వైసీపీ అధినేత జగన్ పై ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ షర్మిల విరుచుకుపడ్డారు.”ఇదేం రాక్షసానందం” అంటూ.. విమర్శలు గుప్పించారు. గుంటూరు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో పర్యటించిన సమయంలో జగన్ కారు డోర్ దగ్గర నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ.. ముందుకు సాగుతుండగా.. అదే కారు కింద పడి సింగమయ్య అనే వృద్ధుడు మృతి చెందిన దారుణ వీడియో వెలుగు చూసిన నేపథ్యంలో జగన్పై ఆమె నిప్పులు చెరిగారు.
బాధ్యతాయుత నాయకుడు చేసే పని ఇదేనా? అని ప్రశ్నించారు. బలప్రదర్శనతో ప్రజల ప్రాణాలను హరించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? అని నిలదీశారు. వంద మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇస్తే.. వేల మందికి అభివాదం చేసుకుంటూ మీరు ముందుకు సాగడం, ఈ క్రమంలో కారు కింద పడి ఒక వ్యక్తి మృతి చెందడం వంటివి మీకు సిగ్గనిపించడం లేదా? అన్నారు. బెట్టింగులు కాసి.. ఓడిపోయి.. ప్రాణాలు తీసుకున్న వ్యక్తులకు విగ్రహాలు పెట్టమని మీకు ఎవరు చెప్పారు? అని నిలదీశారు.
ఒక పార్టీ అధ్యక్షుడిగా మీకు బాధ్యత లేదా? ఇంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తారా? అని షర్మిల ప్రశ్నలు సంధించారు. ఇదేసమయంలో ఆమె పోలీసుల తీరును కూడా తప్పుబట్టారు. 100 మందికి పర్మిషన్ ఇచ్చి.. వేలాది మంది వస్తుంటే.. నిలువరించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? అని అన్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైందన్నారు. తాజాగా వెలుగు చూసిన వీడియో గగుర్పాటుకు గురి చేసిందన్న షర్మిల.. దీనికి పూర్తి బాధ్యత జగన్దేనని వ్యాఖ్యానించారు.
మరోవైపు.. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే సదరు వాహనాన్ని నడిపిన డ్రైవర్పై కేసు పెట్టారు. అయితే.. దీనికి జగన్ బాధ్యుడా? కాదా? అనే విషయంపై న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారు. వారి ఉంచి క్లారిటీ తీసుకున్నాక.. జగన్పైనా కేసు పెట్టే యోచనలో ఉన్నారు.
This post was last modified on June 23, 2025 10:10 am
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…