Political News

నాయకులను అలర్ట్ చేసిన చంద్ర‌బాబు

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వానికి నేతృత్వం వ‌హిస్తున్న టీడీపీ.. తాజాగా విస్తృత స్థాయి స‌మావేశం ఏర్పాటు చేసింది. ఈ స‌మావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, జిల్లాల పార్టీ ఇంచార్జులు.. ఇలా ఓ వెయ్యి మంది వ‌ర‌కు హాజ‌ర‌య్యారు. మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఒక్క రోజు జ‌రిగే ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు నాయ‌కుల‌కు, మంత్రుల‌కు విడివిడిగా దిశానిర్దేశం చేశారు. పార్టీ త‌ర‌ఫున ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని నాయ‌కులకు చెప్పారు.

వైసీపీ దూకుడును ఇప్ప‌టి నుంచే అడ్డుకోవాల‌ని.. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు వేచి చూసే రోజులు పోయాయ‌ని చంద్ర‌బాబు తెలిపారు. “ఎన్నిక‌ల‌కు ఆరు మాసాల ముందు ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటామ‌ని అనుకునే రోజులు ఇప్పుడు పోయాయి. వైసీపీ నాయ‌కులు మ‌న‌పై దుష్ప్ర‌చారం చేస్తున్నారు. దీనిని తిప్పికొట్టాల్సిన బాధ్య‌త నాయ‌కుల‌పైనే ఉంది. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునే బాధ్యత మీదే. అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా ప్ర‌జ‌ల‌ను క‌ల‌వాలి. వైసీపీ వ్య‌తిరేక ప్ర‌చారాన్నిఅడ్డుకోవాలి.” అని చంద్ర‌బాబు దిశానిర్దేశం చేశారు.

అదే స‌మ‌యంలో మంత్రులకు కూడా కొన్ని సూచ‌న‌లు చేశారు. మంత్రులు కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లాలని.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయాల‌ని అన్నారు. ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌తో పాటు.. వ్య‌క్తిగ‌త స‌మ‌స్యలు కూడా ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేయ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల మ‌న‌సులు చూర‌గొనే అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పారు. ఎవ‌రూ ఈ విష‌యంలో అల‌స‌త్వం వ‌హించ‌డానికి వీల్లేద‌ని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా.. స‌మ‌న్వ‌యం చేసుకుని ముందుకు సాగాల‌న్నారు.

ఇక‌, వ‌చ్చే నెల 2 నుంచి ఇది మంచి ప్ర‌భుత్వం పేరుతో ఇంటింటికీ ప్ర‌చారం చేయాల‌ని చంద్ర‌బాబు అంద‌రికీ సూచించారు. అంద‌రూ ఉమ్మ‌డిగా ప్ర‌భుత్వం చేసిన మంచిని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌న్నారు. ఎక్క‌డా తేడారాకుండా చూడాల‌ని.. ఇప్ప‌టి నుంచే ఎన్నిక‌ల‌కు ప్ర‌చారం చేస్తున్నామ‌ని భావించాల‌ని ఆయ‌న దిశానిర్దేశం చేశారు. ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను క‌లుషితం చేసే శ‌క్తుల‌ను క‌ట్ట‌డి చేసేందుకుఅన్ని ప్ర‌య‌త్నాలు చేయాల‌ని సూచించారు.

This post was last modified on June 29, 2025 3:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

2 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

2 hours ago

మమ్ముట్టి & మోహన్ లాల్ మెప్పించారా

మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…

3 hours ago

30 రోజుల కౌంట్ డౌన్ మొదలయ్యింది

సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…

3 hours ago

చావానే టార్గెట్… అంత సీన్ లేదు రాజా

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…

4 hours ago

తరుణ్ క్యాలికులేషన్ ఎక్కడ తప్పుతోంది

పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి…

6 hours ago