Political News

బాబుకు త‌మ్ముళ్ల త‌ల‌నొప్పులు మామూలుగా లేవుగా!

వైసీపీ హ‌యాంలో మైనింగ్ అక్ర‌మాల‌పై కూట‌మి ప్ర‌భుత్వం విచార‌ణ చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆనాడు మైనింగ్ శాఖ ఎండీగా ప‌నిచేసిన అఖిల భార‌త స‌ర్వీసుల‌కు చెందిన వెంక‌ట రెడ్డిని జైల్లో పెట్టారు. ఇప్ప‌టికీ ఆయ‌న బ‌య‌ట‌కు రాలేదు. మ‌రోవైపు.. అప్ప‌టి అక్ర‌మాల‌పై ప్ర‌భుత్వం నియ‌మించిన అధికారుల‌కు దిమ్మ తిరిగే వాస్త‌వాలు క‌నిపించాయి. ప్ర‌స్తుతం రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో అక్ర‌మ మైనింగ్ జ‌రుగుతూనే ఉంది.

పైకి చంద్ర‌బాబు ఎన్ని హెచ్చ‌రిక‌లు చేస్తున్నా.. గుంటూరు, ఉమ్మ‌డి చిత్తూరు, అనంత‌పురం, కృష్ణా వంటి కీల‌క జిల్లాల్లో కొండ‌లు, మ‌ట్టి క‌రిగిపోతున్నాయి. ఇది రాజకీయ పెట్టుబ‌డిగా కూడా మారిపోయింది. తాజాగా గంగాధ‌ర నెల్లూరు ఎమ్మెల్యే అనుచ‌రుడితో ఓ వ్య‌క్తి రూ.50 ల‌క్ష‌లు లంచం ఇచ్చానంటూ.. చెప్పిన వ్యాఖ్య‌లు రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపాయి. ఈ విష‌యం అలా ఉంటే.. అస‌లు మ‌రోవైపు.. నాడు వైసీపీ హ‌యాంలో మైనింగ్ అక్ర‌మాల‌కు స‌హ‌క‌రించిన మ‌ధ్య వ‌ర్తులు, వ్యాపారులే ఇప్పుడు కూడా జోక్యం చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

అంతేకాదు.. వారే అన్నీ తామై వ్య‌వ‌హ‌రించ‌డం మ‌రింత చ‌ర్చ‌గా మారింది. మైనింగ్ అక్ర‌మాల‌పై విచార‌ణ చేస్తున్న గ‌నుల అధికారులు ఈ ప‌రిణామంతో అచ్చ‌రువొందుతున్నారు. ఎవ‌రిని ప‌ట్టుకుని కేసు పెడుతున్నా.. వెంట‌నే కీల‌క నాయ‌కులు లైన్‌లోకి వ‌స్తున్నారు. మా వాళ్లే.. అంటూ వారిపై కేసులు న‌మోదు కాకుండా చేస్తున్నారు. దీనిపై లోతుగా ప‌రిశీల‌న చేస్తే.. స‌ద‌రు వ్య‌క్తులు.. నాడు వైసీపీ నాయ‌కుల‌కు స‌హ‌క‌రించి.. ఎక్క‌డ ఎలా అక్ర‌మాలు చేయాలో చేయించారు. చేశారు. ఇక‌, ఇప్పుడు కూడా అదే పంథాలో మ‌ధ్య వ‌ర్తులు చెల‌రేగుతున్నారు.

తాజాగా వెలుగుచూసిన గంగాధ‌ర నెల్లూరు ఘ‌ట‌న‌లోనూ.. హైద‌రాబాద్‌కు చెందిన మీడియేట‌ర్ వ్య‌వ‌హారం ఇలానే ఉంద‌ని తెలిసింది. ఇక్క‌డే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ హ‌యాంలో చ‌క్రాలు తిప్పిన మ‌ధ్య‌వ‌ర్తులే త‌మ్ముళ్ల చేతికి మ‌ట్టి అంట‌కుండా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో కూట‌మి స‌ర్కారుకు పెద్ద ఇబ్బందిగా మారింది.

Satya

Recent Posts

విద్యాశాఖ‌ విజేత‌… నారా లోకేష్‌!

విద్యాశాఖ మంత్రిగా టీడీపీ యువ నాయ‌కుడు, జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌.. నారా లోకేష్ దూకుడు చూపిస్తున్నారు. నిజానికి విద్యా శాఖ…

29 minutes ago

ఉపముఖ్యమంత్రి పవన్… ఎన్నడూ హద్దులు దాటలేదు!

రాష్ట్రంలో కూట‌మిప్ర‌భుత్వంఏర్ప‌డి జూన్ 12కు రెండేళ్లు పూర్త‌య్యాయి. 2024లో ఏర్ప‌డిన కూట‌మి ప్ర‌భుత్వంలో ఉప‌ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు చేప‌ట్టారు జ‌న‌సేన అధినేత…

2 hours ago

ఆ ఇద్దరి చేతికి బేడీలు

ఏపీలో పెను కలకలం రేపిన మద్యం కుంభకోణంలో ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చేసింది. వైసీపీ…

3 hours ago

రవితేజ అలాంటి సినిమా చేస్తాడా?

తాను చేసే మాస్ మసాలా సినిమాల విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా, పట్టించుకోకుండా చాలా ఏళ్ల పాటు అదే రూట్లో…

8 hours ago

బీజేపీ ఖాతాలోకి మీనాక్షి సీటు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పోరాటం బరిలోకి దిగకుండానే ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆమెకు…

10 hours ago

అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు

కొన్నేళ్ల గ్యాప్ త‌ర్వాత మొద‌లైన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త ఇన్నింగ్స్‌లో అభిమానుల ఆకాంక్ష‌లు, అంచ‌నాల‌కు త‌గ్గ సినిమాలు…

12 hours ago