Political News

జగన్ పై హోమ్ మినిస్టర్ సంచలన వ్యాఖ్యలు

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌పై ఏపీ హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత నిప్పులు చెరిగారు. `జ‌గ‌న్ రాజ‌కీయాల‌కు ప‌నికి రాని పువ్వు` అని ఆమె పేర్కొన్నారు. “అస‌లు రాజ‌కీయాలంటే.. ఏంటో కూడా తెలియ‌ని జ‌గ‌న్‌.. రాజ‌కీయాల గురించి మాట్లాడుతున్నారు“ అని ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం రెంట‌పాళ్ల గ్రామంలో జ‌గ‌న్ ఈ నెల 18న నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర సంద‌ర్బంగా సింగ‌య్య అనే వైసీపీ కార్య‌క‌ర్త కాన్వాయ్ కింద ప‌డి మృతి చెందిన ఘ‌ట‌న‌పై తొలిసారి అనిత స్పందించారు. ఇది ముమ్మాటికీ.. జ‌గ‌న్ చేసిన ఘ‌ట‌నేన‌ని పేర్కొన్నారు.

ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లిన‌ప్పుడు స్పృహలేని నాయ‌కులు ఎవ‌రూ ఉండ‌ర‌ని.. ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకుంటార‌ని.. కానీ, జ‌గ‌న్‌లో ఆ స్పృహలోపించింద‌న్నారు. రాజకీయాల్లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలని, కానీ.. జ‌గ‌న్ త‌న నోటికి వ‌చ్చినట్టు మాట్లాడడం.. త‌న‌కు న‌చ్చిన‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డం వంటివి త‌గ‌ద‌ని చెప్పుకొచ్చారు. అందుకే జ‌గ‌న్ రాజ‌కీయాల‌కు ప‌నికిరాడ‌ని అంటున్నామ‌న్నారు. ‘‘పొదిలిలో రైతుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లి.. అక్క‌డ మ‌హిళ‌ల‌పై చెప్పులు, రాళ్లు వేయించారు. రెంట‌పాళ్ల‌లో ఎప్పుడో చ‌నిపోయిన బెట్టింగ్ రాయుడు కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు వెళ్లి.. కార్య‌క‌ర్త మ‌ర‌ణానికి కార‌ణ‌మ‌య్యారు“ అని అని ఆరోపించారు.

క‌నీసం జ‌గ‌న్ కు జాలి, ద‌య వంటివి కూడా తెలియ‌ద‌ని అనిత పేర్కొన్నారు. కారు కింద కార్యకర్త  న‌లిగిపోయినా.. ప‌ట్టించుకోని నాయ‌కుడు ఈయ‌నేన‌ని చెప్పారు. “దయ, జాలి లేకుండా పక్కకు లాగి ముళ్లపొదల్లో పడేశారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్తే ఆ వ్యక్తి బతికేవారేమో.“ అని వ్యాఖ్యానించారు. కానీ, జ‌గ‌న్ మాత్రం ఆ దిశ‌గా ఆలోచ‌న చేయ‌కుండా.. దీనిని కూడా కూట‌మి ప్ర‌భుత్వంపై తోసేసే ప్ర‌య‌త్నం చేశార‌ని ఆరోపించారు. ఇద్ద‌రు కార్య‌క‌ర్త‌లు చ‌నిపోయినా.. ఈ ప‌ర్య‌ట‌న సక్సెస్ అయింద‌ని ప్ర‌క‌టించుకున్న ఏకైక నాయ‌కుడు జ‌గ‌నేన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

“సత్యసాయి జిల్లాకు వెళ్లినప్పుడు కూడా రచ్చరచ్చ చేశారు. పొదిలి వెళ్లినప్పుడు కూడా మహిళలు, పోలీసులపై రాళ్ల దాడి చేశారు. రెంటపాళ్ల వెళ్లినప్పుడు పోలీసుల నిబంధ‌న‌లు ప‌ట్టించుకోలేదు. ఇలాంటి వారిని నాయ‌కుడు అనాలా? ఇంకేమైనా అనాలా?“ అని వంగ‌ల‌పూడి అనిత నిప్పులు చెరిగారు. బలప్రదర్శన చేయడానికే జగన్‌ బయటకు వ‌చ్చాడ‌ని వ్యాఖ్యానించారు. పైగా `రప్పా రప్పా` అంటే తప్పేంటని అడగడం ఆయ‌న మాన‌సికంగా ఏదో వ్యాధితో బాధ‌ప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌న్నారు. “జగన్‌ లాంటి వ్యక్తులకు రాజకీయాల్లో స్థానం లేదు. ఆయ‌న రాజ‌కీయంగా ప‌నికిరాని పువ్వు“ అని ఎద్దేవా చేశారు.

This post was last modified on June 23, 2025 7:44 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

2 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

3 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

3 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

3 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

5 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

5 hours ago