Political News

మేం పోల‌వ‌రం ఆప‌లేక‌పోయాం: క‌విత

ఏపీ ప్ర‌భుత్వం చేప‌ట్టాల‌ని భావిస్తున్న క‌ర్నూలు జిల్లాలోని బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టును తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న బీఆర్ ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల క‌విత తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ లోని ప్రెస్‌క్ల‌బ్‌లో తాజాగా క‌విత రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడు తూ.. త‌మ హ‌యాంలోనూ త‌ప్పులు జ‌రిగాయ‌ని ఒప్పుకున్నారు. బీఆర్ ఎస్ హ‌యాంలోనే పోల‌వ‌రం ప్రాజెక్టును నిలిపివేయాల‌ని పోరాటం చేశామ‌న్నారు.

అయితే.. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా పోల‌వ‌రం ఆపివేయ‌లేక పోయామ‌న్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్ లో ఈ ప్రాజెక్టును చేప‌ట్టిన‌ప్పుడే.. తాము వ్య‌తిరేకించామ‌న్నారు. చివ‌ర‌కు సుప్రీంకోర్టుకు కూడా వెళ్లేందుకు ప్ర‌య‌త్నించామ‌న్నారు. కానీ, పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలుపుద‌ల చేయ‌లేక పోతున్నారు. పైగా మోడీ స‌ర్కారు పోల‌వ‌రం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింద‌ని గుర్తు చేశారు. ఇవ‌న్నీ ఎందుకు చెబుతున్నానంటే.. ఇప్పుడు బ‌న‌క‌చ‌ర్ల విష‌యంలోనూ ఇదే జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నా అని క‌విత అన్నారు.

తెలంగాణ‌కు చెందిన ఏడు మండ‌లాల‌ను ఏపీ అన్యాయంగా తీసుకుంద‌ని క‌విత అన్నారు. దీనివ‌ల్ల రాష్ట్రానికి న‌ష్టం చేకూరింద‌ని చెప్పారు. వీటితోపాటు లోయర్‌ సీలేరు పవర్‌ ప్రాజెక్టును కూడా అప్పగించా రని అన్నారు. ఈ విష‌యంపైనా తాను ఎంపీగా పోరాటం చేశాన‌న్నారు.కానీ, త‌న ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేద ని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం 36 లక్షల క్యూసెక్కుల నుంచి 50 లక్షల క్యూసెక్కులకు పెంచుకుంటూ పోవడంతో ముంపు పెరిగిపోతోంది అని క‌విత వ్యాఖ్యానించారు.

ఈ నేప‌థ్యంలో త‌మ నుంచి గుంజుకున్న ఏడు మండ‌లాల్లో ఐదు మండ‌లాల‌ను తిరిగి తెలంగాణ‌కు అప్ప గించాల‌ని క‌విత డిమాండ్ చేశారు. పురుషోత్తమపట్నం, గుండాల, ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకులపా డుల‌ను తెలంగాణ‌కు అప్ప‌గించాల్సిందేన‌ని కోరారు. బ‌న‌క‌చ‌ర్ల‌ను తాము పూర్తిగా వ్య‌తిరేకిస్తున్న‌ట్టు క‌విత చెప్పారు.

This post was last modified on June 22, 2025 5:20 pm

Share
Show comments
Published by
Satya
Tags: Kavitha

Recent Posts

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

45 minutes ago

SRH: కమిన్స్ లేకుంటే కెప్టెన్ ఎవరు మరీ?

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…

2 hours ago

నెల రోజుల గ్యాపులో బాబాయ్ అబ్బాయ్

రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…

3 hours ago

లెజెండ్ పోయాడు… లీడర్ వస్తున్నాడు

నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…

3 hours ago

గేమ్ కోసం ఫోన్ ఇవ్వలేదని ముగ్గురు అక్కాచెల్లెళ్ళు…

​ఘజియాబాద్‌లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…

5 hours ago

అల్లరోడి ఆల్కహాల్ అడ్రస్ ఎక్కడ

అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…

6 hours ago