మంత్రి నారా లోకేష్కు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నుంచి ఊహించని ప్రశంస లభించింది. భేష్ లోకేష్.. నీ ప్రయాణం బాగుంది.. దీనిని ఇలానే కొనసాగించు. మరింత మెరుగు పరుచు. అని సూచించా రు. తాజాగా ఏపీలో పర్యటించిన గజేంద్ర సింగ్ షెకావత్.. గురువారం సాయంత్రం రాజమండ్రి నుంచి నేరుగా ఉండవల్లికి వచ్చారు. సీఎంను కలుసుకునేందుకు ముందు.. ఆయనను నారా లోకేష్ కలుసుకున్నారు.
ఉండవల్లికి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వచ్చిన షెకావత్కు.. మంత్రి నారా లోకేష్ ఆహ్వానం పలికారు. తొ లుత ఆయన.. కేంద్ర మంత్రిని తన క్యాంపు కార్యాలయంలోకి తీసుకువెళ్లారు. ఈసందర్భంగా తన యువ గళం పాదయాత్రకు సంబంధించిన బుక్ లెట్ను కేంద్ర మంత్రికి బహూకరించారు. ఆనాటి విశేషాలను వివరించారు. పుస్తకంలోని ఆసక్తిగా తిలకించిన కేంద్ర మంత్రి లోకేష్.. పాదయాత్ర వివరాలను అడిగి మరీ తెలుసుకున్నారు.
అనంతరం గజేంద్ర సింగ్ మాట్లాడుతూ.. నీ ప్రయాణం బాగుంది.. దీనిని కొనసాగించు అని లోకేష్కు సూచించారు. అనంతరం అక్కడి నుంచి సీఎం చంద్రబాబును కలుసుకునేందుకు ఆయన వెళ్లారు. కాగా.. రాష్ట్రానికి వస్తున్న ప్రముఖులకు మంత్రి నారా లోకేష్ యువగళం పుస్తకాన్ని బహూకరిస్తున్నారు. యువగళం సమయంలో ప్రజలతో ఆయన మమేకమైన తీరు.. అప్పట్లో ప్రజల స్పందనను కళ్లకు కడుతూ.. రూపొందించిన ఈ పుస్తకాన్ని ప్రత్యేకంగా ముద్రించారు. ఇప్పటి వరకు ప్రధాని సహాపలువురు కేంద్ర మంత్రులకు, రాష్ట్ర మంత్రులకు బహూకరించారు.
This post was last modified on June 26, 2025 10:11 pm
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…