వైసీపీ అధినేత జగన్ కేసులకు భయపడుతున్నారా? ఒకప్పుడు ఉన్న ధైర్యం ఇప్పుడు కోల్పోయారా? అంటే.. తాజాగా జరిగిన పరిణామం.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే అక్రమాస్తుల కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే, వాటి విషయంలో ఒకప్పుడు 16 మాసాల పాటు జైలుకు వెళ్లిన విషయం కూడాఅందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ.. తాజాగా మాత్రం ఆయన యూటర్న్ తీసుకున్నారు.
కేసులు ఎదుర్కొనే పరిస్థితి లేదని గ్రహించారో ఏమో తెలియదు కానీ.. తనపై నమోదైన కేసును కొట్టి వేయా లని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని అర్జంటుగావిచారించాలని కూడా జగన్ కోరడం గమనార్హం. ఈ మేరకు బుధవారంమధ్యాహ్నం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. అయితే.. దీనిని అప్పటి కప్పుడు విచారించేందుకు కోర్టు నిరాకరించింది. ఈ కేసు అంత అర్జంటుగా విచారించాల్సిన అవసరం లేదని తేల్చింది. ఈ క్రమంలోనే గురువారానికి వాయిదా వేసింది.
ఇటీవల గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జగన్ పర్యటించినప్పుడు ఆయన కాన్వాయ్ కింద పడి సొంత పార్టీ కార్యకర్త నలిగిపోయారు. ఈ కేసులో జగన్ కారును నడిపిన డ్రైవర్ రమణారెడ్డిని ఏ1గా పోలీసులు నమోదు చేశారు. ఇక, ఏ2గా జగన్ పేరును పేర్కొన్నారు. ప్రమాద విషయం తెలిసి కూడా జగన్ అక్కడ నుంచి వెళ్లిపోయారన్నది పోలీసులు నమోదు చేసిన కేసును బట్టి తెలుస్తోంది.
ఈ పరిణామాలతోపాటు.. ఇతర నాయకులు పేర్ని నాని, విడదల రజనీ, జగన్ పీఏపైనా కేసులు పెట్టారు. ఈ క్రమంలో పేర్ని, విడదల ఇప్పటికే తమపై నమోదైన కేసులు కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా తనపై నమోదైన కేసును కూడా కొట్టేయాలని జగన్ లంచ్ మోషన్ దాఖలు చేశారు. అయితే.. కోర్టు మాత్రం దీనినిఅర్జంటుగా విచారించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ.. గురువారానికి వాయిదా వేసింది. దీంతో కేసులు ఎదుర్కొనే ధైర్యం జగన్ కోల్పోతున్నారా? అని సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి.
This post was last modified on June 25, 2025 3:25 pm
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కబోతున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు…
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. ఉదయం 11 గంటలకు బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో బెంగాల్ సీఎంగా సువేందు…
ఇప్పటికే పలు వాయిదాల్లో నలిగిపోయిన సూర్య వీరభద్రుడు మే 14 విడుదల కానుంది. మొన్నటిదాకా వాయిదా పడుతుందనే ప్రచారం చెన్నై…
జనసేనాని పవన్ కళ్యాణ్ మీద గత రెండు మూడు రోజులుగా వైసీపీ మద్దతుదారులు. అనుకూల మీడియా పెడుతున్న సోషల్ మీడియా…
మేం ఫేమస్ చిత్రంతో టాలీవుడ్లోకి దూసుకొచ్చాడు యువ నటుడు సుమంత్ ప్రభాస్. షార్ట్ ఫిలిమ్స్ నేపథ్యం నుంచి వచ్చిన ఈ…
ఇప్పుడు టాలీవుడ్లో ఏ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ పరిస్థితీ అంత బాగా లేదు. సక్సెస్ రేట్ అంతకంతకూ పడిపోతోంది. జనాలు థియేటర్లకు…