కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్.. వైసీపీ అధినేత జగన్ పై తొలిసారి విమర్శలు గుప్పించారు. గతంలో అనేక ఆరోపణలు వచ్చినా.. జగన్పై పన్నెత్తు మాట అనని ఠాకూర్ తాజాగా గుంటూరు జిల్లా రెంటపాళ్ల సమీపంలో జగన్ కారు కింద పడి సింగమయ్య అనే వృద్ధుడు మృతి చెందిన ఘటనపై సీరియస్ కామెంట్లే చేశారు. దీనిని ఖండిస్తున్నట్టు తెలిపారు.
జగన్ నాయకుడుకాదన్నారు. ఆయనలో నాయకత్వలక్షణాలు కూడా లేవని ఠాకూర్ వ్యాఖ్యానించారు. అసలు… అంత మంది జనాన్ని తరలించేందుకు.. అదేమైనా ఎన్నికల ప్రచారమా? అని నిలదీశారు. అంతేకాదు.. కారు డోర్ పక్కన నిలబడి.. చేతులు ఊపుకుంటూ.. ఎందుకు ప్రయాణించాల్సి వచ్చిందో జగన్ చెప్పాలని ఠాకూర్ నిలదీశారు. ఒక వ్యక్తి ఎప్పుడో చనిపోతే.. ఇప్పుడు పరామర్శించారు. ఈ పర్యటన ద్వారా మరో ఇద్దరిని బలితీసుకున్నారని అన్నారు.
“సింగమయ్య మృతి చెందిన తీరు నన్ను ఎంతో కలచి వేసింది. ఇది జగన్ బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ఠ. ఆయనలో నాయకుడి లక్షణాలులేవు. ఒక నాయకుడిగా ఆయన ఎప్పుడో విఫలమయ్యాడు. ఇప్పుడు నేర పూరిత నిర్లక్ష్యం ప్రదర్శించారు. మనుషుల జీవితాలంటే.. జగన్కు అర్థం కూడా తెలియదు. ఎవరు ఏమైపోయినా.. తన కాంక్ష తీర్చుకునే క్రమంలో వ్యవహరించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. దీనిపై తీసుకునే కఠిన చర్యలకు తాము మద్దతు ఇస్తాం.” అని మాణిక్కం ఠాకూర్ వ్యాఖ్యానించారు.
This post was last modified on June 23, 2025 10:22 am
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…
పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి…
మనకు డెవిల్ అంటే ఆ మధ్య వచ్చిన కళ్యాణ్ రామ్ సినిమా గుర్తొస్తుంది కానీ ఇటీవలే కన్నడలో విడుదలైన భారీ…