Political News

జగన్ పై హోమ్ మినిస్టర్ సంచలన వ్యాఖ్యలు

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌పై ఏపీ హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత నిప్పులు చెరిగారు. `జ‌గ‌న్ రాజ‌కీయాల‌కు ప‌నికి రాని పువ్వు` అని ఆమె పేర్కొన్నారు. “అస‌లు రాజ‌కీయాలంటే.. ఏంటో కూడా తెలియ‌ని జ‌గ‌న్‌.. రాజ‌కీయాల గురించి మాట్లాడుతున్నారు“ అని ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం రెంట‌పాళ్ల గ్రామంలో జ‌గ‌న్ ఈ నెల 18న నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర సంద‌ర్బంగా సింగ‌య్య అనే వైసీపీ కార్య‌క‌ర్త కాన్వాయ్ కింద ప‌డి మృతి చెందిన ఘ‌ట‌న‌పై తొలిసారి అనిత స్పందించారు. ఇది ముమ్మాటికీ.. జ‌గ‌న్ చేసిన ఘ‌ట‌నేన‌ని పేర్కొన్నారు.

ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లిన‌ప్పుడు స్పృహలేని నాయ‌కులు ఎవ‌రూ ఉండ‌ర‌ని.. ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకుంటార‌ని.. కానీ, జ‌గ‌న్‌లో ఆ స్పృహలోపించింద‌న్నారు. రాజకీయాల్లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలని, కానీ.. జ‌గ‌న్ త‌న నోటికి వ‌చ్చినట్టు మాట్లాడడం.. త‌న‌కు న‌చ్చిన‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డం వంటివి త‌గ‌ద‌ని చెప్పుకొచ్చారు. అందుకే జ‌గ‌న్ రాజ‌కీయాల‌కు ప‌నికిరాడ‌ని అంటున్నామ‌న్నారు. ‘‘పొదిలిలో రైతుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లి.. అక్క‌డ మ‌హిళ‌ల‌పై చెప్పులు, రాళ్లు వేయించారు. రెంట‌పాళ్ల‌లో ఎప్పుడో చ‌నిపోయిన బెట్టింగ్ రాయుడు కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు వెళ్లి.. కార్య‌క‌ర్త మ‌ర‌ణానికి కార‌ణ‌మ‌య్యారు“ అని అని ఆరోపించారు.

క‌నీసం జ‌గ‌న్ కు జాలి, ద‌య వంటివి కూడా తెలియ‌ద‌ని అనిత పేర్కొన్నారు. కారు కింద కార్యకర్త  న‌లిగిపోయినా.. ప‌ట్టించుకోని నాయ‌కుడు ఈయ‌నేన‌ని చెప్పారు. “దయ, జాలి లేకుండా పక్కకు లాగి ముళ్లపొదల్లో పడేశారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్తే ఆ వ్యక్తి బతికేవారేమో.“ అని వ్యాఖ్యానించారు. కానీ, జ‌గ‌న్ మాత్రం ఆ దిశ‌గా ఆలోచ‌న చేయ‌కుండా.. దీనిని కూడా కూట‌మి ప్ర‌భుత్వంపై తోసేసే ప్ర‌య‌త్నం చేశార‌ని ఆరోపించారు. ఇద్ద‌రు కార్య‌క‌ర్త‌లు చ‌నిపోయినా.. ఈ ప‌ర్య‌ట‌న సక్సెస్ అయింద‌ని ప్ర‌క‌టించుకున్న ఏకైక నాయ‌కుడు జ‌గ‌నేన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

“సత్యసాయి జిల్లాకు వెళ్లినప్పుడు కూడా రచ్చరచ్చ చేశారు. పొదిలి వెళ్లినప్పుడు కూడా మహిళలు, పోలీసులపై రాళ్ల దాడి చేశారు. రెంటపాళ్ల వెళ్లినప్పుడు పోలీసుల నిబంధ‌న‌లు ప‌ట్టించుకోలేదు. ఇలాంటి వారిని నాయ‌కుడు అనాలా? ఇంకేమైనా అనాలా?“ అని వంగ‌ల‌పూడి అనిత నిప్పులు చెరిగారు. బలప్రదర్శన చేయడానికే జగన్‌ బయటకు వ‌చ్చాడ‌ని వ్యాఖ్యానించారు. పైగా `రప్పా రప్పా` అంటే తప్పేంటని అడగడం ఆయ‌న మాన‌సికంగా ఏదో వ్యాధితో బాధ‌ప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌న్నారు. “జగన్‌ లాంటి వ్యక్తులకు రాజకీయాల్లో స్థానం లేదు. ఆయ‌న రాజ‌కీయంగా ప‌నికిరాని పువ్వు“ అని ఎద్దేవా చేశారు.

This post was last modified on June 23, 2025 7:44 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

7 minutes ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

13 minutes ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

28 minutes ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

1 hour ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

1 hour ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

3 hours ago