Political News

గుజరాత్‌లోనే మోదీకి షాక్ ఇచ్చిన ఉప ఎన్నికలు!

దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి భారీ షాక్ తగిలింది. అంతేకాదు, మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనూ బీజేపీ ఓడిపోయింది. కేవలం ఒక్కే ఒక్క స్థానంలో మాత్రమే బీజేపీ విజయాన్ని సాధించింది. ఇదే సమయంలో మోదీతో నిత్యం వివాదాలు సాగించే ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అటు గుజరాత్‌లోను, ఇటు తమ పాలన సాగుతున్న పంజాబ్‌లోను ప్రజలు ఆప్ అభ్యర్థులను గెలిపించారు.

ఇక పశ్చిమ బెంగాల్‌లో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి తాజాగా జరిగిన ఉప ఎన్నిక షాక్ ఇచ్చింది. కనీసం 15 వేల ఓట్లు కూడా పడలేదు. దీంతో సదరు అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. ఇక్కడ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రభపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు అందరూ కూడా మోదీ ఫొటోతో, మోదీ పథకాలు, విశ్వగురు అనే కాన్సెప్టుతోనూ ప్రచారానికి దిగడం, వారంతా ఓడిపోవడం గమనార్హం.
ఎక్కడెక్కడ ఎలా ఎలా?

— నాలుగు రాష్ట్రాల్లో 5 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. వీటిని బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. వీటిలో గుజరాత్‌లోనే రెండు స్థానాలు ఉన్నాయి. కేరళలో ఒకటి, పశ్చిమ బెంగాల్‌లో ఒకటి, పంజాబ్‌లో ఒక స్థానానికి ఎన్నికలు జరిగాయి. వీటి ఫలితాలు సోమవారం వెలుగుచూశాయి.

— గుజరాత్‌లోని విశావదర్‌, కాడి అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో విశావదర్‌ నియోజకవర్గంలో బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదు. అయితే కాడి నియోజకవర్గంలో మాత్రం బీజేపీ విజయం సాధించింది.

— గుజరాత్‌లోని విశావదర్‌ సీటు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించి మోదీకి సవాల్ విసిరింది.

— పంజాబ్‌లోని లుథియానా పశ్చిమ నియోజకవర్గానికి జరిగిన ఉప పోరులో అధికార ఆప్ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు బలం చేకూరినట్టు అయింది.

— కేరళలోని నిలంబూర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో సీఎం పినరయి విజయన్‌ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ఓడిపోగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌ అభ్యర్థి ఆర్యదాన్ షౌకత్ విజయం సాధించారు.

— పశ్చిమ బెంగాల్‌లోని కాళిగంజ్‌ ఉప ఎన్నికలో మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. వాస్తవానికి ఇక్కడ విజయం సాధించేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నం చేసింది. అయినా విజయం చేరువ కాలేదు. పైగా, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

This post was last modified on June 24, 2025 1:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

14 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago