వైసీపీ అధినేత జగన్కు చెందిన సాక్షి మీడియాలో అమరావతి రాజధానిని “వేశ్యల రాజధాని” అంటూ చేసిన తీవ్ర వివాదాస్పద, దారుణ వ్యాఖ్యల కేసులో సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు అప్రూవర్గా మారేందుకు అనుమతి కోరారు. “ఉన్నది చెప్పేస్తా. నన్ను వదిలేయండి!” అని పోలీసుల ముందు ఆయన వేడుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో ఏ1గా ఉన్న కృష్ణంరాజును మూడు రోజుల పాటు అమరావతిలోని తుళ్లూరు పోలీసులు విచారించారు.
అయితే మొదటి రోజు ఆయన సమాధానాలు తప్పించుకునేలా ఉన్నా, రెండో మరియు మూడో రోజుల్లో పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో ఆయన మారిపోయారు. “జరిగింది చెప్పేస్తా. అమరావతి అక్కచెల్లెమ్మలకు క్షమాపణలు చెబుతా. ఈ మేరకు వీడియో కూడా విడుదల చేస్తా. నన్ను అప్రూవర్గా మారనివ్వండి. ఈ మేరకు అవకాశం ఇవ్వండి” అని కృష్ణంరాజు తుళ్లూరు డీఎస్పీ మురళీ కృష్ణను వేడుకున్నట్టు సమాచారం.
ముఖ్యంగా మూడో రోజు ఆదివారం జరిగిన విచారణలో ఆయన దాదాపు అసలు విషయాలు చెప్పారు.
“నాకు స్వతహాగా గుర్తింపు లేదు. కానీ గతంలో చంద్రబాబు నన్ను ఇబ్బంది పెట్టారు. ఓ పత్రికలో పనిచేస్తున్న సమయంలో (1995-2004లో) ఆయన ప్రభుత్వాన్ని విమర్శించాను. దీంతో నన్ను ఉద్యోగంలో ఇబ్బంది పెట్టారు. అప్పటి నుంచి యాంటీ అయ్యాను. తరచుగా ఆయనకు వ్యతిరేకంగా వార్తలు రాశాను. దీనిని సాక్షి యాజమాన్యం అనుకూలంగా మార్చుకుంది. నా బలహీనతను గుర్తించి పావుని చేసింది. ఇప్పుడు వాస్తవాలు తెలుస్తున్నాయి. సాక్షి నన్ను ఎలా వాడుకుందో అన్నింటిని బయట పెడతా” అని కృష్ణంరాజు తెలిపారు.
అంతేకాదు, “అమరావతి మహిళలపై వ్యాఖ్యలు చేయడానికి ముందురోజు సాక్షి నుంచి కొంత ముడి సరుకు అందింది. దాన్ని ఆధారంగా చేసుకుని నేను ఆ వ్యాఖ్యలు చేశాను. ఇందులో నా తప్పు ఉన్నా, క్షమాపణలు చెబుతున్నాను” అని కూడా తెలిపారు. ఈ మేరకు ఆయన వాంగ్మూలం ఇచ్చారు.
ఈ పరిణామాల నేపథ్యంలో సాక్షి మీడియా పై పోలీసులు మరింత బలమైన చట్టాలతో కేసును తిరిగి నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కృష్ణంరాజు కూడా అప్రూవర్గా మారేందుకు పిటిషన్ వేయనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.
This post was last modified on June 23, 2025 12:21 pm
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…