Political News

56 మంది ఎమ్మెల్యేల డుమ్మా… బాబు ఫైరింగ్

ఏపీలోని కూటమి ప్రభుత్వ రథసారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ) విస్తృత స్థాయి సమావేశం ఆదివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సుదీర్ఘంగా సాగింది. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు తదితరులంతా హాజరు కావాలని పార్టీ అధిష్ఠానం ఒకింత గట్టిగానే చెప్పింది. అయితే ఇతర వర్గాల వారు బాగానే హాజరైనా.. ఎమ్మెల్యేల కోటాలో మొత్తం 135 మంది ఉంటే..వారిలో ఏకంగా 56 మంది సమావేశానికి గైర్హాజరయ్యారట. అంతేనా వచ్చిన వారిలోనూ కొందరు సంతకాలు చేసి ఆ తర్వాత చిన్నగా జారుకున్నారట.

జూన్ 2 నుంచి మంచి ప్రభుత్వం పేరిట… సుపరిపాలనలో తొలి అడుగు పేరిట కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, సూపర్ సిక్స్ లు అమలు చేసిన హామీలు, ఇతరత్రా సంక్షేమ పథకాల అమలు తీరుపై ఇంటంటికీ తిరిగి ప్రచారం చేయాలన్న ఉద్దేశ్యం చంద్రబాబు ఆ బృహత్కార్యాన్ని చేపట్టారు. జూలై 2 నుంచి నెలాఖరు వరకు నాన్ స్టాప్ గా కొనసాగనున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలని కూడా పార్టీ దిశానిర్దేశం చేసింది. ఈ లెక్కన ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యం కలిగినదే. ఇంతటి ప్రాధాన్యం కలిగిన సమావేశానికి ఏకంగా 56 మంది ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమావేశానికి గైర్హాజరైన వారిలో ఓ 15 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం దేశంలోనే లేరట. విదేశీ పర్యటనల్లో వారు తలమునకలై ఉన్నారట. వీరు దేశానికి ఎప్పుడు తిరిగి వస్తారో కూడా తెలియదట. ఇక సమావేశానికి హాజరైన వారిలోనూ కొందరు సంతకాలు చేసి అటు నుంచి అటే జారుకున్న వైనం కూడా చంద్రబాబు దృష్టిని దాటిపోలేదు. దాదాపుగా 7 గంటల పాటు నిర్విరామంగా సాగిన ఈ సమావేశంలో ఇంటింటికీ మంచి ప్రభుత్వం పేరిట చేపట్టనున్న కార్యక్రమంలో చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమయంలో ఆయన ఈ గైర్హాజరీని ప్రస్తావించలేదు.

ఈ సమావేశం ముగిసిన వెంటనే గైర్హాజరీ లిస్టును ప్రస్తావించిన చంద్రబాబు డుమ్మా కొట్టిన నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటికి మంచి ప్రభుత్వం లాంటి కీలక కార్యక్రమానికి సన్నాహకంగా నిర్వహిస్తున్న ఇంతటి కీలక సమావేశానికి ఇంత మంది ఎమ్మెల్యేలు గైర్హాజరైతే ఎలాగని ప్రశ్నించారు. అంతేకాకుండా గెలిపించిన ప్రజలకు సేవ చేయకుంటే…మరుసటి ఎన్నికల్లోనే ఫలితం అనుభవించి తీరాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక ఎక్కువకాలం విదేశాల్లో పర్యటించడం కూడా సబబు కాదని బాబు సూచించారు. ఇక సమావేశానికి వచ్చి మరీ సంతకాలు చేసి జారుకున్న వారి జాబితా తన వద్ద ఉందని, త్వరలోనే వారి పనిబడతానని చంద్రబాబు వార్నింగ్ ఇచ్కారు.

This post was last modified on June 29, 2025 10:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్యారడైజ్ గుమ్మడికాయ… రోమియో కొబ్బరికాయ

మార్చి నుంచి ఆగస్టుకి విడుదల తేదీ వాయిదా వేసుకున్న నాని ది ప్యారడైజ్ ఖచ్చితంగా చెప్పిన డేట్ కి విడుదలవుతుందా…

39 minutes ago

లీకులు సరే… నెక్స్ట్ ఏంటి నాయకా

జన నాయకుడు పైరసీని పూర్తి స్థాయిలో కాకపోయినా గరిష్ట స్థాయిలో కట్టడి చేయడంలో నిర్మాణ సంస్థ సక్సెస్ అయ్యింది. వీడియో…

4 hours ago

అదేంటో… మోడీ స‌ర్‌కి ఎన్నిక‌ల‌ప్పుడే అన్నీ గుర్తుకొస్తాయి!

అదేంటో కానీ.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీకి ప‌లు కీల‌క విష‌యాలు సాధార‌ణ రోజుల్లో ఎక్క‌డా గుర్తుకు ఉండ‌వు... రావు. ఎన్నిక‌ల…

4 hours ago

మృణాల్ పాటించాల్సిన సలహానే ఇది

సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…

7 hours ago

స్టాండ‌ప్ క‌మెడియన్ సారీ… అంద‌రికీ ఓ పాఠం

జ‌నాల‌ను న‌వ్వించ‌డం కోసం సెల‌బ్రెటీల వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి వెళ్లిపోతే ప‌రిణామాలు ఎలా ఉంటాయో మ‌రోసారి రుజువైంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్, రామ్…

8 hours ago

మళ్లీ ‘టీఆర్ఎస్’ గా గులాబీ సేన?

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…

9 hours ago