Political News

జ‌గ‌న్ కు ఆ అనుమతులు ఇవ్వొద్దు: ష‌ర్మిల డిమాండ్

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ల‌కు అనుమ‌తులు ఇవ్వ‌ద్ద‌ని కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్, జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల డిమాండ్ చేశారు. అంతేకాదు.. అస‌లు ప్ర‌జ‌ల స‌మీక‌ర‌ణ‌ల‌కు జ‌గ‌న్‌కు అనుమ‌తి ఇస్తే.. తామే కోర్టుకు వెళ్తామ‌ని హెచ్చ‌రించారు. గుంటూరు జిల్లా రెంట‌పాళ్ల గ్రామంలో జ‌రిగిన దారుణంపై జ‌గ‌న్‌లో ఎలాంటి ప‌శ్చాత్తాపం క‌నిపించ‌డం లేద‌న్నారు. ఇలాంటి వారు ప్ర‌జ‌ల మ‌ధ్య తిరిగేందుకు అనుమ‌తి ఇస్తే.. ప్ర‌జ‌ల ప్రాణాల‌కు భ‌ద్ర‌త లేకుండా పోతుంద‌ని విమ‌ర్శించారు. రెంట‌పాళ్ల గ్రామంలో వైసీపీ కార్య‌క‌ర్త ఒక‌రు.. కాన్వాయ్ కింద ప‌డి మ‌ర‌ణించిన ఘ‌ట‌న‌లో జ‌గ‌న్‌పై కేసు పెట్ట‌డాన్ని స్వాగ‌తిస్తున్నామ‌ని ఆమె చెప్పారు.

అయితే.. ఆధారాల‌ను ప‌క్కాగా సేక‌రించి కేసులో శిక్ష ప‌డేలా చేయాల‌ని.. ఈ విష‌యంలో ఏమాత్రం తేడాగా వ్య‌వ‌హ‌రించినా.. జ‌గ‌న్ త‌ప్పించుకునే అవ‌కాశం ఉంద‌ని ష‌ర్మిల చెప్పారు. జ‌గ‌న్ నిర్ల‌క్ష్యం కార‌ణంగానే సింగ‌య్య అనే కార్య‌క‌ర్త మృతి చెందాడ‌ని ఆమె చెప్పారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో జ‌గ‌న్ నిర్ల‌క్ష్యం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంద‌న్నారు. క‌నీసం ఐదు రోజుల త‌ర్వాతైనా.. ప్ర‌భుత్వం త‌న త‌ప్పును స‌రిదిద్దుకుంద‌న్నారు. చేసిన త‌ప్పుడు ప‌నికి.. ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిన అవ‌స‌రం జ‌గ‌న్ పై ఉంద‌న్నారు. అయితే.. క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క‌పోగా.. ఇది న‌కిలీ వీడియో ఏఐ ద్వారా రూపొందించార‌ని చెప్ప‌డం.. దారుణ‌మ‌ని విమ‌ర్శించారు.

సోమ‌వారం తిరుప‌తిలో ప‌ర్య‌టించిన ష‌ర్మిల‌.. మీడియాతో మాట్లాడారు. “జ‌గ‌న్‌కు ఏ మాత్రం మానవత్వం ఉన్నా సింగ‌మ‌య్య కుటుంబానికి 5 కోట్లో,  10 కోట్లో పరిహారం ఇచ్చి క్షమించమని వేడుకోవాలి. ప్ర‌జ‌ల ముందు కూడా బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి.“ అని వ్యాఖ్యానించారు. ఐదేళ్ల‌పాటు స‌మ‌స్య‌ల‌ను గాలికి వ‌దిలేసిన పెద్ద‌మ‌నిషి.. ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను ఓదార్చేందుకు బ‌య‌లు దేరార‌ని ఎద్దేవా చేశారు.

‘‘జగన్‌వి బలప్రదర్శనలు, జన సమీకరణ కార్యక్రమాలు“ అని వ్యాఖ్యానించారు. అందుకే ఈ ప‌ర్య‌ట‌న‌ల‌కు అనుమ‌తులు ఇవ్వ‌ద్ద‌ని కూట‌మి ప్ర‌భుత్వాన్ని గ‌ట్టిగా కోరుతున్నామ‌న్నారు. ప్ర‌మాద స‌మ‌యంలో కారులో ఉన్న వారంద‌రినీ విచారించా ల్సిందేన‌న్నారు.  “జగన్‌కి మానవత్వం అనే పదానికి అర్థం తెలియదు. మానవత్వం ఉంటే సింగయ్యను ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లలేదు.“ అని ప్ర‌శ్నించారు. భ‌విష్య‌త్తులో జ‌గ‌న్ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రాకుండా నిలువ‌రించేలా తాము న్యాయ పోరాటం చేస్తామ‌న్నారు. ఇంట్లో కూర్చొని కూడా ప్ర‌జ‌ల‌తో మాట్లాడ‌వ‌చ్చ‌ని.. జ‌గ‌న్ ఇక‌, ఇంటికే ప‌రిమితం కావ‌డం మంచిద‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on June 23, 2025 7:52 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సుహాస్ స్టామినాకిది అగ్ని పరీక్ష

చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…

57 minutes ago

ఇలాంటి రాజకీయ నాయకులను ఏమనాలి?

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరిస్తూ…

1 hour ago

రాజు గారు రెచ్చిపోతున్నారు

నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్‌గా ఎదిగాక..…

1 hour ago

కాంట్రావర్సీ ముదురుతున్న కేరళ స్టోరీ 2

వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…

2 hours ago

సుప్రీం వ్యాఖ్యలను రాష్ట్రాలు ఎలా తీసుకుంటాయి?

రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…

2 hours ago

శంకర్‌ డ్రీమ్ ప్రాజెక్టులో ధనుష్?

ఒకప్పుడు శంకర్‌తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…

3 hours ago