Political News

మేం పోల‌వ‌రం ఆప‌లేక‌పోయాం: క‌విత

ఏపీ ప్ర‌భుత్వం చేప‌ట్టాల‌ని భావిస్తున్న క‌ర్నూలు జిల్లాలోని బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టును తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న బీఆర్ ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల క‌విత తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ లోని ప్రెస్‌క్ల‌బ్‌లో తాజాగా క‌విత రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడు తూ.. త‌మ హ‌యాంలోనూ త‌ప్పులు జ‌రిగాయ‌ని ఒప్పుకున్నారు. బీఆర్ ఎస్ హ‌యాంలోనే పోల‌వ‌రం ప్రాజెక్టును నిలిపివేయాల‌ని పోరాటం చేశామ‌న్నారు.

అయితే.. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా పోల‌వ‌రం ఆపివేయ‌లేక పోయామ‌న్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్ లో ఈ ప్రాజెక్టును చేప‌ట్టిన‌ప్పుడే.. తాము వ్య‌తిరేకించామ‌న్నారు. చివ‌ర‌కు సుప్రీంకోర్టుకు కూడా వెళ్లేందుకు ప్ర‌య‌త్నించామ‌న్నారు. కానీ, పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలుపుద‌ల చేయ‌లేక పోతున్నారు. పైగా మోడీ స‌ర్కారు పోల‌వ‌రం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింద‌ని గుర్తు చేశారు. ఇవ‌న్నీ ఎందుకు చెబుతున్నానంటే.. ఇప్పుడు బ‌న‌క‌చ‌ర్ల విష‌యంలోనూ ఇదే జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నా అని క‌విత అన్నారు.

తెలంగాణ‌కు చెందిన ఏడు మండ‌లాల‌ను ఏపీ అన్యాయంగా తీసుకుంద‌ని క‌విత అన్నారు. దీనివ‌ల్ల రాష్ట్రానికి న‌ష్టం చేకూరింద‌ని చెప్పారు. వీటితోపాటు లోయర్‌ సీలేరు పవర్‌ ప్రాజెక్టును కూడా అప్పగించా రని అన్నారు. ఈ విష‌యంపైనా తాను ఎంపీగా పోరాటం చేశాన‌న్నారు.కానీ, త‌న ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేద ని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం 36 లక్షల క్యూసెక్కుల నుంచి 50 లక్షల క్యూసెక్కులకు పెంచుకుంటూ పోవడంతో ముంపు పెరిగిపోతోంది అని క‌విత వ్యాఖ్యానించారు.

ఈ నేప‌థ్యంలో త‌మ నుంచి గుంజుకున్న ఏడు మండ‌లాల్లో ఐదు మండ‌లాల‌ను తిరిగి తెలంగాణ‌కు అప్ప గించాల‌ని క‌విత డిమాండ్ చేశారు. పురుషోత్తమపట్నం, గుండాల, ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకులపా డుల‌ను తెలంగాణ‌కు అప్ప‌గించాల్సిందేన‌ని కోరారు. బ‌న‌క‌చ‌ర్ల‌ను తాము పూర్తిగా వ్య‌తిరేకిస్తున్న‌ట్టు క‌విత చెప్పారు.

This post was last modified on June 22, 2025 5:20 pm

Share
Show comments
Published by
Satya
Tags: Kavitha

Recent Posts

తెలుగోళ్లు లేపుతుంటే… తమిళోళ్లు ముంచేస్తున్నారు

ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…

39 minutes ago

సీఎంకు మ‌రో టెస్ట్‌.. రెండు సీట్ల కోసం ప‌దుల సంఖ్య‌లో పోటీ!

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి మ‌రో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం చూస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న ఎవ‌రిని…

2 hours ago

హాలీవుడ్ రికార్డు బద్దలు కొట్టిన మన లెజెండ్

ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…

5 hours ago

రిస్కులు చూసుకుంటున్న జైలర్ 2

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…

6 hours ago

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

9 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

9 hours ago