వైసీపీ అధినేత జగన్ కేసులకు భయపడుతున్నారా? ఒకప్పుడు ఉన్న ధైర్యం ఇప్పుడు కోల్పోయారా? అంటే.. తాజాగా జరిగిన పరిణామం.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే అక్రమాస్తుల కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే, వాటి విషయంలో ఒకప్పుడు 16 మాసాల పాటు జైలుకు వెళ్లిన విషయం కూడాఅందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ.. తాజాగా మాత్రం ఆయన యూటర్న్ తీసుకున్నారు.
కేసులు ఎదుర్కొనే పరిస్థితి లేదని గ్రహించారో ఏమో తెలియదు కానీ.. తనపై నమోదైన కేసును కొట్టి వేయా లని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని అర్జంటుగావిచారించాలని కూడా జగన్ కోరడం గమనార్హం. ఈ మేరకు బుధవారంమధ్యాహ్నం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. అయితే.. దీనిని అప్పటి కప్పుడు విచారించేందుకు కోర్టు నిరాకరించింది. ఈ కేసు అంత అర్జంటుగా విచారించాల్సిన అవసరం లేదని తేల్చింది. ఈ క్రమంలోనే గురువారానికి వాయిదా వేసింది.
ఇటీవల గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జగన్ పర్యటించినప్పుడు ఆయన కాన్వాయ్ కింద పడి సొంత పార్టీ కార్యకర్త నలిగిపోయారు. ఈ కేసులో జగన్ కారును నడిపిన డ్రైవర్ రమణారెడ్డిని ఏ1గా పోలీసులు నమోదు చేశారు. ఇక, ఏ2గా జగన్ పేరును పేర్కొన్నారు. ప్రమాద విషయం తెలిసి కూడా జగన్ అక్కడ నుంచి వెళ్లిపోయారన్నది పోలీసులు నమోదు చేసిన కేసును బట్టి తెలుస్తోంది.
ఈ పరిణామాలతోపాటు.. ఇతర నాయకులు పేర్ని నాని, విడదల రజనీ, జగన్ పీఏపైనా కేసులు పెట్టారు. ఈ క్రమంలో పేర్ని, విడదల ఇప్పటికే తమపై నమోదైన కేసులు కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా తనపై నమోదైన కేసును కూడా కొట్టేయాలని జగన్ లంచ్ మోషన్ దాఖలు చేశారు. అయితే.. కోర్టు మాత్రం దీనినిఅర్జంటుగా విచారించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ.. గురువారానికి వాయిదా వేసింది. దీంతో కేసులు ఎదుర్కొనే ధైర్యం జగన్ కోల్పోతున్నారా? అని సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి.
This post was last modified on June 25, 2025 3:25 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…