గుంటూరు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో ఈ నెల 18న వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పర్యటించారు. తన పార్టీకి చెందిన ఓ కార్యకర్త 2024లో చనిపోయిన నేపథ్యంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి, కుటుంబా న్ని పరామర్శించారు. ఈ సమయంలో వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. అయితే.. విచ్చలవిడిగా వ్యవహరించిన కారణంగా.. ఆయన కాన్వాయ్ కింద పడి సింగమయ్య అనే వృద్ధుడు నలిగిపోయినట్టు తాజాగాపోలీసులు ఓ వీడియోను వెలుగులోకి తీసుకువచ్చారు.
సింగమయ్య అనే వృద్ధుడు.. జగన్ కారు చక్రాల కింద పడి నలిగిపోయిన దృశ్యాలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో పోలీసులు జగన్ కారు డ్రైవర్ రమణయ్యను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఈయనను ప్రభుత్వమే నియమించినట్టు తెలిసింది. మాజీ సీఎం జగన్కు ఉన్న ప్రొటోకాల్ ప్రకారం.. కారు డ్రైవర్లుగా ఇద్దరిని ప్రభుత్వం ఇస్తుంది. వీరిలో రమణయ్య ఒకరు. ఈయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు.
అయితే.. సింగమయ్య తన కారు కింద పడి చనిపోయిన విషయం తనకు తెలియదని రమణయ్య చెప్పినట్టు తెలిసింది. ఈ విషయాన్ని తాను ఫోన్లో చూసి అదే రోజు సాయంత్రం తెలుసుకున్నానని చెప్పాడు. ఈ ఘటనపై తాను జగన్తో మాట్లాడలేదని.. ఎస్పీ చేసిన ప్రకటనను మాత్రమే చూశానన్నారు. తమ కాన్వాయ్ కాదని ఎస్పీ నే చెప్పారని ఆయన చెప్పారు. అయితే.. తాజాగా వెలుగు చూసిన వీడియోలో సింగమయ్య తమ కారు కిందే పడిపోయి మరణించడంతో షాక్కు గురైనట్టు వెల్లడించారు.
వేలాదిగా తరలి వచ్చిన జనాలతో అసలు ఏం జరుగుతోందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని.. దీంతో కారు అద్దాలు తీసే అవకాశం కూడా లేకుండా పోయిందని రమణయ్య చెప్పుకొచ్చారని సమాచారం. ఏ చిన్న ప్రమాదానికి అవకాశం లేకుండా తాను చాలా నిదానంగా కారును నడిపినట్టు వెల్లడించారు. ఈ విషయం తనకు తెలియదని.. తనకు ఏ సంబంధం లేదని తెలిపాడు. అయితే.. పోలీసులు ఆయనను అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…