Political News

మేం పోల‌వ‌రం ఆప‌లేక‌పోయాం: క‌విత

ఏపీ ప్ర‌భుత్వం చేప‌ట్టాల‌ని భావిస్తున్న క‌ర్నూలు జిల్లాలోని బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టును తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న బీఆర్ ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల క‌విత తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ లోని ప్రెస్‌క్ల‌బ్‌లో తాజాగా క‌విత రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడు తూ.. త‌మ హ‌యాంలోనూ త‌ప్పులు జ‌రిగాయ‌ని ఒప్పుకున్నారు. బీఆర్ ఎస్ హ‌యాంలోనే పోల‌వ‌రం ప్రాజెక్టును నిలిపివేయాల‌ని పోరాటం చేశామ‌న్నారు.

అయితే.. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా పోల‌వ‌రం ఆపివేయ‌లేక పోయామ‌న్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్ లో ఈ ప్రాజెక్టును చేప‌ట్టిన‌ప్పుడే.. తాము వ్య‌తిరేకించామ‌న్నారు. చివ‌ర‌కు సుప్రీంకోర్టుకు కూడా వెళ్లేందుకు ప్ర‌య‌త్నించామ‌న్నారు. కానీ, పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలుపుద‌ల చేయ‌లేక పోతున్నారు. పైగా మోడీ స‌ర్కారు పోల‌వ‌రం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింద‌ని గుర్తు చేశారు. ఇవ‌న్నీ ఎందుకు చెబుతున్నానంటే.. ఇప్పుడు బ‌న‌క‌చ‌ర్ల విష‌యంలోనూ ఇదే జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నా అని క‌విత అన్నారు.

తెలంగాణ‌కు చెందిన ఏడు మండ‌లాల‌ను ఏపీ అన్యాయంగా తీసుకుంద‌ని క‌విత అన్నారు. దీనివ‌ల్ల రాష్ట్రానికి న‌ష్టం చేకూరింద‌ని చెప్పారు. వీటితోపాటు లోయర్‌ సీలేరు పవర్‌ ప్రాజెక్టును కూడా అప్పగించా రని అన్నారు. ఈ విష‌యంపైనా తాను ఎంపీగా పోరాటం చేశాన‌న్నారు.కానీ, త‌న ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేద ని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం 36 లక్షల క్యూసెక్కుల నుంచి 50 లక్షల క్యూసెక్కులకు పెంచుకుంటూ పోవడంతో ముంపు పెరిగిపోతోంది అని క‌విత వ్యాఖ్యానించారు.

ఈ నేప‌థ్యంలో త‌మ నుంచి గుంజుకున్న ఏడు మండ‌లాల్లో ఐదు మండ‌లాల‌ను తిరిగి తెలంగాణ‌కు అప్ప గించాల‌ని క‌విత డిమాండ్ చేశారు. పురుషోత్తమపట్నం, గుండాల, ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకులపా డుల‌ను తెలంగాణ‌కు అప్ప‌గించాల్సిందేన‌ని కోరారు. బ‌న‌క‌చ‌ర్ల‌ను తాము పూర్తిగా వ్య‌తిరేకిస్తున్న‌ట్టు క‌విత చెప్పారు.

This post was last modified on June 22, 2025 5:20 pm

Share

Recent Posts

రావిపూడి మార్కు మళ్ళీ మొదలయ్యింది

ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…

1 minute ago

ఇరుముడి ఇన్నింగ్స్ ఇంకా ఉన్నాయా

మూడు వారాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేంజ్ లో వీరబాదుడు బాదిన ఇరుముడి కలెక్షన్లు క్లైమాక్స్ కు వచ్చాయేమోనని అనుకుంటే…

21 minutes ago

ప్రభాస్ సినిమాల లెక్కలన్నీ తారుమారు

కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…

2 hours ago

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వెళ్లిందా?

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…

3 hours ago

జనసేనకు 50 నుంచి 60.. బొలిశెట్టి వారి లెక్క‌లు!

జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొంద‌రు నాయ‌కులు త‌మ పంథాను మార్చుకోవ‌డం లేదు.…

4 hours ago

ఢిల్లీ అష్ట‌దిగ్భంధం… ఏంటీ `బ్రిక్స్ స‌ద‌స్సు`?

దేశ రాజ‌ధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు పోలీసుల ప‌హారాలో ఉండ‌నుంది. దాదాపు న‌గ‌రం…

8 hours ago