Political News

టార్గెట్ పోల‌వ‌రం:  చంద్ర‌బాబు కీల‌క అప్డేట్‌

ఏపీ జ‌ల జీవ‌నాడి.. పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి సీఎం చంద్ర‌బాబు కీల‌క అప్డేట్ ఇచ్చారు. టార్గెట్ పోల‌వ‌రం అంటూ.. ఆయ‌న స‌మాచారం పంచుకున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం శ‌ర‌వేగంగా ప‌నిచేస్తోంద‌ని చెప్పిన చంద్ర‌బాబు.. కేంద్రం కూడా ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటోంద‌న్నారు. ప్రస్తుతం ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయ‌ని చెప్పిన‌.. ఆయ‌న 2027 నాటికి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్ర‌భుత్వం  12,500 కోట్లు ఇచ్చింద‌ని తెలిపారు.  రాబోయే ఏడాది న్నరలో ఆ ప్రాజెక్టును పూర్తిచేస్తామ‌న్న చంద్ర‌బాబు టార్గెట్ 2027 నినాదంతో పోల‌వ‌రాన్ని అభివృద్ధి చేస్తా మ‌ని తెలిపారు. అప్పటికి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామ‌న్నారు. అంతేకాదు.. గ‌త వైసీపీ ప్ర‌భు త్వం ఐదేళ్ల పాటు చేసిన దారుణాలు.. పోల‌వ‌రాన్ని కూడా ప‌ట్టిపీడించాయ‌ని తెలిపారు. కాంట్రాక్ట‌ర్ల‌ను అడ్డ‌గోలుగా మార్చింద‌న్నారు.

అప్ప‌టికీ కేంద్ర ప్ర‌భుత్వం కాంట్రాక్ట‌ర్ల‌ను మార్చ‌వ‌ద్ద‌ని చెప్పినా వైసీపీ వినిపించుకోకుండా వ్య‌వ‌హ‌రించిం ద‌ని దీంతో పోల‌వ‌రం ప్రాజెక్టు ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా మారింద‌ని తెలిపారు. తాము కూట‌మిగా వ‌చ్చిన త‌ర్వాత‌.. ప్రాజెక్టును ప‌రుగులు పెట్టించే దిశ‌గా అడుగులు వేస్తున్నామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. వ‌చ్చే 2027 నాటికి ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా నీటిని పారించడ‌మే ల‌క్ష్యంగా ప్ర‌ణాళిక‌లు అమ‌లు చేస్తున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు వివ‌రించారు. 

Satya

Recent Posts

శ్రీనగర్.. ఈ ఏడాది సమ్మర్ విన్నర్.. ఎంత భారీగా ఫ్లైట్ జర్నీలంటే?

ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…

1 hour ago

సీఎం ఇంటిముందే చెత్త పోసి నిరసన

నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…

3 hours ago

లేటైతే… హైప్ హుళక్కే

ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…

7 hours ago

జ‌ల‌సంధి తెరిచారు.. ధ‌ర‌లు త‌గ్గాయి.. అయినా క‌ష్టాలే!

గ‌త రెండు మాసాల‌కు పైగా ఇంధ‌న, గ్యాస్ స‌మ‌స్య‌ల‌తో ప్ర‌పంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గుర‌వుతున్నాయి. చ‌మురు ధ‌ర‌లు పెరిగిపోవ‌డ‌మే…

9 hours ago

‘బ‌లిదానాల‌తో ఏర్ప‌డిన తెలంగాణ‌లో నాయ‌కులు గ‌ద్దెనెక్కారు’

తెలంగాణ‌పై మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం జ‌న‌సేన పార్టీ అధినేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో సోమ‌వారం చేప‌ట్టిన జాతీయ…

11 hours ago

ఆప‌రేష‌న్ టైగ‌ర్‌… బీజేపీ దూకుడు!

దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేత‌లు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…

11 hours ago