జగన్ 2.0 అంటూ.. ప్రజల మధ్యకు వచ్చేందుకు వైసీపీ నాయకులు రెడీ అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్.. జగన్ సోదరి షర్మిల సీరియస్ కామెంట్లు చేశారు. ప్రజా సమస్యల మీద మాట్లాడే హక్కు జగన్ కి లేదన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి.. మద్యం మాఫియా నడిపించారని.. దాచిన సొమ్ము.. దోచిన సొమ్మును కక్కించాలని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో జగన్ పాలనలో రైతులకు కూడా ఎలాంటి సుఖం లేదన్న షర్మిల.. ఇప్పుడు మాత్రం అన్నదాతలకు ఏదో జరిగిపోతోందని రోడ్డెక్కుతున్నారు… బల ప్రదర్శన చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
“రైతులను నట్టేట ముంచారు. రైతులు చనిపోతున్నా పట్టించుకోలేదు. దివంగత వైఎస్ చేపట్టిన జలయజ్ఞం పనులు కూడా చేయలేదు. ఆరు మాసాల్లోనే మొత్తం పెండింగు ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన జగన్.. ఒక్క దానిని కూడా పూర్తి చేయాలేదు. ఇప్పుడు 2.0 అంటూ ఏమొహం పెట్టుకుని వస్తాడు” అని షర్మిల నిలదీశారు.
అంతేకాదు.. కనీసం గత ఐదేళ్లలో ప్రజల ఇబ్బందులు కనుక్కోలేదన్న ఆమె.. దీనికి సమాధానం చెప్పాలన్నారు. కనీసం కార్యకర్తలకు కూడా అందుబాటులో లేడని అన్నారు. ఇప్పుడు 2.0 అని ఏ మొహం పెట్టు కుని ప్రజల మధ్యకు వస్తాడు? ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తాడు? అని నిప్పులు చెరిగారు.
“జగన్ కి ప్రజా సమస్యలు కాదు.. కావలసినవి బలప్రదర్శనలు. అందుకే పర్యటనల పేరుతో బలప్రదర్శనలు చేస్తున్నారు” అని ఎద్దేవా చేశారు. జగన్ చేసిన బలప్రదర్శనలకు ముగ్గురు బలి అయ్యారన్న షర్మిల.. జగన్ పర్యటనలకు, ప్రదర్శనలకు.. పోలీసులు, ప్రభుత్వం నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. జగన్ 2.0 ప్రదర్శనలను అడ్డుకోవాలని సూచించారు.
ఏపీలో టీడీపీ-వైసీపీల మధ్య మాటల తూటాలు.. మరింత భారీ రేంజ్లో పేలుతున్నాయి. నిన్న మొన్నటి వరకు టీడీపీ చేసిన వ్యాఖ్యలపై…
వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి రానివ్వను. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ.. 2024 ఎన్నికలకు ముందు భీషణ ప్రతిజ్ఞ చేసిన…
ఏపీ ప్రతిపక్షం(ప్రధాన కాదు) వైసీపీ సోషల్ మీడియాలో దూకుడుగా ఉంటున్న విషయం తెలిసిందే. యూట్యూబ్, ఇన్స్టా, వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్..…
గత ఏడాది తమిళ, తెలుగు భాషల్లో పెద్ద హిట్ అయిన సినిమాల్లో ‘డ్యూడ్’ ఒకటి. లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలతో…
బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తున్న హాలీవుడ్ మూవీ అబ్సెషన్ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. రెండు గంటల లోపే నిడివితో థ్రిల్లర్…
ఏపీలో అధికార కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేన.. దేశ రాజధాని ఢిల్లీలో రేపు ఓ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది.…