Vijayawada: Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu addresses a press conference, in Vijayawada, on May 5, 2019. (Photo: IANS)
ఏపీ జల జీవనాడి.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సీఎం చంద్రబాబు కీలక అప్డేట్ ఇచ్చారు. టార్గెట్ పోలవరం అంటూ.. ఆయన సమాచారం పంచుకున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పనిచేస్తోందని చెప్పిన చంద్రబాబు.. కేంద్రం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పిన.. ఆయన 2027 నాటికి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 12,500 కోట్లు ఇచ్చిందని తెలిపారు. రాబోయే ఏడాది న్నరలో ఆ ప్రాజెక్టును పూర్తిచేస్తామన్న చంద్రబాబు టార్గెట్ 2027 నినాదంతో పోలవరాన్ని అభివృద్ధి చేస్తా మని తెలిపారు. అప్పటికి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామన్నారు. అంతేకాదు.. గత వైసీపీ ప్రభు త్వం ఐదేళ్ల పాటు చేసిన దారుణాలు.. పోలవరాన్ని కూడా పట్టిపీడించాయని తెలిపారు. కాంట్రాక్టర్లను అడ్డగోలుగా మార్చిందన్నారు.
అప్పటికీ కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లను మార్చవద్దని చెప్పినా వైసీపీ వినిపించుకోకుండా వ్యవహరించిం దని దీంతో పోలవరం ప్రాజెక్టు ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టుగా మారిందని తెలిపారు. తాము కూటమిగా వచ్చిన తర్వాత.. ప్రాజెక్టును పరుగులు పెట్టించే దిశగా అడుగులు వేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. వచ్చే 2027 నాటికి ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా నీటిని పారించడమే లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు వివరించారు.
తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై…
వరసగా మూడు సూపర్ హిట్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ కి…
116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల…
టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న బ్యూటీ రెజీనా కసాండ్రా లేటెస్ట్ గా నెట్టింట…
ఇంకో అయిదు రోజుల్లో లెనిన్ విడుదల కానుంది. జూలై 10 కోసం అక్కినేని అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్…