అదేంటి అనుకుంటున్నారా? ఔను.. నిజమే. వైసీపీపై నిత్యంనిప్పులు చెరిగే సీఎం చంద్రబాబు.. తాజాగా మేలైన సూచన చేశారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్న ఆయన ప్రతిపక్షాలు కూడా సహకరించాలని పరోక్షంగా వైసీపీకి సూచించారు. కలసి కట్టుగా గంజాయి, డ్రగ్స్పై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. గురువారం `యాంటీ నార్కోటిక్ డే`ను పురస్కరించుకుని గుంటూ రులో నిర్వహించిన ర్యాలీలో చంద్రబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం గంజాయి సాగును కుటీర పరిశ్రమగా మార్చిందని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం గంజాయి సహా.. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతోందన్నారు. గం జాయి నిర్మూల కేవలం ప్రభుత్వ పని మాత్రమే కాదన్న సీఎం.. దీనికి అందరూ కలిసి రావాలని సూచిం చారు. దీనిలో ప్రతిపక్షాలుకూడా పాల్గొనాలని సూచించారు. “ప్రజలను మెప్పించి ఓట్లు వేయించుకోండి“ అని ప్రతిపక్షానికి సూచించారు.
రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేయొద్దని చంద్రబాబు తేల్చి చెప్పారు. రాబోయే రోజుల్లో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ముఖ్యంగా డ్రగ్స్ నిర్మూలనకు ప్రాధాన్యం ఇస్తున్నామన్న ఆయన… తొలిసారి సినీ రంగంపై స్పందించారు. సినీరంగా నికి చెందిన ప్రముఖులు కూడా.. యాంటీ డ్రగ్స్ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. సమాజానికి మేలు చేసే కార్యక్రమాల్లో పాల్గొని మార్పు తీసు కురావాలని కోరారు.
2021లో ఏపీ నుంచి 50 శాతం గంజాయి దేశం మొత్తానికి సరఫరా అయిందని విమర్శించిన సీఎం చంద్ర బాబు.. దీనిని కట్టడి చేసేందుకు అప్పటి ప్రభుత్వం కృషి చేయలేదన్నారు. పైగా.. విశాఖపట్నాన్ని మత్తు కు కేంద్రంగా మార్చేశారని దుయ్యబట్టారు. ఇకపై అలా చేసేందుకు లేదన్నారు. ఈగల్ టీంల ద్వారా పక్కా నిఘా పెడుతున్నామని చెప్పారు.
ప్రభాస్ అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్ లో కూడా విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా కల్కి 2. ఆల్రెడీ…
ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…
నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…