“జరిగింది సీరియస్ ఘటన. ప్రాథమిక ఆధారాలను బట్టి కేసు క్వాష్ చేయలేం. మంగళవారం నిర్ణయం తీసుకుంటాం. అప్పుడు ఏం జరిగిందో పూర్తిగా వింటాం.” అని వైసీపీ అధినేత జగన్ సహా వైసీపీ మాజీ మంత్రులు విడదల రజనీ, పేర్ని నాని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై హైకోర్టు స్పష్టం చేసింది. వచ్చే మంగళవారానికి విచారణను వాయిదా వేసింది. అయితే.. అప్పటి వరకు పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.
ఏం జరిగింది?
ఈ నెల 18న జగన్ గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని రెంటపాళ్లలో పర్యటించారు. ఈ సందర్భంగా భారీగా తరలి వచ్చిన పార్టీ కార్యకర్తల తోపులాటలో సింగయ్య అనే కార్యకర్త జగన్ కాన్వాయ్ కింద పడి మృతి చెందారని పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిలో డ్రైవర్ రమణారెడ్డి(ఈయనను ప్రభుత్వమే నియమించింది.)ని ఏ1గా, మాజీ సీఎం జగన్ ను ఏ2గా పేర్కొన్నారు. ఇక, కారులో ప్రయాణిస్తున్న మాజీ మంత్రులు విడదల రజనీ, పేర్నినానీలపైనా కేసులు పెట్టారు.
ఈ క్రమంలో అసలు తమకు ఈ కేసుకు సంబంధం లేదని తొలుత విడదల రజనీ, పేర్ని నాని కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత.. ఏ2గా ఉన్న జగన్ కూడా.. తనపై రాజకీయ కక్షతోనే కేసు పెట్టారని పేర్కొం టూ.. కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా శుక్రవారం ఆయా పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. దీనినిలోతుగా దర్యాప్తు చేస్తున్నామన్న పోలీసుల తరఫు వాదనలను పరిగణనలోకి తీసుకుని క్వాష్ చేయలేమని, వీటిపై మంగళవారం నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. అయితే.. అప్పటి వరకు విచారణ, అరెస్టులు చేయరాదని పోలీసులకు తేల్చి చెప్పింది.
This post was last modified on June 27, 2025 1:01 pm
మార్చి నుంచి ఆగస్టుకి విడుదల తేదీ వాయిదా వేసుకున్న నాని ది ప్యారడైజ్ ఖచ్చితంగా చెప్పిన డేట్ కి విడుదలవుతుందా…
జన నాయకుడు పైరసీని పూర్తి స్థాయిలో కాకపోయినా గరిష్ట స్థాయిలో కట్టడి చేయడంలో నిర్మాణ సంస్థ సక్సెస్ అయ్యింది. వీడియో…
అదేంటో కానీ.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పలు కీలక విషయాలు సాధారణ రోజుల్లో ఎక్కడా గుర్తుకు ఉండవు... రావు. ఎన్నికల…
సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…
జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లిపోతే పరిణామాలు ఎలా ఉంటాయో మరోసారి రుజువైంది. పవన్ కళ్యాణ్, రామ్…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…