వైసీపీ అధినేత జగన్ పై మరో కేసు నమోదు అయ్యింది. మొన్నటి జగన్ రెంటపాళ్ల పర్యటనలో భాగంగా ఇద్దరు వైసీపీ కార్యకర్తలు చనిపోయిన సంగతి తెలిసిందే. వీరిలో ఏటుకూరు బైపాస్ వద్ద చనిపోయిన సింగయ్య.. సాక్షాత్తు జగన్ వాహనం కింద పడి నగిలిపోయినట్లుగా తాజాగా వీడియోలు విడుదలయ్యాయి. జగన్ ఓ వైపు పార్టీ శ్రేణులకు అబివాదం చేస్తుంటే…అదే సమయంలో సింగయ్య ఆయన కారు కిందే నలిగిపోయారు.
ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలను పరిశీలించిన పల్నాడు పోలీసులు జగన్ కారు డ్రైవర్ రమణా రెడ్డిని ఏ1గా, జగన్ ను ఏ2గా చేరుస్తూ కేసు నమోదు చేశారు. ఇక ఈ ఘటనతో సంబంధం ఉన్న మరింత మంది ఎవరన్న విషయంపై ఆరా తీస్తున్న పోలీసులు వారిపైనా కేసులు నమోదు చేసే అవకాశాలున్నట్లు సమాచారం. మొత్తంగా ఈ వ్యవహారంపై పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నట్లే కనిపిస్తోంది.
రెంటపాళ్ల జగన్ పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతులు ఇవ్వగా… వాటిని జగన్ గానీ, వైసీపీ నేతలు, శ్రేణులు గానీ పట్టించుకున్న పాపానే పోలేదు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే మరీ వీధి రౌడీ మాదిరిగా పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్ లను తొలగించి మరీ పార్టీ శ్రేణులను ముందుకు నడిపించే యత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న కోణంలో ఆయనపై కేసు తప్పదన్నవాదనలు వినిపిస్తుండగా… అంతకు ముందే జగన్ పైనే ఏకంగా కేసు నమోదు కావడం గమనార్హం.
జగన్ కు కేసులు కొత్తేమీ కాదు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందిన కాడికి ప్రజా ధనాన్ని దోచుకున్నారన్న ఆరోపణలపై సీబీఐ ఏకంగా 11 కేసులు నమోదు చేసింది. ఇవే కేసుల ఆధారంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా ఆయనపై 11 కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో జగన్ ఏకంగా 16 నెలలు జైల్లో ఉండి వచ్చారు. అలాంటి జగన్ కు ఇలాంటి యాక్సిడెంట్ కేసులు ఏమంత పెద్దవి కావన్న వాదనలు వినిపిస్తున్నా… సీఎంగా పనిచేసిన జగన్ పై ఇలాంటి హత్య కేసులు నమోదు కావడం గమనార్హం.
This post was last modified on June 22, 2025 6:37 pm
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…