Political News

జ‌న‌సేన ఎమ్మెల్యేల్లో ఎంత మార్పు..

కూట‌మి పార్టీల్లో కీల‌క‌మైన జ‌న‌సేనలో నాయ‌కులు చ‌డీ చ‌ప్పుడు లేకుండా ప‌నిచేసుకుంటున్నారు. పైకి ఎవ‌రూ మీడియా ముందుకు రారు. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌నలు కూడా చేయ‌రు. అంతేకాదు.. ఏం చేసినా.. పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు క్రెడిట్ ద‌క్కాల‌ని కోరుకుంటున్నారు. దీంతో వారు ఒక‌ర‌కంగా ఆద‌ర్శంగాను.. మ‌రో ర‌కంగా.. ప‌నిమంతులుగా కూడా పేరు తెచ్చుకుంటున్నారు. తిరుప‌తి ఎమ్మెల్యే.. ఆర‌ణి శ్రీనివాసులు కుటుంబ రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హిస్తున్నార‌నే పేరు వ‌చ్చింది.

దీంతో పార్టీ ఆయ‌న‌కు సైలెంట్‌గానే వార్నింగ్ ఇచ్చింద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.ఈ నేప‌థ్యంలో ఆర‌ణి అలెర్టు అయ్యారు. వెంట‌నే నియోజ‌క‌వ‌ర్గంలోని మండ‌లాల్లో తిరుగుతున్నారు. స‌మ‌స్య‌లు తెలుసుకుంటు న్నారు. త‌న‌వ ద్ద‌కు వ‌చ్చే వారికి ఒక‌ప్పుడు రెడ్ సిగ్న‌ల్ చూపించిన ఆయ‌నే ఇప్పుడు పార్టీ కార్యాల‌యాల్లో ఉద‌యం 10 నుంచి అందుబాటులో ఉంటున్నారు. ఇక‌, ఎమ్మెల్యే కొణతాల రామ‌కృష్ణ కూడా.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై బాగానే ప‌నిచేస్తున్నార‌నే మార్కులు వేయించుకున్నారు.

తాడేప‌ల్లి గూడెం ఎమ్మెల్యే కూడా.. గ‌తానికి భిన్నంగా ఇప్పుడు మార్పు దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు తెలు స్తోంది. కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు ఆయ‌న వివాదాల కేంద్రంగా రాజ‌కీయాలు చేశారు. అయితే.. పార్టీ నుంచి బ‌ల‌మైన హెచ్చ‌రిక‌లు రావ‌డంతో త‌న తీరును మార్చుకున్నారు. తాజాగా ఆయ‌న టీడీపీ నాయ‌కుల‌కు విందు ఏర్పాటు చేసి.. స్థానిక స‌మ‌స్య‌ల‌పై క‌లిసి పోరాటానికి దిగుదామ‌ని సూచ‌నలు చేయ‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా ఎమ్మెల్యే మండ‌లి బుద్ధ ప్ర‌సాద్ కూడా అందుబాటులో ఉంటున్నారు.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు హైద‌రాబాద్‌లోనే ఉన్న మండ‌లి.. పార్టీ సూచ‌న‌ల‌తో మ‌కాం మార్చి నియోజ‌క‌వ‌ర్గం లో అందుబాటులో ఉంటున్నారు. నెల్లిమ‌ర్ల ఎమ్మెల్యే వివాదాల‌కు కేంద్రంగా మారార‌న్న వాద‌న నుంచి ఇప్పుడిప్పుడే.. మారుతున్నారు. ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నారు. స‌మ‌స్య‌లు ప‌ట్టించుకుంటున్నారు. అంతేకాదు.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో 30 మందికి సొంత సంస్థ‌ల్లో ఉద్యోగాలు కూడా ఇచ్చి ఆదుకున్నారు. ఇలా.. ఒక్కొక్క‌రు త‌మ పంథా ను మార్చుకుంటున్నార‌ని పార్టీ నాయ‌క‌త్వానికి నివేదిక‌లు అందాయి.

This post was last modified on July 6, 2025 5:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హాలీవుడ్ రికార్డు బద్దలు కొట్టిన మన లెజెండ్

ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…

2 minutes ago

రిస్కులు చూసుకుంటున్న జైలర్ 2

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…

59 minutes ago

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

4 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

4 hours ago

మమ్ముట్టి & మోహన్ లాల్ మెప్పించారా

మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…

5 hours ago

30 రోజుల కౌంట్ డౌన్ మొదలయ్యింది

సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…

6 hours ago