వైసీపీ అధినేత జగన్ పై ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ షర్మిల విరుచుకుపడ్డారు.”ఇదేం రాక్షసానందం” అంటూ.. విమర్శలు గుప్పించారు. గుంటూరు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో పర్యటించిన సమయంలో జగన్ కారు డోర్ దగ్గర నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ.. ముందుకు సాగుతుండగా.. అదే కారు కింద పడి సింగమయ్య అనే వృద్ధుడు మృతి చెందిన దారుణ వీడియో వెలుగు చూసిన నేపథ్యంలో జగన్పై ఆమె నిప్పులు చెరిగారు.
బాధ్యతాయుత నాయకుడు చేసే పని ఇదేనా? అని ప్రశ్నించారు. బలప్రదర్శనతో ప్రజల ప్రాణాలను హరించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? అని నిలదీశారు. వంద మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇస్తే.. వేల మందికి అభివాదం చేసుకుంటూ మీరు ముందుకు సాగడం, ఈ క్రమంలో కారు కింద పడి ఒక వ్యక్తి మృతి చెందడం వంటివి మీకు సిగ్గనిపించడం లేదా? అన్నారు. బెట్టింగులు కాసి.. ఓడిపోయి.. ప్రాణాలు తీసుకున్న వ్యక్తులకు విగ్రహాలు పెట్టమని మీకు ఎవరు చెప్పారు? అని నిలదీశారు.
ఒక పార్టీ అధ్యక్షుడిగా మీకు బాధ్యత లేదా? ఇంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తారా? అని షర్మిల ప్రశ్నలు సంధించారు. ఇదేసమయంలో ఆమె పోలీసుల తీరును కూడా తప్పుబట్టారు. 100 మందికి పర్మిషన్ ఇచ్చి.. వేలాది మంది వస్తుంటే.. నిలువరించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? అని అన్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైందన్నారు. తాజాగా వెలుగు చూసిన వీడియో గగుర్పాటుకు గురి చేసిందన్న షర్మిల.. దీనికి పూర్తి బాధ్యత జగన్దేనని వ్యాఖ్యానించారు.
మరోవైపు.. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే సదరు వాహనాన్ని నడిపిన డ్రైవర్పై కేసు పెట్టారు. అయితే.. దీనికి జగన్ బాధ్యుడా? కాదా? అనే విషయంపై న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారు. వారి ఉంచి క్లారిటీ తీసుకున్నాక.. జగన్పైనా కేసు పెట్టే యోచనలో ఉన్నారు.
This post was last modified on June 23, 2025 10:10 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…