కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్.. వైసీపీ అధినేత జగన్ పై తొలిసారి విమర్శలు గుప్పించారు. గతంలో అనేక ఆరోపణలు వచ్చినా.. జగన్పై పన్నెత్తు మాట అనని ఠాకూర్ తాజాగా గుంటూరు జిల్లా రెంటపాళ్ల సమీపంలో జగన్ కారు కింద పడి సింగమయ్య అనే వృద్ధుడు మృతి చెందిన ఘటనపై సీరియస్ కామెంట్లే చేశారు. దీనిని ఖండిస్తున్నట్టు తెలిపారు.
జగన్ నాయకుడుకాదన్నారు. ఆయనలో నాయకత్వలక్షణాలు కూడా లేవని ఠాకూర్ వ్యాఖ్యానించారు. అసలు… అంత మంది జనాన్ని తరలించేందుకు.. అదేమైనా ఎన్నికల ప్రచారమా? అని నిలదీశారు. అంతేకాదు.. కారు డోర్ పక్కన నిలబడి.. చేతులు ఊపుకుంటూ.. ఎందుకు ప్రయాణించాల్సి వచ్చిందో జగన్ చెప్పాలని ఠాకూర్ నిలదీశారు. ఒక వ్యక్తి ఎప్పుడో చనిపోతే.. ఇప్పుడు పరామర్శించారు. ఈ పర్యటన ద్వారా మరో ఇద్దరిని బలితీసుకున్నారని అన్నారు.
“సింగమయ్య మృతి చెందిన తీరు నన్ను ఎంతో కలచి వేసింది. ఇది జగన్ బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ఠ. ఆయనలో నాయకుడి లక్షణాలులేవు. ఒక నాయకుడిగా ఆయన ఎప్పుడో విఫలమయ్యాడు. ఇప్పుడు నేర పూరిత నిర్లక్ష్యం ప్రదర్శించారు. మనుషుల జీవితాలంటే.. జగన్కు అర్థం కూడా తెలియదు. ఎవరు ఏమైపోయినా.. తన కాంక్ష తీర్చుకునే క్రమంలో వ్యవహరించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. దీనిపై తీసుకునే కఠిన చర్యలకు తాము మద్దతు ఇస్తాం.” అని మాణిక్కం ఠాకూర్ వ్యాఖ్యానించారు.
ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని.. మళ్లీ మళ్లీ ప్రభుత్వం మారే పరిస్థితి కూడా ఉండదని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆ…
పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ…
రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయితే కొన్నిసార్లు అవి శృతిమించిపోయి వివాదాలకు తావిస్తున్నాయి. ఏపీ రాజకీయాలు ఇందుకు మినహాయింపు…
మన హీరోల పాత రీ రిలీజులు తెలుగు రాష్ట్రాల్లో ఆడటం పెద్ద విషయం కాదు. చాలాసార్లు చూశాం. పోకిరి, ఖుషి…
నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో, ఈ ఏడాది…
గత ఏడాది పెద్ది నుంచి చికిరి చికిరి వీడియో సాంగ్ విడుదల చేశాక సోషల్ మీడియా ఊగిపోయింది. మిలియన్లలో వ్యూస్,…