Political News

హిందువుగా పుట్టా..ఇతర మతాలనూ గౌరవిస్తా: పవన్

మురుగన్ మానాడు పేరిట తమిళనాడులోని మధురైలో నిర్వహించిన సుబ్రహ్మణ్యస్వామి భక్తుల సమ్మేళనంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం చేశారు. తాను హిందువుగా పుట్టానని చెప్పిన పవన్… ఇతర మతాలను కూడా గౌరవిస్తానని ఆయన పేర్కొన్నారు. హిందూ మతాన్ని గౌరవిస్తూనే ఇతర మతాలను గౌరవిస్తానని కూడా పవన్ తెలిపారు. ఈ తరహా వైఖరి తన హక్కు అని చెప్పిన పవన్…ఇందులో ఇతరులు తన నమ్మకాన్ని అవమానించాల్సిన పని లేదన్నారు. ఎందుకంటే ఇతరులను నమ్మకాన్ని హిందువులు అవమానించడం లేదు కదా అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

తమిళనాడు బయలుదేరే ముందు తమిళ సంప్రదాయ పంచెకట్టులోకి మారిన పవన్… మధురైలో మురుగన్ మాదిరి వస్త్రధారణలోకి మారిపోయారు. ఈ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా వస్తారని అనుకున్నా.. కారణం ఏమిటో ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఫలితంగా పవన్ కల్యాణ్ ప్రసంగమే ఈ సమ్మేళనంలో కీలకంగా మారింది. అంతేకాకుండా మురుగన్ మానాడు ఉర్రూతలూగేలా పవన్ తనదైన శైలి ప్రసంగాన్ని చేశారు. సెక్యూలరిజాన్ని ప్రశ్నించిన పవన్…దేశంలో ప్రస్తుతం ఉన్నది అసలైన నకిలీ సెక్యూలరిజమని తేల్చి పారేశారు. ఇందుకు గల కారణాలను కూడా ఆయన వివరించడం గమనార్హం.

ఒక క్రైస్తవుడు తన మతాన్ని గౌరవించవచ్చు…ఓ ముస్లిం తన మతాన్ని గౌరవించవచ్చు…అయితే ఒక హిందువు తన మతాన్ని గౌరవిస్తే మాత్రం అభ్యంతరం..అంటూ పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనినే అసలైన నకిలీ సెక్యూలరిజం అంటారని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మధురై పట్టణం గురించి..దాని చరిత్రను గురించి పవన్ పలు ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు. మీనాక్షి అమ్మవారు కొలువై ఉన్న మధురై ఆలయాన్ని గతంలో 14వ శతాబ్దంలో మాలిక్ కపూర్ అనే రాజు దాడి వల్ల ఆలయం దాదాపుగా 60 ఏళ్ల పాటు మూతపడిందని ఆయన వెల్లడించారు. ఆ తర్వాత చాలా కష్టాలు పడి ఆలయాన్ని తెరుచుకున్నామని ఆయన తెలిపారు.

దేశం, దేశ పౌరుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్న పవన్… అందుకోసం ధైర్యం ఉండాలని తెలిపారు. 14 ఏళ్ల క్రితం జనసేనను ప్రారంభించిన సమయంలో తాను ఇలా ఇంతమంది హిందూ భక్తులు, సాధువుల మధ్య ప్రసంగిస్తానని కలలో కూడా అనుకోలేదని ఆయన పేర్కొన్నారు. సాక్షాత్తు మురుగనే తనను మధురైకి నడిపించారన్నారు. తనను పెంచింది, తనకు ధైర్యం నూరిపోసింది కూడా మురుగనేనని కూడా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తిమిళనాడుతో తనకున్న అనుబంధాన్ని కూడా ఇంటరెస్టింగ్ చెప్పుకొచ్చారు. మొత్తంగా మురుగన్ మానాడులో పవన్ కల్యాణ్ ప్రసంగం సుబ్రహ్మణ్యస్వామి భక్తులను విశేషంగా ఆకట్టుకుందనే చెప్పాలి.

This post was last modified on June 23, 2025 10:32 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago