ఏపీలో ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయనున్నారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ 6’ హామీల్లో ఇది కీలకం. అయితే.. ఏడాది పూర్తయిన నేపథ్యంలో దీనిపై అనేక అధ్యయనాలు కూడా పూర్తయ్యాయి. దీనికి దాదాపు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. జిల్లాలు, మండలాల వారీగా మహిళలకు పాసులు ఇవ్వనున్నట్టు తెలిసింది. దీని ప్రకారం.. బస్సుల్లో వారు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. దీనిని ఎట్టి పరిస్థితిలోనూ ఆగస్టు 15 నుంచి ప్రారంభం చేయనున్నారు.
ఈ విషయాన్ని తాజాగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. మహిళలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని చెప్పారు. తెలుగు దేశం పార్టీ మహిళా పక్షపాతి అని.. గతంలోనూ మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించామని.. ఇటీవలే తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేశామని అన్నారు. ఈ క్రమంలో ఆగస్టు 15 నుంచి ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా అమలు చేయనున్నట్టు చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. సూపర్6ను అమలు చేస్తామని చెప్పారు. అయితే.. ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు నష్టపోయే అవకాశం ఉందని తనకు నివేదికలు అందాయని సీఎం చెప్పారు.
దీనిపై కూడా కసరత్తు చేసిన సీఎం తెలిపారు. రవాణా రంగంపై ఆధారపడి లక్షల మంది కార్మికులు జీవిస్తున్నారని.. ప్రైవేటు రవాణా రంగంతో ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తోందని తెలిపారు. ఇలాంటి సమయంలో వారు నష్ట పోకుండా.. ఆగస్టు 15నే వారిని ఆదుకునేందుకు సంక్షేమ పథకాన్ని ప్రకటిస్తామన్నారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణాల కారణంగా నష్టపోయే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు సొమ్ములు మంజూరు చేస్తామని తెలిపారు. అయితే.. దీనిపై విధివిధానాలను త్వరలోనే వెల్లడించనున్నట్టు ముఖ్యమంత్రి వివరించారు. కాగా.. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కారణంగా.. తమకు కిరాయిలు తగ్గుతాయని.. నష్టపోతామని.. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పడం గమనార్హం.
This post was last modified on June 24, 2025 9:12 am
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…