టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ తొలిసారి.. తన పెదనాన్నతో కలిసి వేదికను పంచుకున్నారు. మాజీమంత్రి, పరుచూరు మాజా ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. నారా లోకేష్కు సొంత పెదనాన్న అన్న విషయం తెలిసిందే. బీజేపీ రాష్ట్ర చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి.. లోకేష్ మాతృమూర్తి భువనేశ్వరికి సోదరి. అంటే ఆమె లోకేష్కు పెద్దమ్మ. ఆమె భర్తే.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఈయన కూడా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా అందరికీ పరిచయమే.
అయితే.. ఇన్నేళ్లలో ఎప్పుడూ.. నారా లోకేష్-దగ్గుబాటి వెంకటేశ్వరరావు వేదిక పంచుకున్న పరిస్థితి కనిపించలేదు. కాగా.. ప్రస్తుతం ఏపీ విద్యాశాఖ మంత్రిగా ఆయనను దగ్గుబాటి కుటుంబం ఓ ప్రత్యేక కార్యక్రమానికి ఆహ్వానించింది. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఇంకొల్లుకు వెళ్లిన నారా లోకేష్.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. తన తండ్రి చెంచురామయ్య జ్ఞాపకార్థం ఇక్కడ నిర్మించిన సైనిక్ స్కూల్ను లాంఛనంగా ప్రారంభించారు. అంటే.. పెదనాన్న నిర్మించిన స్కూలుకు లోకేష్ రిబ్బన్ కటింగ్ చేశారు.
రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. ఈ ఏడాది ప్రారంభంలో తను రాసిన పుస్తకాన్ని సీఎం, తనకు స్వయానా తోడల్లుడు అయ్యే చంద్రబాబుతో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన కుమారుడు, తనకు కూడా కుమారుడి వరసయ్యే నారా లోకేష్తో స్కూల్ను ప్రారం భింపజేశారు. స్కూలు ప్రారంభం అనంతరం.. ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చెంచురామయ్య విగ్రహా న్ని కూడా.. నారా లోకేష్ ఆవిష్కరించారు.
ఈ పరిణామంతో ఇరు కుటుంబాల మధ్య ఉన్న రాజకీయ విభేదాలు దాదాపు తొలిగిపోయాయన్న వాదన పార్టీలో వినిపిస్తోంది కొన్నాళ్ల పాటు కాదు.. కొన్నేళ్ల పాటు నారా-దగ్గుబాటి కుటుంబాల మధ్య రాజకీయ విభేదాలు నడిచిన విషయం తెలిసిందే. అయితే.. పురందేశ్వరి బీజేపీలో ఉండగా.. వెంకటేశ్వరరావు గతంలో వైసీపీలో ఉన్నారు. తర్వాత.. బయటకు వచ్చారు. ప్రస్తుతం తటస్థంగా ఉన్నారు.
This post was last modified on June 23, 2025 4:50 pm
న్యాచురల్ స్టార్ నాని అభిమానుల విపరీతమైన ఎదురు చూపులకు చెక్ పెడుతూ ది ప్యారడైజ్ టీజర్ వచ్చేసింది. నిమిషంన్నర లోపే…
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…