Political News

2027లోనే జమిలి ఎన్నికలు: పెద్దిరెడ్డి

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగి ఇప్పటికి 13 నెలలు దాటిపోతోంది. ఎక్కడికక్కడ ప్రభుత్వాలు ఏర్పడిపోయాయి. ఎవరికి తగ్గట్టుగా వారు పాలన సాగిస్తున్నారు. తిరిగి ఎన్నికలు రావాలంటే…రాజ్యాంగం ప్రకారం ఐధేళ్లు.. అంటే ఇంకో 3 ఏళ్ల 11 నెలల సమయం అయితే ఆగాల్సిందే కదా. మరి ఎందుకో గానీ… ఏపీలో 2019 నుంచి ఐధేళ్ల పాలు పాలన సాగించిన వైసీపీ… 2029 వరకు ఆగలేకపోతోంది. అంతకంటే ముందే ఎన్నికలు జరిగి తిరిగి తాను అధికారంలోకి రావాలని కోరుతోంది. ఇప్పటికే చాలామంది నేతలు జమిలి ఎన్నికలను ప్రస్తావిస్తూ 2027లోనే జరుగుతాయని ఇదివరకే చెప్పారు. ఇప్పుడు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అదే మాట వల్లె వేశారు.

సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఓటమి పాలైన పార్టీలన్నీ కూడా తదుపరి ఎన్నికలు త్వరగా వస్తే బాగుండని కోరుకున్నాయి. ఈ క్రమంలో అప్పటికే కేంద్రం జమిలి ఎన్నికలపై ఓ మోస్తరు కసరత్తు చేసిన నేపథ్యంలో ఆ పార్టీలన్నీ కూడా తదుపరి ఎన్నికలు 2027లోనేనని దాదాపుగా ఓ అంచనాకు వచ్చాయి. అయితే ఆ తర్వాత జమిలిపై జరిగిన పురోగతి, కేంద్రం చేపట్టిన కసరత్తు, ఆ కసరత్తు కారణంగా జమిలి నిర్దేశిత సమయం కంటే ముందే జరగడం దుర్లభమే నని తేల్చి చెప్పింది. అంతేకాకుండా నియోజకవర్గాల పునర్విభజన కూడా పెండింగ్ లో ఉన్ననేపథ్యంలో ఈ రెంటినీ ఒకే దఫా చేపట్టడం కూడా అంత ఈజీ కాదు. దీంతో వైసీపీలోని మెజారిటీ నేతలు కూడా జమిలిపై ఆశలు వదులుకున్నారు.

అయితే పెద్దిరెడ్డిలో మాత్రం జమిలిపై ఇంకా ఆశలు సజీవంగానే ఉన్నాయని చెప్పక తప్పదు. ఆదివారం నంద్యాల జిల్లాలో పర్యటించిన సందర్బంగా జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డితో కలిసి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా జమిలి ఎన్నికలు 2027 ఫిబ్రవరిలోనే జరగనున్నాయని పెద్దిరెడ్డి చెప్పారు. ఈ మేరకు కేంద్రం చురుగ్గా కసరత్తు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాలను తనకు ఓ కేంద్ర మంత్రి స్వయంగా చెప్పారంటూ ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీని కూటమి 11 సీట్లకు పరిమితం చేస్తే.. 2027 జమిలి ఎన్నికల్లో టీడీపీని సింగిల్ డిజిట్ కు పరిమితం చేద్దామని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

This post was last modified on June 29, 2025 10:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

28 minutes ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

41 minutes ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

2 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

4 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

4 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

5 hours ago