Political News

టార్గెట్ పోల‌వ‌రం:  చంద్ర‌బాబు కీల‌క అప్డేట్‌

ఏపీ జ‌ల జీవ‌నాడి.. పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి సీఎం చంద్ర‌బాబు కీల‌క అప్డేట్ ఇచ్చారు. టార్గెట్ పోల‌వ‌రం అంటూ.. ఆయ‌న స‌మాచారం పంచుకున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం శ‌ర‌వేగంగా ప‌నిచేస్తోంద‌ని చెప్పిన చంద్ర‌బాబు.. కేంద్రం కూడా ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటోంద‌న్నారు. ప్రస్తుతం ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయ‌ని చెప్పిన‌.. ఆయ‌న 2027 నాటికి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్ర‌భుత్వం  12,500 కోట్లు ఇచ్చింద‌ని తెలిపారు.  రాబోయే ఏడాది న్నరలో ఆ ప్రాజెక్టును పూర్తిచేస్తామ‌న్న చంద్ర‌బాబు టార్గెట్ 2027 నినాదంతో పోల‌వ‌రాన్ని అభివృద్ధి చేస్తా మ‌ని తెలిపారు. అప్పటికి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామ‌న్నారు. అంతేకాదు.. గ‌త వైసీపీ ప్ర‌భు త్వం ఐదేళ్ల పాటు చేసిన దారుణాలు.. పోల‌వ‌రాన్ని కూడా ప‌ట్టిపీడించాయ‌ని తెలిపారు. కాంట్రాక్ట‌ర్ల‌ను అడ్డ‌గోలుగా మార్చింద‌న్నారు.

అప్ప‌టికీ కేంద్ర ప్ర‌భుత్వం కాంట్రాక్ట‌ర్ల‌ను మార్చ‌వ‌ద్ద‌ని చెప్పినా వైసీపీ వినిపించుకోకుండా వ్య‌వ‌హ‌రించిం ద‌ని దీంతో పోల‌వ‌రం ప్రాజెక్టు ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా మారింద‌ని తెలిపారు. తాము కూట‌మిగా వ‌చ్చిన త‌ర్వాత‌.. ప్రాజెక్టును ప‌రుగులు పెట్టించే దిశ‌గా అడుగులు వేస్తున్నామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. వ‌చ్చే 2027 నాటికి ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా నీటిని పారించడ‌మే ల‌క్ష్యంగా ప్ర‌ణాళిక‌లు అమ‌లు చేస్తున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు వివ‌రించారు. 

This post was last modified on June 29, 2025 3:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

31 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago