వైసీపీ నాయకుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఆయనను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వసూలు చేసిన నగదును విదేశాలకు తరలించే ప్రక్రియలో చెవిరెడ్డి పాత్ర ఉందన్నది ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు(సిట్) చెబుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. ‘విచారణకు రా బాబూ’ అంటూ.. నోటీసుల్లో పేర్కొన్నారు. 32 సంవత్సరాల మోహిత్ రెడ్డి కూడా ఈ కేసులో కీలక పాత్ర పోషించారని సిట్కు ఆధారాలు అందాయి. ఇతర దేశాల్లో ఆయన ఈ విషయంపై కొన్ని ‘సర్దుబాట్లు’ చేసినట్టు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను కూడా ఈ కేసులో ఏ39గా పేర్కొన్నారు. తాజాగా సోమవారం ఉదయం ఆయనకు నోటీసులు ఇచ్చారు.
ముందే ఊహించి..
అయితే.. సిట్ అధికారులు తనకు నోటీసులు ఇవ్వడం, అరెస్టు చేయడం ఖాయమని మోహిత్ రెడ్డి ముందుగానే ఊహించారు. దీంతో హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేయడంతో పాటు.. తనపై సిట్ నమోదు చేసిన కేసును కూడా కొట్టివేయాలని అభ్యర్థించారు. ఈ కేసు విచారణకు రావాల్సి ఉంది. ఇంతలోనే సిట్ నోటీసులు ఇచ్చారు. మరోవైపు.. మోహిత్ రెడ్డి నాలుగు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలు గాలిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయనను అరెస్టు చేస్తారా? ఈ లోగా కోర్టు ఆయనకు బెయిల్ ఇస్తుందా? అన్నది చూడాలి.
This post was last modified on June 23, 2025 1:10 pm
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…
రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…
వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…
నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…