Political News

జగన్ కు ఇక ‘జెడ్ ప్లస్’దొరకదు!

నిజమేనండోయ్…ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇకపై జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత లబించే ఛాన్సులు కనిపించడం లేదు. ఏపీ హైకోర్టులో జగన్ వేసిన పిటిషన్ పై మంగళవారం జరిగిన విచారణ తీరును గమనిస్తే… ఈ మాట నిజమేనని నమ్మక తప్పదు. ఎందుకంటే.. జగన్ కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించేంత ముప్పేమీ లేదని, అసలు జగన్ కు ఎలాంటి ప్రాణహానీ లేదని కేంద్ర హోం శాఖతో పాటు సెంట్రల్ ఇంటెలిజెన్స్ శాఖ కోర్టుకు తెలిపాయి.

జగన్ 2014లో ప్రదాన ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కూడా ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత లేదు. అయితే 2019లో సీఎం కాగానే…ఆ హోదాకు తగ్గట్టుగా కేంద్రం జగన్ కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించింది. సీఎంగా జగన్ దిగిపోయిన తర్వాత కూడా జెడ్ ప్లస్ భద్రత కొనసాగింది గానీ… ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి గుంటూరు మిర్చి యార్డును సందర్శించిన జగన్… రాజకీయ ప్రసంగం చేశారు. ఈ పరిస్థితిని ముందుగానే గమనించిన కేంద్రం ఈ పర్యటనలో జగన్ కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఉపసంహరించింది.

ఈ పరిణామంతో ఆందోళన చెందిన జగన్ తనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్ధరించేలా కేంద్రానికి ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన నాడే హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు…కేంద్ర హోం శాఖతో పాటు సెంట్రల్ ఇంటెలిజెన్స్ శాఖలకు నోటీసులు జారీ చేసింది. జగన్ పిటిషన్ పై కౌంటర్లు దాఖలు చేయాలని వాటిలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నోటీసులకు తాజాగా ఆ రెండు సంస్థలు స్పందించి… తమ స్పందనను తెలియజేశాయి.

జగన్ కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించే అవసరం లేదని, సాధారణ భద్రత సరిపోతుందని కేంద్ర హోం శాఖ తన అఫిడవిట్ లో కోర్టుకు తెలిపింది. అంతేకాకుండా జగన్ ప్రస్తుతం ఎలాంటి ప్రాణ హానీ కూడా లేదని బీజేపీ కీలక నేత అమిత్ షా నేతృత్వంలోని ఆ శాఖ తేల్చిచెప్పింది. ఇంటెలిజెన్స్ శాఖ కూడా ఇదే భావనలలో కూడిన అఫిడవిట్ ను దాఖలు చేసింది. ఈ అఫిడవిట్ లను పరిశీలించిన కోర్టు…ఈ విషయాలపై సమగ్ర నివేదికలు అందజేయాలని ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను జూలై 15కు వాయిదా వేసింది.

This post was last modified on June 24, 2025 11:12 pm

Share

Recent Posts

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

2 hours ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

2 hours ago

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

6 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

6 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

7 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

7 hours ago