వైసీపీ అధినేత జగన్ పై ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ షర్మిల విరుచుకుపడ్డారు.”ఇదేం రాక్షసానందం” అంటూ.. విమర్శలు గుప్పించారు. గుంటూరు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో పర్యటించిన సమయంలో జగన్ కారు డోర్ దగ్గర నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ.. ముందుకు సాగుతుండగా.. అదే కారు కింద పడి సింగమయ్య అనే వృద్ధుడు మృతి చెందిన దారుణ వీడియో వెలుగు చూసిన నేపథ్యంలో జగన్పై ఆమె నిప్పులు చెరిగారు.
బాధ్యతాయుత నాయకుడు చేసే పని ఇదేనా? అని ప్రశ్నించారు. బలప్రదర్శనతో ప్రజల ప్రాణాలను హరించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? అని నిలదీశారు. వంద మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇస్తే.. వేల మందికి అభివాదం చేసుకుంటూ మీరు ముందుకు సాగడం, ఈ క్రమంలో కారు కింద పడి ఒక వ్యక్తి మృతి చెందడం వంటివి మీకు సిగ్గనిపించడం లేదా? అన్నారు. బెట్టింగులు కాసి.. ఓడిపోయి.. ప్రాణాలు తీసుకున్న వ్యక్తులకు విగ్రహాలు పెట్టమని మీకు ఎవరు చెప్పారు? అని నిలదీశారు.
ఒక పార్టీ అధ్యక్షుడిగా మీకు బాధ్యత లేదా? ఇంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తారా? అని షర్మిల ప్రశ్నలు సంధించారు. ఇదేసమయంలో ఆమె పోలీసుల తీరును కూడా తప్పుబట్టారు. 100 మందికి పర్మిషన్ ఇచ్చి.. వేలాది మంది వస్తుంటే.. నిలువరించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? అని అన్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైందన్నారు. తాజాగా వెలుగు చూసిన వీడియో గగుర్పాటుకు గురి చేసిందన్న షర్మిల.. దీనికి పూర్తి బాధ్యత జగన్దేనని వ్యాఖ్యానించారు.
మరోవైపు.. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే సదరు వాహనాన్ని నడిపిన డ్రైవర్పై కేసు పెట్టారు. అయితే.. దీనికి జగన్ బాధ్యుడా? కాదా? అనే విషయంపై న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారు. వారి ఉంచి క్లారిటీ తీసుకున్నాక.. జగన్పైనా కేసు పెట్టే యోచనలో ఉన్నారు.
This post was last modified on June 23, 2025 10:10 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…