తాజాగా కూటమి ప్రభుత్వం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా కీలకమైన సందేశాన్ని ఇచ్చారని చెప్పాలి. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కూటమి ఐక్యత పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది తర్వాత కూడా కూటమి బలంగా ఉందని చంద్రబాబు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు, అంతేకాదు ఎక్కడ ఒడిదుడుకులు లేవని ఏడాది కాలంలో ఎలాంటి ఇబ్బంది రాలేదని కూడా చంద్రబాబు చెప్పారు, భవిష్యత్తులోనూ తమ కోటమి కొనసాగుతుందని తెలిపారు.
ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని చెబుతూ.. మరింత గట్టిగా కూటమి ఐక్యతను చాటారు. అంతేకాదు వైసీపీని నేరుగా ఆయన టార్గెట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ అధికారంలోకి రాదు అని బల్లగుద్ది మరి చెప్పారు. వచ్చే ఎన్నికల్లోను కూటమి బలంగా ముందుకు వెళుతుందని, వైసీపీకి అధికారం కలలేనని స్పష్టం చేశారు. తామంతా కలివిడిగా ఉన్నామని, ఎక్కడ ఎలాంటి విభేదాలు లేవని రావని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాలు వైసీపీలో తీవ్ర ప్రకంపనలే సృష్టించాయి.
ఎందుకంటే గత ఎన్నికల్లో మూడు పార్టీలు కలవకూడదని, కలవరాదని వైసీపీ అధినేత జగన్ అనేక ప్రయత్నాలు చేశారు. చంద్రబాబును పవన్ను దూరం పెట్టేందుకు ఇటు సోషల్ మీడియా అటు బహిరంగ వేదికలపై కూడా ఇద్దరినీ టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేశారు. సామాజిక వర్గాలపరంగా కూడా కాపు నాయకులను కొందరిని రంగంలోకి దింపి రాజకీయాలు సాగించారు. అయినా గత ఎన్నికల్లో రెండు పార్టీలు కలిశాయి. ఫలితంగా వైసిపి 40% ఓటు బ్యాంకు తెచ్చుకున్న ఓడిపోయింది.
ఈ పరిస్థితుల్లో కూటమిలో బేదాభిప్రాయాలు ఏర్పడి, కూటమి విచ్ఛిన్నమైతే తప్ప తమకు అవకాశం లేదని వైసిపి గత ఎన్నికల సమయంలోనే గ్రహించింది, అందుకే తరచుగా ఇటు జనసేనలో కానీ అటు టిడిపిలో కానీ మరోవైపు బిజెపిలో కానీ వ్యక్తిగతంగా నాయకులు ఎవరైనా చిన్న మాట అన్నా దానిని హైలెట్ చేస్తూ ప్రచారం చేస్తుంది. ఇటీవల ఒక బీజేపీ నాయకుడి పై జనసేన నాయకుడు విరుచుకుపడ్డాడు. ఈ విషయాన్ని వైసిపి మీడియా తీవ్రస్థాయిలో ప్రచారం చేసింది.
ఇలా మూడు పార్టీల మధ్య ఏదో ఒకచోట విభేదాలు రావడం ఖాయమని అది తమ లాభిస్తుందని వైసిపి అంచనా వేసింది. కానీ తాజా పరిణామాలతో తామంతా కలిసే ఉన్నామని ఎట్టి పరిస్థితుల్లో వైసిపికి అధికారం దక్కనివ్వమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన తరువాత వైసిపి ఒకరకంగా దిగాలు పడిందని చెప్పాలి. అయితే బిజెపితో ఉన్న సత్సంబంధాల కారణంగా వచ్చే ఎన్నికల నాటికి ఏదైనా వ్యూహం మార్చుకుని అడుగులు వేస్తే అప్పుడు మాత్రం వైసీపీకి అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.
This post was last modified on June 24, 2025 12:36 pm
మార్చి నుంచి ఆగస్టుకి విడుదల తేదీ వాయిదా వేసుకున్న నాని ది ప్యారడైజ్ ఖచ్చితంగా చెప్పిన డేట్ కి విడుదలవుతుందా…
జన నాయకుడు పైరసీని పూర్తి స్థాయిలో కాకపోయినా గరిష్ట స్థాయిలో కట్టడి చేయడంలో నిర్మాణ సంస్థ సక్సెస్ అయ్యింది. వీడియో…
అదేంటో కానీ.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పలు కీలక విషయాలు సాధారణ రోజుల్లో ఎక్కడా గుర్తుకు ఉండవు... రావు. ఎన్నికల…
సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…
జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లిపోతే పరిణామాలు ఎలా ఉంటాయో మరోసారి రుజువైంది. పవన్ కళ్యాణ్, రామ్…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…