Political News

పిచ్చివేషాలు వేస్తే తొక్కిపట్టి నార తీస్తాం: పవన్ కల్యాణ్

ప్రతిపక్ష హోదాకు సరిపడినన్ని సీట్లు కూడా దక్కించుకోలేని వైసీపీ ఇప్పటికీ తన దుర్మార్గాలను వీడలేదని, తాను అధికారంలో ఉండగా… ఎలాంటి అరాచకాలకు పాల్పడిందో ఇప్పుడూ అదే చేస్తోందని జనసేనాని, ఏపీ డిప్యేటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ వాస్తవ పరిస్థితిని గుర్తించి పద్దతి మార్చుకుంటే సరేనని… లేదని పిచ్చి వేషాలు వేస్తే తొక్కిపట్టి నార తీస్తామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు కూటమి పాలనకు ఏడాది పూర్తి అయిన సందర్భంగా అమరావతిలో సోమవారం నిర్వహించిన సుపరిపాలనకు తొలి అడుగు సమావేశంలో ప్రసంగించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

శాంతిభద్రతల విషయంలో కూటమి సర్కారు రాజీ పడే ఆస్కారమే లేదని పవన్ తేల్చి చెప్పారు. చట్టబద్ధంగా పాలన అమలు చేయాలి కాబట్టి పద్దతిగా ఉంటున్నామన్న పవన్… ఎన్నో దెబ్బలు తిని ఇక్కడిదాకా వచ్చామన్న విషయాన్ని వైసీపీ నేతలు మరిచిపోరాదని ఆయన హెచ్చరించారు. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించాలని చూస్తే..సహించేది లేదని కూడా పవన్ వార్నింగ్ ఇచ్చారు. గడచిన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగిందన్న పవన్…దానిని తుదముట్టించేందుకు తామందరం ఏకమయ్యామని చెప్పారు. మూడు పార్టీల లక్ష్యాన్ని ప్రజలు కూడా గుర్తించి కూటమి కి అండగా నిలిచారని ఆయన పేర్కొన్నారు.

గడచిన ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైపోగా.. దానిని సీఎం చంద్రబాబు గాడిన పెడుతున్నారని పవన్ అన్నారు. ఇక బాబు కృషికి ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు మెండుగా ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఏడాది కాలంలోనే రూ.4 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులతో పరిశ్రమలు నెలకొనేలా చేశామని ఆయన చెప్పారు. గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధులను పెంచామన్న పవన్… పల్లె పండుగ ద్వారా పల్లె సీమలకు సుందరమైన రహదారులను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ దిశగా తనకు అటు మోదీ నుంచి, ఇటు చంద్రబాబు నుంచి సంపూర్ణ మద్దతు లభించిందని పవన్ చెప్పుకొచ్చారు.

గడచిన ఐదేళ్ల వైసీపీ పాలనను చూస్తే తన లాంటి వారికే భయం వేసిందని పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్న పవన్.. నాటి ప్రభుత్వ దమన నీతికి అధికారులు కూడా గడగడలాడే వారని ఆయన పేర్కొన్నారు. చివరకు సీఎం చంద్రబాబును కూడా నాటి పాలకులు అనేక రకాలుగా వేధింపులకు గురి చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో సహా తమను వారు అనేక ఇబ్బందులకు గురి చేశారని పవన్ అన్నారు. ఆ తరహా పాలన చూశాక ఇక ఏపీకి వెలుగు వస్తుందా? అన్న అనుమానం కలిగిందన్నారు. కూటమి సర్కారు అధికారంలోకి రాకపోయి ఉంటే… ఏపీ ఏమైపోయి ఉండేదోనన్న ఆందోళన ఇప్పటికీ తనను వేధిస్తూనే ఉందని పవన్ చెప్పుకొచ్చారు.

Satya

Recent Posts

వివేకాను చంపించింది జగనే: లోకేశ్

ఏపీ మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…

1 hour ago

రుక్మిణి వసంత్… ఇంకో మెగా మూవీలో?

‘సప్తసాగరాలు దాటి’ చిత్రంలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది రుక్మిణి వసంత్. ఆ సినిమాలో రుక్మిణిని చూసిన…

1 hour ago

మసూద దర్శకుడు… ఎట్టకేలకు

తెలుగులో వచ్చిన ఉత్తమ హార్రర్ చిత్రాల్లో.. ‘మసూద’ కచ్చితంగా చెప్పుకోవాల్సిన పేరు. ఇందులో పెద్దగా పేరున్న నటులేమీ నటించలేదు. అప్…

2 hours ago

బేబీ డబ్బులు ఇంకా రాలేదా?

తెలుగులో వచ్చిన చిన్న సినిమాల్లో అతి పెద్ద సంచలనాల్లో ‘బేబీ’ ఒకటి. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్…

2 hours ago

బాబు ప్రభుత్వాన్ని దున్నపోతు తో పోల్చిన జగన్

సీఎం చంద్రబాబు మీద మాజీ సీఎం జగన్ నోరు పారేసుకోవడం కొత్తేమీ కాదు. చంద్రబాబును నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు…

3 hours ago

ప్రభుత్వ లాంఛనాలు తిరస్కరించిన ముద్రగడ కుటుంబం

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…

3 hours ago