అదేంటి అనుకుంటున్నారా? ఔను.. నిజమే. వైసీపీపై నిత్యంనిప్పులు చెరిగే సీఎం చంద్రబాబు.. తాజాగా మేలైన సూచన చేశారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్న ఆయన ప్రతిపక్షాలు కూడా సహకరించాలని పరోక్షంగా వైసీపీకి సూచించారు. కలసి కట్టుగా గంజాయి, డ్రగ్స్పై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. గురువారం `యాంటీ నార్కోటిక్ డే`ను పురస్కరించుకుని గుంటూ రులో నిర్వహించిన ర్యాలీలో చంద్రబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం గంజాయి సాగును కుటీర పరిశ్రమగా మార్చిందని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం గంజాయి సహా.. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతోందన్నారు. గం జాయి నిర్మూల కేవలం ప్రభుత్వ పని మాత్రమే కాదన్న సీఎం.. దీనికి అందరూ కలిసి రావాలని సూచిం చారు. దీనిలో ప్రతిపక్షాలుకూడా పాల్గొనాలని సూచించారు. “ప్రజలను మెప్పించి ఓట్లు వేయించుకోండి“ అని ప్రతిపక్షానికి సూచించారు.
రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేయొద్దని చంద్రబాబు తేల్చి చెప్పారు. రాబోయే రోజుల్లో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ముఖ్యంగా డ్రగ్స్ నిర్మూలనకు ప్రాధాన్యం ఇస్తున్నామన్న ఆయన… తొలిసారి సినీ రంగంపై స్పందించారు. సినీరంగా నికి చెందిన ప్రముఖులు కూడా.. యాంటీ డ్రగ్స్ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. సమాజానికి మేలు చేసే కార్యక్రమాల్లో పాల్గొని మార్పు తీసు కురావాలని కోరారు.
2021లో ఏపీ నుంచి 50 శాతం గంజాయి దేశం మొత్తానికి సరఫరా అయిందని విమర్శించిన సీఎం చంద్ర బాబు.. దీనిని కట్టడి చేసేందుకు అప్పటి ప్రభుత్వం కృషి చేయలేదన్నారు. పైగా.. విశాఖపట్నాన్ని మత్తు కు కేంద్రంగా మార్చేశారని దుయ్యబట్టారు. ఇకపై అలా చేసేందుకు లేదన్నారు. ఈగల్ టీంల ద్వారా పక్కా నిఘా పెడుతున్నామని చెప్పారు.
This post was last modified on June 26, 2025 10:11 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…