అదేంటి అనుకుంటున్నారా? ఔను.. నిజమే. వైసీపీపై నిత్యంనిప్పులు చెరిగే సీఎం చంద్రబాబు.. తాజాగా మేలైన సూచన చేశారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్న ఆయన ప్రతిపక్షాలు కూడా సహకరించాలని పరోక్షంగా వైసీపీకి సూచించారు. కలసి కట్టుగా గంజాయి, డ్రగ్స్పై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. గురువారం `యాంటీ నార్కోటిక్ డే`ను పురస్కరించుకుని గుంటూ రులో నిర్వహించిన ర్యాలీలో చంద్రబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం గంజాయి సాగును కుటీర పరిశ్రమగా మార్చిందని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం గంజాయి సహా.. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతోందన్నారు. గం జాయి నిర్మూల కేవలం ప్రభుత్వ పని మాత్రమే కాదన్న సీఎం.. దీనికి అందరూ కలిసి రావాలని సూచిం చారు. దీనిలో ప్రతిపక్షాలుకూడా పాల్గొనాలని సూచించారు. “ప్రజలను మెప్పించి ఓట్లు వేయించుకోండి“ అని ప్రతిపక్షానికి సూచించారు.
రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేయొద్దని చంద్రబాబు తేల్చి చెప్పారు. రాబోయే రోజుల్లో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ముఖ్యంగా డ్రగ్స్ నిర్మూలనకు ప్రాధాన్యం ఇస్తున్నామన్న ఆయన… తొలిసారి సినీ రంగంపై స్పందించారు. సినీరంగా నికి చెందిన ప్రముఖులు కూడా.. యాంటీ డ్రగ్స్ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. సమాజానికి మేలు చేసే కార్యక్రమాల్లో పాల్గొని మార్పు తీసు కురావాలని కోరారు.
2021లో ఏపీ నుంచి 50 శాతం గంజాయి దేశం మొత్తానికి సరఫరా అయిందని విమర్శించిన సీఎం చంద్ర బాబు.. దీనిని కట్టడి చేసేందుకు అప్పటి ప్రభుత్వం కృషి చేయలేదన్నారు. పైగా.. విశాఖపట్నాన్ని మత్తు కు కేంద్రంగా మార్చేశారని దుయ్యబట్టారు. ఇకపై అలా చేసేందుకు లేదన్నారు. ఈగల్ టీంల ద్వారా పక్కా నిఘా పెడుతున్నామని చెప్పారు.
This post was last modified on June 26, 2025 10:11 pm
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…