Political News

జ‌గ‌న్ త‌ప్పు చేశారు: ఎస్పీ

గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం రెంట‌పాళ్ల‌లో ఈ నెల 18న ప‌ర్య‌టించిన స‌మ‌యంలో మాజీ సీఎం జ‌గ‌న్ త‌ప్పు చేశార‌ని గుంటూరు ఎస్పీ స‌తీష్ కుమార్ తెలిపారు. ఆదివారం రాత్రం 10 గంట‌ల స‌మ‌యంలో ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆనాడు జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో మృతి చెందిన సింగ‌మ‌య్య వ్య‌వ‌హారాన్ని వివ‌రించారు. తొలుత తాము జ‌గ‌న్ కాన్వాయ్ ఢీ కొన‌లేద‌ని భావించామ‌ని.. ప్రైవేటు వాహ‌నం ఒక‌టి ఢీ కొట్టిన‌ట్టు త‌మ‌కు స‌మాచారం అందింద‌ని దీంతో అదే నిజ‌మ‌ని అనుకున్న‌మని చెప్పారు.

కానీ, త‌ర్వాత ప‌లువురు తీసిన వీడియోల‌ను స్వాధీనం చేసుకుని ప‌రిశీలించిన త‌ర్వాత‌.. జ‌గ‌న్ ప్ర‌యాణిస్తున్న వాహ‌న‌మే.. సింగ‌మ‌య్య‌ను ఢీ కొట్టి.. కొంత దూరం పాటు ఈడ్చుకుపోయిన‌ట్టు తేలింద‌న్నారు. దీనిలో ఎలాంటి పొర‌పాట్లూలేవ‌ని చెప్పారు. విచార‌ణ ప‌రిధి పెరుగుతున్నప్పుడు.. అనేక విష‌యాలు వెలుగు చూస్తాయ‌ని.. దీనికి కొంత స‌మ‌యం తీసుకోవ‌డం త‌ప్పుకాద ని వ్యాఖ్యానించారు. అప్ప‌ట్లో ప్రాథ‌మికంగా అందిన స‌మాచారం మేర‌కు తాను అప్ప‌ట్లో సింగ‌మ‌య్య మృతికి, జ‌గ‌న్ కాన్వాయ్‌కి సంబంధం లేద‌ని చెప్పిన మాట నిజ‌మేన‌ని.. కానీ, విచార‌ణ‌లో వాస్తవాలు వెలుగు చూశాయ‌ని చెప్పారు.

తాము అస‌లు మాజీ సీఎం హోదాలో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు 100 మంది అనుచ‌రులు, కార్య‌క‌ర్త‌ల‌ను, 14 వాహ‌నాల కాన్వాయ్‌కి మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చామ‌ని ఎస్పీ చెప్పారు. కానీ, తాడేప‌ల్లి నుంచి జ‌గ‌న్ బ‌య‌లు దేరిన స‌మ‌యంలోనే ఏకంగా 50 వాహ‌నాల‌తో వ‌చ్చార‌ని.. దారి పొడ‌వునా హంగామా చేశారని తెలిపారు. ఇవ‌న్నీ.. పోలీసు యాక్టు 30/2 మేర‌కు ఉల్లంఘ‌న‌లేన ని చెప్పారు. దీనిపైనా కేసు న‌మోదు చేసిన‌ట్టు చెప్పారు. అయితే.. సింగ‌మ‌య్య మృతిపై ఆయ‌న స‌తీమ‌ణి లూర్ధు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తాజాగా మ‌రో కేసు న‌మోదు చేసిన‌ట్టు తెలిపారు.

కాన్వాయ్‌కు ఇచ్చిన అనుమ‌తులు విస్మ‌రించ‌డంతోపాటు, ప‌రామ‌ర్శ యాత్ర పేరుతో పోలీసుల నిబంధ‌న‌లు ఉల్లంఘించి జ‌గ‌న్ త‌ప్పు చేశార‌ని ఎస్పీ చెప్పారు. ఈ క్ర‌మంలో మాజీ మంత్రులు పేర్ని నాని, విడ‌ద‌ల ర‌జ‌నీ, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ సీఎం పీఎం నాగేశ్వ‌ర‌రెడ్డిల‌పై కేసులు న‌మోదు చేశామ‌ని, బీఎన్ ఎస్ సెక్ష‌న్ల కింద కేసులు పెట్టామ‌ని వివ‌రించారు. చ‌ట్ట‌ప‌రంగా త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. 

This post was last modified on June 22, 2025 10:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago