ఏపీలో పెట్టుబడుల వరద ప్రవహిస్తోంది. ఆ రంగం ఈ రంగం అని తేడా లేకుండా.. దాదాపు అన్ని రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలే కాకుండా.. ఐటీ రంగ దిగ్గజ కంపెనీలు కూడా వస్తున్నాయి. 500 కోట్ల నుంచి వేల కోట్ల వరకు కూడా కంపెనీలు ఏపీకి క్యూ కడుతున్నాయి. ప్రభుత్వం కోరుతున్న కంపెనీలే కాకుండా.. కూటమి పాలనను చూసి.. పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని గమనించి చాలా కంపెనీలు ఏపీపై మక్కువ చూపుతున్నాయి.
కూల్ డ్రింక్స్ నుంచి ఇనుము ఉత్పత్తుల వరకు.. పర్యాటక రంగం నుంచి విద్యా రంగం దాకా… గత నాలుగు మాసాల్లో లక్ష కోట్లకు పైగానే పెట్టుబడులు వచ్చాయి. దీనికి ముందు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రసిద్ధ కంపెనీలు కూడా వచ్చాయి. వీటిని కూడా కలుపుకొంటే.. ప్రస్తుతం 11 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు ఏపీకి దక్కాయి. అధికారిక లెక్కల ప్రకారం.. ఇప్పటి వరకు 25 వేల కోట్ల పెట్టుబడులు రాగా.. ఈ ఏడాది చివరినాటికి పూర్తిస్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు రానున్నాయి.
ఆయా సంస్థలకు ఇప్పటికే భూములు కూడా కేటాయించారు. మరికొన్నింటికి భూములను పరిశీలిస్తున్నా రు. ఇక, అనుమతుల విషయానికి వస్తే.. ఎప్పటికప్పుడు వేగవంతంగా అనుమతులు ఇచ్చేలా కేబినెట్ తాజాగా నిర్ణయించింది. ఏ రంగానికి చెందిన శాఖ ఆ రంగానికి సంబంధించిన పెట్టుబడులకు అనుమతులు వేగంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలోనూ అలానే జరుగుతోంది. వీటిని స్వయంగా సీఎం చంద్రబాబు పర్యవేక్షిస్తున్నారు.
తాజాగా ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కూడా.. హార్స్లీహిల్స్(కడపలో)పై తన ఆశ్రమాన్ని ప్రారంభించడంతో పాటు.. పతంజలి ఉత్పత్తులను తయారు చేసేందుకు సర్కారుతో రూ.10 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నారు. ఇలా పెట్టుబడులు రావడానికి కారణమేంటి? అనేది ఆసక్తిగా మారింది. ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతోపాటు.. తీసుకునే నిర్ణయాల్లో నిర్మాణాత్మక వైఖరి కూడా కనిపించడమే కారణమని.. దూరదృష్టి ఉన్న ముఖ్యమంత్రి ఉండడమేనని పెట్టుబడి దారులు చెబుతున్నారు.
This post was last modified on June 27, 2025 1:05 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…