Political News

56 మంది ఎమ్మెల్యేల డుమ్మా… బాబు ఫైరింగ్

ఏపీలోని కూటమి ప్రభుత్వ రథసారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ) విస్తృత స్థాయి సమావేశం ఆదివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సుదీర్ఘంగా సాగింది. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు తదితరులంతా హాజరు కావాలని పార్టీ అధిష్ఠానం ఒకింత గట్టిగానే చెప్పింది. అయితే ఇతర వర్గాల వారు బాగానే హాజరైనా.. ఎమ్మెల్యేల కోటాలో మొత్తం 135 మంది ఉంటే..వారిలో ఏకంగా 56 మంది సమావేశానికి గైర్హాజరయ్యారట. అంతేనా వచ్చిన వారిలోనూ కొందరు సంతకాలు చేసి ఆ తర్వాత చిన్నగా జారుకున్నారట.

జూన్ 2 నుంచి మంచి ప్రభుత్వం పేరిట… సుపరిపాలనలో తొలి అడుగు పేరిట కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, సూపర్ సిక్స్ లు అమలు చేసిన హామీలు, ఇతరత్రా సంక్షేమ పథకాల అమలు తీరుపై ఇంటంటికీ తిరిగి ప్రచారం చేయాలన్న ఉద్దేశ్యం చంద్రబాబు ఆ బృహత్కార్యాన్ని చేపట్టారు. జూలై 2 నుంచి నెలాఖరు వరకు నాన్ స్టాప్ గా కొనసాగనున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలని కూడా పార్టీ దిశానిర్దేశం చేసింది. ఈ లెక్కన ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యం కలిగినదే. ఇంతటి ప్రాధాన్యం కలిగిన సమావేశానికి ఏకంగా 56 మంది ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమావేశానికి గైర్హాజరైన వారిలో ఓ 15 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం దేశంలోనే లేరట. విదేశీ పర్యటనల్లో వారు తలమునకలై ఉన్నారట. వీరు దేశానికి ఎప్పుడు తిరిగి వస్తారో కూడా తెలియదట. ఇక సమావేశానికి హాజరైన వారిలోనూ కొందరు సంతకాలు చేసి అటు నుంచి అటే జారుకున్న వైనం కూడా చంద్రబాబు దృష్టిని దాటిపోలేదు. దాదాపుగా 7 గంటల పాటు నిర్విరామంగా సాగిన ఈ సమావేశంలో ఇంటింటికీ మంచి ప్రభుత్వం పేరిట చేపట్టనున్న కార్యక్రమంలో చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమయంలో ఆయన ఈ గైర్హాజరీని ప్రస్తావించలేదు.

ఈ సమావేశం ముగిసిన వెంటనే గైర్హాజరీ లిస్టును ప్రస్తావించిన చంద్రబాబు డుమ్మా కొట్టిన నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటికి మంచి ప్రభుత్వం లాంటి కీలక కార్యక్రమానికి సన్నాహకంగా నిర్వహిస్తున్న ఇంతటి కీలక సమావేశానికి ఇంత మంది ఎమ్మెల్యేలు గైర్హాజరైతే ఎలాగని ప్రశ్నించారు. అంతేకాకుండా గెలిపించిన ప్రజలకు సేవ చేయకుంటే…మరుసటి ఎన్నికల్లోనే ఫలితం అనుభవించి తీరాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక ఎక్కువకాలం విదేశాల్లో పర్యటించడం కూడా సబబు కాదని బాబు సూచించారు. ఇక సమావేశానికి వచ్చి మరీ సంతకాలు చేసి జారుకున్న వారి జాబితా తన వద్ద ఉందని, త్వరలోనే వారి పనిబడతానని చంద్రబాబు వార్నింగ్ ఇచ్కారు.

This post was last modified on June 29, 2025 10:08 pm

Share

Recent Posts

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

2 minutes ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

2 hours ago

ర‌వితేజ‌కు పుత్రికోత్సాహం

స్టార్ హీరోల కుటుంబాల నుంచి అబ్బాయిలు హీరోలుగా మార‌డం మామూలే. అమ్మాయిలు మాత్రం హీరోయిన్లు కావ‌డం అరుదు. ఐతే సినీ…

3 hours ago

అర్జున్ రెడ్డిని ఆదుకున్న మామిడి తోట‌

న‌టుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ద‌ర్శ‌కుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్ల‌ను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్ట‌ర్ అనే…

6 hours ago

ఆర్జీవీకి శివ నిర్వాణ కూలర్ బాయ్

ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…

7 hours ago

ఎట్ట‌కేల‌కు తెలుగులో తొలి హిట్టు

త‌మిళంలో పెద్ద స్టార్‌గా ఎదిగిన‌ శివ కార్తికేయ‌న్ లాగే టీవీ రంగం నుంచి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన అమ్మాయి ప్రియ భ‌వానీ…

9 hours ago