Political News

‘జ‌గ‌న్ 2.0’ పై ష‌ర్మిల మాస్‌ కామెంట్స్..!

జ‌గ‌న్ 2.0 అంటూ.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చేందుకు వైసీపీ నాయ‌కులు రెడీ అవుతున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్‌.. జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల సీరియ‌స్ కామెంట్లు చేశారు. ప్రజా సమస్యల మీద మాట్లాడే హక్కు జగన్ కి లేదన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి.. మద్యం మాఫియా నడిపించార‌ని.. దాచిన సొమ్ము.. దోచిన సొమ్మును క‌క్కించాల‌ని వ్యాఖ్యానించారు. ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ పాల‌న‌లో రైతుల‌కు కూడా ఎలాంటి సుఖం లేద‌న్న ష‌ర్మిల‌.. ఇప్పుడు మాత్రం అన్నదాత‌ల‌కు ఏదో జ‌రిగిపోతోంద‌ని రోడ్డెక్కుతున్నారు… బ‌ల ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నార‌ని ఎద్దేవా చేశారు.

“రైతులను నట్టేట ముంచారు. రైతులు చనిపోతున్నా పట్టించుకోలేదు. దివంగ‌త వైఎస్ చేప‌ట్టిన జ‌ల‌య‌జ్ఞం ప‌నులు కూడా చేయ‌లేదు. ఆరు మాసాల్లోనే మొత్తం పెండింగు ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తాన‌ని హామీ ఇచ్చిన జ‌గ‌న్‌.. ఒక్క దానిని కూడా పూర్తి చేయాలేదు. ఇప్పుడు 2.0 అంటూ ఏమొహం పెట్టుకుని వ‌స్తాడు” అని ష‌ర్మిల నిలదీశారు.

అంతేకాదు.. క‌నీసం గ‌త ఐదేళ్లలో ప్రజల ఇబ్బందులు కనుక్కోలేదన్న ఆమె.. దీనికి స‌మాధానం చెప్పాలన్నారు. కనీసం కార్యకర్తలకు కూడా అందుబాటులో లేడని అన్నారు. ఇప్పుడు 2.0 అని ఏ మొహం పెట్టు కుని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తాడు? ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తాడు? అని నిప్పులు చెరిగారు.

“జగన్ కి ప్రజా సమస్యలు కాదు.. కావలసినవి బలప్రదర్శనలు. అందుకే పర్యటనల పేరుతో బలప్రదర్శనలు చేస్తున్నారు” అని ఎద్దేవా చేశారు. జ‌గ‌న్ చేసిన బలప్రదర్శనలకు ముగ్గురు బలి అయ్యార‌న్న ష‌ర్మిల‌.. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ల‌కు, ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు.. పోలీసులు, ప్ర‌భుత్వం నిషేధం విధించాల‌ని డిమాండ్ చేశారు. జ‌గ‌న్ 2.0 ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను అడ్డుకోవాల‌ని సూచించారు.

This post was last modified on June 27, 2025 10:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

1 hour ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

1 hour ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

2 hours ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

3 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

4 hours ago

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…

5 hours ago