యువ ఐఏఎస్ అధికారిణి కాటా అమ్రాపాలి ఎట్టకేలకు విజయం సాధించారు. తెలుగు రాష్ట్రాల విభజన నేపథ్యంలో ఏపీ కేడర్ కు అమ్రపాలిని కేంద్రం కేటాయించగా… ఏపీకి వెళ్లేందుకు ఆమె ససేమిరా అన్నారు. దాదాపుగా పదేళ్ల పాటు ఆమె కోర్టుల్లో పోరాటం చేస్తూ ఈ పదేళ్ల పాటు ఏపీ కేడర్ కు కేటాయించినా… ఆమె తెలంగాణ కేడర్ లోనే పని చేశారు. ఇటీవలే మరో ఇద్దరు ఐఏఎస్ లతో కలిసి ఏపీకి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లారు. తాజాగా క్యాట్ అమ్రపాలికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో తిరిగి ఆమె ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లిపోనున్నారు.
వాస్తవానికి అమ్రపాలి స్వస్థలం ఏపీనే. నెల్లూరు జిల్లాకు చెందిన ఆమె ఫ్యామిలీ చాలా కాలం క్రితం విశాఖకు మారిపోయింది. ఐఏఎస్ కు ఎంపిక అయిన సమయంలోనూ ఆమె ఫ్యామిలీ విశాఖలోనే ఉంది. ఈ క్రమంలోనే ఆమె ఏపీ కేడర్ నే ఎంచుకున్నారు. ఆమె ఎంపిక మేరకే డీఓపీటీ ఆమెను ఏపీకి కేటాయించింది. అయితే చాలా మంది సివిల్ సర్వీసెస్ అధికారుల మాదిరే అమ్రపాలి కూడా రాష్ట్ర విభజనను ఊహించలేదు. అప్పటికే తెలంగాణ వాతావరణానికి అలవాటు పడ్డ అమ్రపాలి తాను తెలంగాణలోనే ఉంటానని డీఓపీటీకి ఆప్షన్ ఇచ్చింది.
అయితే మెజారిటీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తెలంగాణకే ఆప్షన్ ఇవ్వగా… ఏపీకి ఆప్షన్ ఇచ్చిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ క్రమంలో అమ్రపాలి తెలంగాణకు ఆప్షన్ ఇచ్చినా… ఆమెను డీఓపీటీ మాత్రం ఏపీకి కేటాయించింది. ఇలాగే చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ లను వారి ఆప్షన్ లకు విరుద్ధంగా ఏపీకి కేటాయించింది. డీఓపీటీ నిర్ణయాన్నిచాలా మంది అంగీకరిస్తే…అమ్రపాలి లాంటి వాళ్లు మాత్రం న్యాయపోరాటం మొదలుపెట్టారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ (క్యాట్) ఆశ్రయించారు.
క్యాట్ నుంచి తుది తీర్పు వచ్చేలోగానే ఇటీవలే అమ్రపాలితో పాటు మరో ఇద్దరు ఐఏఎస్ లు ఏపీ కేడర్ కు వెళ్లి తీరాల్సిందేనని డీఓపీటీ ఒకింత గట్టిగానే చెప్పింది. అంతేకాకుండా తెలంగాణ నుంచి రిలీవ్ అయి ఏపీ కేడర్ లో జాయిన్ అయ్యేందుకు వారికి ఓ గడువును కూడా నిర్దేశించింది. దీంతో చేసేది లేక అమ్రపాలి సహా ముగ్గురు ఏపీ కేడర్ కు వెళ్లారు. ఏపీకి వెళ్లినంతనే అమ్రపాలికి టూరిజం కార్యదర్శిగా మంచి పోస్టే దక్కింది. అయితే తాజాగా మంగళవారం తుది తీర్పు వెలువరిస్తూ అమ్రపాలిని తెలంగాణ కేడర్ కే కేటాయించింది. దీంతో త్వరలోనే ఆమె ఏపీ కేడర్ నుంచి తెలంగాణ కేడర్ కు మారనున్నారు.
This post was last modified on June 24, 2025 11:15 pm
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…
బండ్ల గణేష్ అనే నటుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్రలు చేసింది లేదు. నటుడిగా అతడిది గొప్ప కెరీర్ కాదు.…