Political News

అమిత్ షా సభలో టీ కాంగ్రెస్ మంత్రులు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన నిజామాబాద్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్ర పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో అమిత్ షా వెంట పెద్ద ఎత్తున బీజేపీ నేతలు పాలుపంచుకున్నారు. అయితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ తెలంగాణలోని అధికార కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు మంత్రులు కార్యక్రమంలో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ఈ దృశ్యాలు తెలుగు నేల ప్రజలను అమితంగా ఆకట్టుకుంది.

ప్రస్తుత తెలుగు నేల రాజకీయాలను చూస్తుంటే.. అసలు ఇలాంటి దృశ్యాలు కనిపించవనే చెప్పాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు వస్తే… బీఆర్ఎస్ పాలనలో పెద్దగా రాష్ట్ర మంత్రులు పాలుపంచుకునే వారే కాదు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఓ మోస్తరు లిబరల్ గానే ఉన్నా..బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం ఇప్పటికీ తమ పాద పద్ధతులను విడిచిపెట్టలేదు. అధికారిక కార్యక్రమాలైనా సరే… ప్రత్యర్థి పార్టీ నేతలను ఆహ్వానించేందుకు ఈ రెండు పార్టీలు అంతగా ఆసక్తి చూపడం లేదు. వెరసి ఈ తరహా దృశ్యాలు కనిపించడం లేదు.

ఆదివారం నాటి పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవాన్ని మొత్తంగా కేంద్ర ప్రభుత్వమే నిర్వహించినా… ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి సహా సంబంధిత శాఖల మంత్రులకు ఆహ్వానం పలకక తప్పలేదు. అయితే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ఏ కారణం చేతనో హాజరు కాలేదు. అయితే తన బదులుగా ఆయన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్కలను పంపారు. సీఎం ఆదేశాలతో కదిలిన ఈ ఇద్దరు రాష్ట్ర మంత్రులు కార్యక్రమంలో ఉత్సాహంగా పాలుపంచుకున్న తీరు నిజంగా అమితంగా ఆకట్టుకుంది.

పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవ సమయంలో అమిత్ షా పక్కన ముందు వరుసలోనే కనిపించిన తుమ్మల ఫుల్ ఫోకస్ లో కనిపించారు. ఇక అనంతరం బహిరంగ సభా వేదిక మీద అమిత్ షాకు కుడి పక్కన మరో కేంద్ర మంత్ర కిషన్ రెడ్డి కూర్చోగా… ఆయన పక్కన సీతక్క కూర్చుకున్నారు. సీతక్కను ప్రత్యేకంగా ఆహ్వానించి మరీ కిషన్ రెడ్డి తన పక్క సీటును ఆమెకు ఆపర్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో అమిత్ తర్వాత రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ఇద్దరు పాల్గొన్నా… పసుపు బోర్డును సాధించిన నేతగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు మంచి ఆదరణ లభించింది.

This post was last modified on June 29, 2025 3:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

21 minutes ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

27 minutes ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

42 minutes ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

1 hour ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

2 hours ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

3 hours ago