Political News

నాయకులను అలర్ట్ చేసిన చంద్ర‌బాబు

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వానికి నేతృత్వం వ‌హిస్తున్న టీడీపీ.. తాజాగా విస్తృత స్థాయి స‌మావేశం ఏర్పాటు చేసింది. ఈ స‌మావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, జిల్లాల పార్టీ ఇంచార్జులు.. ఇలా ఓ వెయ్యి మంది వ‌ర‌కు హాజ‌ర‌య్యారు. మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఒక్క రోజు జ‌రిగే ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు నాయ‌కుల‌కు, మంత్రుల‌కు విడివిడిగా దిశానిర్దేశం చేశారు. పార్టీ త‌ర‌ఫున ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని నాయ‌కులకు చెప్పారు.

వైసీపీ దూకుడును ఇప్ప‌టి నుంచే అడ్డుకోవాల‌ని.. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు వేచి చూసే రోజులు పోయాయ‌ని చంద్ర‌బాబు తెలిపారు. “ఎన్నిక‌ల‌కు ఆరు మాసాల ముందు ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటామ‌ని అనుకునే రోజులు ఇప్పుడు పోయాయి. వైసీపీ నాయ‌కులు మ‌న‌పై దుష్ప్ర‌చారం చేస్తున్నారు. దీనిని తిప్పికొట్టాల్సిన బాధ్య‌త నాయ‌కుల‌పైనే ఉంది. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునే బాధ్యత మీదే. అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా ప్ర‌జ‌ల‌ను క‌ల‌వాలి. వైసీపీ వ్య‌తిరేక ప్ర‌చారాన్నిఅడ్డుకోవాలి.” అని చంద్ర‌బాబు దిశానిర్దేశం చేశారు.

అదే స‌మ‌యంలో మంత్రులకు కూడా కొన్ని సూచ‌న‌లు చేశారు. మంత్రులు కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లాలని.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయాల‌ని అన్నారు. ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌తో పాటు.. వ్య‌క్తిగ‌త స‌మ‌స్యలు కూడా ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేయ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల మ‌న‌సులు చూర‌గొనే అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పారు. ఎవ‌రూ ఈ విష‌యంలో అల‌స‌త్వం వ‌హించ‌డానికి వీల్లేద‌ని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా.. స‌మ‌న్వ‌యం చేసుకుని ముందుకు సాగాల‌న్నారు.

ఇక‌, వ‌చ్చే నెల 2 నుంచి ఇది మంచి ప్ర‌భుత్వం పేరుతో ఇంటింటికీ ప్ర‌చారం చేయాల‌ని చంద్ర‌బాబు అంద‌రికీ సూచించారు. అంద‌రూ ఉమ్మ‌డిగా ప్ర‌భుత్వం చేసిన మంచిని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌న్నారు. ఎక్క‌డా తేడారాకుండా చూడాల‌ని.. ఇప్ప‌టి నుంచే ఎన్నిక‌ల‌కు ప్ర‌చారం చేస్తున్నామ‌ని భావించాల‌ని ఆయ‌న దిశానిర్దేశం చేశారు. ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను క‌లుషితం చేసే శ‌క్తుల‌ను క‌ట్ట‌డి చేసేందుకుఅన్ని ప్ర‌య‌త్నాలు చేయాల‌ని సూచించారు.

This post was last modified on June 29, 2025 3:43 pm

Share

Recent Posts

`సెల్ఫీ ప్లీజ్`… అంటూ ముద్దు పెట్టేసింది!

కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు రాహుల్ గాంధీకి ఊహించ‌ని ఘ‌ట‌న ఎదురైంది. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న యువ‌త‌ను చేర‌దీసే ప‌నిలో ప‌డిన విష‌యం…

39 minutes ago

లిక్క‌ర్ కేసు… కారుమూరితోనే క‌థ అయిపోలేదు!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన 3500 కోట్ల రూపాయ‌ల లిక్క‌ర్ కుంభ‌కోణం కేసు.. అనేక మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీల‌క…

54 minutes ago

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

1 hour ago

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…

1 hour ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

3 hours ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

4 hours ago