Political News

ప్ర‌తిప‌క్షంలోనూ భ‌య‌పెడుతోన్న జ‌గ‌న్‌..

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలు.. జగన్ ప్రభుత్వం అనుసరించిన పద్ధతులు చాలామందిని భయపెట్టాయి. అందుకే మొన్నటి ఎన్నికలలో వైసీపీ అంత దారుణంగా ఓడిపోయింది. చంద్రబాబు ఇచ్చిన హామీల కంటే జగన్ పాలన వద్దు అనుకుని ఓట్లు వేసిన వాళ్లే ఎక్కువమంది ఉన్నారు. ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా లేకపోయినా వైసిపి అదే మోడల్ ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత రెండు పర్యటనలు చూస్తే వైసిపి ప్రజలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తుందా ? లేదా మరింత దూరం అవుతోందా ? అన్న సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ కలుగుతున్నాయి. ఇదే సీన్ రాబోయే రోజులలోను కొనసాగితే ఆ పార్టీకి రాజకీయంగా మరిన్ని ఇబ్బందులు తప్పవని మాటలు వైసిపి నాయకులు నుంచే వినిపిస్తున్నాయి.

అధికార పార్టీ తప్పులు చేస్తే వాటిని ఎత్తిచూపాలి.. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల పోరాటం చేయాలి. ఏ రాజకీయ పార్టీ అయినా వాటిని బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సి ఉంది. అయితే జగన్ వైసీపీ గత కొంతకాలంగా చేస్తున్న పనులు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. జగన్ కొద్ది రోజుల క్రితం తెనాలిలో నేరచరిత్ర ఉన్నవాళ్లను పరామర్శించడానికి వెళ్లి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. పార్టీ వర్గాలను పక్కన పెడితే.. న్యూట్రల్ జనాలలో ఈ విమర్శలు ఎక్కువగా వచ్చాయి. తాజాగా పల్నాడు జిల్లా రెంటపాళ్ల సందర్శన కూడా కొత్త వివాదానికి తెరతీసింది. జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ కేడర్ బహిరంగంగా ప్రదర్శించిన ఫ్లెక్సీలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

‘2029 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన‌ వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రపా రపా నరుకుతాం ఒక్కొక్కడిని. రాజారెడ్డి రాజ్యాంగం అమలు పల్నాడు నుంచే మొదలు. ఎవడైనా రాని తొక్కి పడేస్తాం… అన్న వస్తాడు అంతు చూస్తాడు ఇలాంటి నినాదాలు ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. ఇవే కాదు ఇంకొన్ని బూతులతో కూడిన నినాదాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపాలి అనుకుంటున్నారో అర్థం కావడంలేదని త‌ల‌లు పట్టుకుంటున్నారు. సొంత పార్టీ వాళ్ళ గోడు వర్ణనాతీతం.. అధికార పక్షంలో ఉన్నప్పుడు జగన్ ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలతో పాటు చాలామందికి భయం చూపించారని.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల మనసులు గెలుచుకోవాల్సింది పోయి.. ప్రతి పర్యటనలోనూ ఇలాంటి సెల్ఫ్ గోల్స్ వేసుకొంటున్నార‌ని వాపోతున్నారు.

ఇలా చేయడం తప్పు అని… ప్రతిపక్ష పాత్రలో నిర్మాణాత్మకంగా విమర్శలు చేయడంతో పాటు ప్రజల మనసులు గెలిచేలా ప్రభుత్వంపై పోరాటం చేయాల‌ని వైసీపీలో ఎవరు జగన్‌కు చెప్పే సాహసం కూడా చేయలేకపోతున్నారట. జగన్ పర్యటనలకు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు. అందుకే ప్రభుత్వం కూడా తాజా పర్యటనపై పలు అంశాలు పెట్టింది.. పోలీసుల ఆంక్షలు కాదని పెద్ద ఎత్తున జనాలు జగన్ కార్యక్రమానికి వచ్చారు. అయితే ఇలాంటి కాంట్రవర్సీ ప్ర‌చారంతో మొత్తం వ్యవహారం పక్కకు పోయిందని వైసిపి వాళ్ళే వాపోతున్నారు.

This post was last modified on June 22, 2025 5:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

2 hours ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

2 hours ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

2 hours ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

3 hours ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

3 hours ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

4 hours ago