లెత్తు మాట అనే దమ్ము, ధైర్యం జగన్ కు లేవని షాకింగ్ కామెంట్లు చేశారు. అధికారం లేకపోయినప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగా, మోదీకి వ్యతిరేకంగా జగన్ ఏమీ మాట్లాడడం లేదని విమర్శించారు.
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రధాని మోదీకి జగన్ దాసోహమయ్యారని షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. విభజన హామీల కోసం ఏనాడూ జగన్ పోరాడలేదని, ఏపీకి జరిగిన అన్యాయం గురించి ఏనాడూ కేంద్రాన్ని నిలదీయలేదని మండిపడ్డారు. కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ చివరికి తన మెడనే మోదీ ముందు వంచారని చురకలంటించారు. మోదీని జగన్ ఒక్క మాట అనకుండా, కేవలం చంద్రబాబును విమర్శిస్తున్నారని, మోదీకి దత్తపుత్రుడిలా వ్యవహరిస్తున్నారని ఏకిపారేశారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41 మీటర్లకు కుదించారని, దానిపై ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదని విమర్శించారు. రాజధాని అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా అప్పులు ఇవ్వడమేంటని ఆమె ప్రశ్నించారు. విభజన హామీలు అమలు కాకపోయినా మోదీకి జగన్ మద్దతు పలికారని విమర్శించారు. ముందు నుంచి బీజేపీని వైఎస్ వ్యతిరేకించారని, కానీ జగన్ మాత్రం మోదీకి గులాంగిరీ చేశారని ఎద్దేవా చేశారు.
This post was last modified on June 30, 2025 5:49 pm
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…