Political News

2027లోనే జమిలి ఎన్నికలు: పెద్దిరెడ్డి

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగి ఇప్పటికి 13 నెలలు దాటిపోతోంది. ఎక్కడికక్కడ ప్రభుత్వాలు ఏర్పడిపోయాయి. ఎవరికి తగ్గట్టుగా వారు పాలన సాగిస్తున్నారు. తిరిగి ఎన్నికలు రావాలంటే…రాజ్యాంగం ప్రకారం ఐధేళ్లు.. అంటే ఇంకో 3 ఏళ్ల 11 నెలల సమయం అయితే ఆగాల్సిందే కదా. మరి ఎందుకో గానీ… ఏపీలో 2019 నుంచి ఐధేళ్ల పాలు పాలన సాగించిన వైసీపీ… 2029 వరకు ఆగలేకపోతోంది. అంతకంటే ముందే ఎన్నికలు జరిగి తిరిగి తాను అధికారంలోకి రావాలని కోరుతోంది. ఇప్పటికే చాలామంది నేతలు జమిలి ఎన్నికలను ప్రస్తావిస్తూ 2027లోనే జరుగుతాయని ఇదివరకే చెప్పారు. ఇప్పుడు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అదే మాట వల్లె వేశారు.

సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఓటమి పాలైన పార్టీలన్నీ కూడా తదుపరి ఎన్నికలు త్వరగా వస్తే బాగుండని కోరుకున్నాయి. ఈ క్రమంలో అప్పటికే కేంద్రం జమిలి ఎన్నికలపై ఓ మోస్తరు కసరత్తు చేసిన నేపథ్యంలో ఆ పార్టీలన్నీ కూడా తదుపరి ఎన్నికలు 2027లోనేనని దాదాపుగా ఓ అంచనాకు వచ్చాయి. అయితే ఆ తర్వాత జమిలిపై జరిగిన పురోగతి, కేంద్రం చేపట్టిన కసరత్తు, ఆ కసరత్తు కారణంగా జమిలి నిర్దేశిత సమయం కంటే ముందే జరగడం దుర్లభమే నని తేల్చి చెప్పింది. అంతేకాకుండా నియోజకవర్గాల పునర్విభజన కూడా పెండింగ్ లో ఉన్ననేపథ్యంలో ఈ రెంటినీ ఒకే దఫా చేపట్టడం కూడా అంత ఈజీ కాదు. దీంతో వైసీపీలోని మెజారిటీ నేతలు కూడా జమిలిపై ఆశలు వదులుకున్నారు.

అయితే పెద్దిరెడ్డిలో మాత్రం జమిలిపై ఇంకా ఆశలు సజీవంగానే ఉన్నాయని చెప్పక తప్పదు. ఆదివారం నంద్యాల జిల్లాలో పర్యటించిన సందర్బంగా జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డితో కలిసి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా జమిలి ఎన్నికలు 2027 ఫిబ్రవరిలోనే జరగనున్నాయని పెద్దిరెడ్డి చెప్పారు. ఈ మేరకు కేంద్రం చురుగ్గా కసరత్తు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాలను తనకు ఓ కేంద్ర మంత్రి స్వయంగా చెప్పారంటూ ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీని కూటమి 11 సీట్లకు పరిమితం చేస్తే.. 2027 జమిలి ఎన్నికల్లో టీడీపీని సింగిల్ డిజిట్ కు పరిమితం చేద్దామని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Satya

Recent Posts

నాగబంధంను వ‌ద్ద‌న్న స్టార్ హీరోలు

స్టార్ హీరో హీరోయిన్లు న‌టించ‌క‌పోయినా.. పేరున్న ద‌ర్శ‌కుడు తీయ‌క‌పోయినా.. స్ట‌న్నింగ్ విజువ‌ల్స్‌తో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించి అంచ‌నాలు పెంచిన‌ సినిమా..…

31 minutes ago

దర్శకులారా… చిరు మాట విన్నారా?

తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద కమర్షియల్ హీరోగా ఎదిగిన ఘనత మెగాస్టార్ చిరంజీవి సొంతం. 90వ దశకంలో జగదేక…

2 hours ago

నయనతార దైవమైతే మరి పూజా హెగ్డే ?

దర్శకుడు లారెన్స్ రాఘవేంద్ర హీరోగా ఆయన డైరెక్షన్లోనే రూపొందుతున్న కాంచన 4 షూటింగ్ కీలక దశకు చేరుకుంది. ఇందులో ముఖ్యమైన…

3 hours ago

దంగల్ పోలిక అవసరం లేదేమో పెద్ది

పెద్ది విషయంలో ప్రీ రిలీజ్ నుంచి పోస్ట్ రిలీజ్ దాకా జరుగుతున్న ఒక పొరపాటు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు…

3 hours ago

నాగబంధానికి ఇంత ప్రచారం అవసరమే

జూలై 3 నాగబంధం విడుదల కానుంది. కళ్యాణ్ రామ్ డెవిల్ తీసిన నిర్మాత కం దర్శకుడు అభిషేక్ నామా మీద…

4 hours ago

జూలై నెల… క్వాలిటీతో కాంపిటీషన్

జూన్ సగం అయిపోయింది. మా ఇంటి బంగారం లాంటి నోటెడ్ మూవీస్ తో పాటు దీవానా లాంటివి అంతో ఇంతో…

5 hours ago