Political News

జ‌గ‌న్ త‌ప్పు చేశారు: ఎస్పీ

గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం రెంట‌పాళ్ల‌లో ఈ నెల 18న ప‌ర్య‌టించిన స‌మ‌యంలో మాజీ సీఎం జ‌గ‌న్ త‌ప్పు చేశార‌ని గుంటూరు ఎస్పీ స‌తీష్ కుమార్ తెలిపారు. ఆదివారం రాత్రం 10 గంట‌ల స‌మ‌యంలో ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆనాడు జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో మృతి చెందిన సింగ‌మ‌య్య వ్య‌వ‌హారాన్ని వివ‌రించారు. తొలుత తాము జ‌గ‌న్ కాన్వాయ్ ఢీ కొన‌లేద‌ని భావించామ‌ని.. ప్రైవేటు వాహ‌నం ఒక‌టి ఢీ కొట్టిన‌ట్టు త‌మ‌కు స‌మాచారం అందింద‌ని దీంతో అదే నిజ‌మ‌ని అనుకున్న‌మని చెప్పారు.

కానీ, త‌ర్వాత ప‌లువురు తీసిన వీడియోల‌ను స్వాధీనం చేసుకుని ప‌రిశీలించిన త‌ర్వాత‌.. జ‌గ‌న్ ప్ర‌యాణిస్తున్న వాహ‌న‌మే.. సింగ‌మ‌య్య‌ను ఢీ కొట్టి.. కొంత దూరం పాటు ఈడ్చుకుపోయిన‌ట్టు తేలింద‌న్నారు. దీనిలో ఎలాంటి పొర‌పాట్లూలేవ‌ని చెప్పారు. విచార‌ణ ప‌రిధి పెరుగుతున్నప్పుడు.. అనేక విష‌యాలు వెలుగు చూస్తాయ‌ని.. దీనికి కొంత స‌మ‌యం తీసుకోవ‌డం త‌ప్పుకాద ని వ్యాఖ్యానించారు. అప్ప‌ట్లో ప్రాథ‌మికంగా అందిన స‌మాచారం మేర‌కు తాను అప్ప‌ట్లో సింగ‌మ‌య్య మృతికి, జ‌గ‌న్ కాన్వాయ్‌కి సంబంధం లేద‌ని చెప్పిన మాట నిజ‌మేన‌ని.. కానీ, విచార‌ణ‌లో వాస్తవాలు వెలుగు చూశాయ‌ని చెప్పారు.

తాము అస‌లు మాజీ సీఎం హోదాలో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు 100 మంది అనుచ‌రులు, కార్య‌క‌ర్త‌ల‌ను, 14 వాహ‌నాల కాన్వాయ్‌కి మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చామ‌ని ఎస్పీ చెప్పారు. కానీ, తాడేప‌ల్లి నుంచి జ‌గ‌న్ బ‌య‌లు దేరిన స‌మ‌యంలోనే ఏకంగా 50 వాహ‌నాల‌తో వ‌చ్చార‌ని.. దారి పొడ‌వునా హంగామా చేశారని తెలిపారు. ఇవ‌న్నీ.. పోలీసు యాక్టు 30/2 మేర‌కు ఉల్లంఘ‌న‌లేన ని చెప్పారు. దీనిపైనా కేసు న‌మోదు చేసిన‌ట్టు చెప్పారు. అయితే.. సింగ‌మ‌య్య మృతిపై ఆయ‌న స‌తీమ‌ణి లూర్ధు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తాజాగా మ‌రో కేసు న‌మోదు చేసిన‌ట్టు తెలిపారు.

కాన్వాయ్‌కు ఇచ్చిన అనుమ‌తులు విస్మ‌రించ‌డంతోపాటు, ప‌రామ‌ర్శ యాత్ర పేరుతో పోలీసుల నిబంధ‌న‌లు ఉల్లంఘించి జ‌గ‌న్ త‌ప్పు చేశార‌ని ఎస్పీ చెప్పారు. ఈ క్ర‌మంలో మాజీ మంత్రులు పేర్ని నాని, విడ‌ద‌ల ర‌జ‌నీ, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ సీఎం పీఎం నాగేశ్వ‌ర‌రెడ్డిల‌పై కేసులు న‌మోదు చేశామ‌ని, బీఎన్ ఎస్ సెక్ష‌న్ల కింద కేసులు పెట్టామ‌ని వివ‌రించారు. చ‌ట్ట‌ప‌రంగా త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. 

This post was last modified on June 22, 2025 10:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

16 minutes ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

25 minutes ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

5 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

5 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

6 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

6 hours ago