Political News

కేసులు ఎదుర్కొనే ధైర్యం జ‌గ‌న్ కోల్పోతున్నారా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ కేసుల‌కు భ‌య‌ప‌డుతున్నారా? ఒక‌ప్పుడు ఉన్న ధైర్యం ఇప్పుడు కోల్పోయారా? అంటే.. తాజాగా జ‌రిగిన ప‌రిణామం.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికే అక్ర‌మాస్తుల కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే. అయితే, వాటి విష‌యంలో ఒక‌ప్పుడు 16 మాసాల పాటు జైలుకు వెళ్లిన విష‌యం కూడాఅంద‌రికీ గుర్తుండే ఉంటుంది. కానీ.. తాజాగా మాత్రం ఆయ‌న యూట‌ర్న్ తీసుకున్నారు.

కేసులు ఎదుర్కొనే ప‌రిస్థితి లేద‌ని గ్ర‌హించారో ఏమో తెలియ‌దు కానీ.. త‌న‌పై న‌మోదైన కేసును కొట్టి వేయా ల‌ని కోరుతూ హైకోర్టును ఆశ్ర‌యించారు. దీనిని అర్జంటుగావిచారించాల‌ని కూడా జ‌గ‌న్ కోరడం గ‌మ‌నార్హం. ఈ మేర‌కు బుధ‌వారంమ‌ధ్యాహ్నం హైకోర్టులో లంచ్ మోష‌న్ పిటిష‌న్ వేశారు. అయితే.. దీనిని అప్ప‌టి క‌ప్పుడు విచారించేందుకు కోర్టు నిరాక‌రించింది. ఈ కేసు అంత అర్జంటుగా విచారించాల్సిన అవ‌స‌రం లేద‌ని తేల్చింది. ఈ క్ర‌మంలోనే గురువారానికి వాయిదా వేసింది.

ఇటీవ‌ల గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లిలో జ‌గ‌న్ ప‌ర్య‌టించిన‌ప్పుడు ఆయ‌న కాన్వాయ్ కింద ప‌డి సొంత పార్టీ కార్య‌క‌ర్త న‌లిగిపోయారు. ఈ కేసులో జ‌గ‌న్ కారును న‌డిపిన డ్రైవ‌ర్ ర‌మ‌ణారెడ్డిని ఏ1గా పోలీసులు న‌మోదు చేశారు. ఇక‌, ఏ2గా జ‌గ‌న్ పేరును పేర్కొన్నారు. ప్ర‌మాద విష‌యం తెలిసి కూడా జ‌గ‌న్ అక్క‌డ నుంచి వెళ్లిపోయార‌న్న‌ది పోలీసులు న‌మోదు చేసిన కేసును బ‌ట్టి తెలుస్తోంది.

ఈ ప‌రిణామాల‌తోపాటు.. ఇత‌ర నాయ‌కులు పేర్ని నాని, విడ‌ద‌ల ర‌జ‌నీ, జ‌గ‌న్ పీఏపైనా కేసులు పెట్టారు. ఈ క్ర‌మంలో పేర్ని, విడ‌ద‌ల ఇప్ప‌టికే త‌మ‌పై న‌మోదైన కేసులు కొట్టేయాల‌ని హైకోర్టును ఆశ్ర‌యించారు. తాజాగా త‌న‌పై న‌మోదైన కేసును కూడా కొట్టేయాల‌ని జ‌గ‌న్ లంచ్ మోష‌న్ దాఖ‌లు చేశారు. అయితే.. కోర్టు మాత్రం దీనినిఅర్జంటుగా విచారించాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొంటూ.. గురువారానికి వాయిదా వేసింది. దీంతో కేసులు ఎదుర్కొనే ధైర్యం జ‌గ‌న్ కోల్పోతున్నారా? అని సోష‌ల్ మీడియాలో కామెంట్లు ప‌డుతున్నాయి.

This post was last modified on June 25, 2025 3:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago