వైసీపీ నాయకుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఆయనను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వసూలు చేసిన నగదును విదేశాలకు తరలించే ప్రక్రియలో చెవిరెడ్డి పాత్ర ఉందన్నది ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు(సిట్) చెబుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. ‘విచారణకు రా బాబూ’ అంటూ.. నోటీసుల్లో పేర్కొన్నారు. 32 సంవత్సరాల మోహిత్ రెడ్డి కూడా ఈ కేసులో కీలక పాత్ర పోషించారని సిట్కు ఆధారాలు అందాయి. ఇతర దేశాల్లో ఆయన ఈ విషయంపై కొన్ని ‘సర్దుబాట్లు’ చేసినట్టు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను కూడా ఈ కేసులో ఏ39గా పేర్కొన్నారు. తాజాగా సోమవారం ఉదయం ఆయనకు నోటీసులు ఇచ్చారు.
ముందే ఊహించి..
అయితే.. సిట్ అధికారులు తనకు నోటీసులు ఇవ్వడం, అరెస్టు చేయడం ఖాయమని మోహిత్ రెడ్డి ముందుగానే ఊహించారు. దీంతో హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేయడంతో పాటు.. తనపై సిట్ నమోదు చేసిన కేసును కూడా కొట్టివేయాలని అభ్యర్థించారు. ఈ కేసు విచారణకు రావాల్సి ఉంది. ఇంతలోనే సిట్ నోటీసులు ఇచ్చారు. మరోవైపు.. మోహిత్ రెడ్డి నాలుగు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలు గాలిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయనను అరెస్టు చేస్తారా? ఈ లోగా కోర్టు ఆయనకు బెయిల్ ఇస్తుందా? అన్నది చూడాలి.
This post was last modified on June 23, 2025 1:10 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…