Political News

‘ఉచిత’మే అయినా.. మ‌న‌సు పెడుతున్నారుగా!

ఉచితంగా ఇచ్చే పథకాలకు సంబంధించి ప్రభుత్వాలు పెద్దగా మనసు పెట్టవు. ఉదాహరణకు రేషన్ బియ్యం, ప్రభుత్వ ఆసుపత్రుల విషయంలో ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవు. ఎలాంటి నాణ్యమైన బియ్యం ఇస్తున్నాం, వాటి తూకం ఎలా ఉంది అనేవి కూడా ప్రత్యేకంగా పట్టించుకోవు. కానీ మారుతున్న ప్రజల ఆలోచనలు, మారుతున్న ప్రజల అంచనాలు ప్రభుత్వాలను చైతన్య దిశగా నడిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉచితంగా ఇచ్చే పథకాలకు కూడా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు చేతిలో సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఎక్కడ ఏం జరిగినా వెంటనే వైరల్ అవుతుంది.

ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో మంచి చేస్తే ప్రశంస కూడా దక్కుతుంది. అది ఓటుగా మారుతుంది. ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న రేషన్ పంపిణీ విషయంలో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. దీనిని సరి చేసేందుకు ఉచితంగానే ఇస్తున్నప్పటికీ వీటిని నాణ్యంగా ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. అంటే ఇక నుంచి బియ్యాన్ని నేరుగా 5 కేజీలు, 10 కేజీలు, 20 కేజీలు చొప్పున బస్తాల రూపంలోనే ఇవ్వనున్నారు. తద్వారా నాణ్యమైన బియ్యమే ప్రజలకు అందనున్నాయి. అదేవిధంగా ఇతర నిత్యావసర సరుకులను కూడా ఇదే పద్ధతిలో నాణ్యతను పరిశీలించిన తర్వాతే ఇవ్వాలని నిర్ణయించారు.

ఇది ఒక రకంగా మంచి పరిణామం. అదేవిధంగా, ఆగస్టు 15 నుంచి అమలు చేయాలని భావిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గానే ఉన్నారు. ఏదో డొక్కు బస్సులు పెట్టేసి మమ అనిపించుకుంటే బ్యాడ్ నేమ్ వస్తుంది అన్న భావనతో కొత్త బస్సులను ప్రవేశపెట్టాలని ఆయన చూస్తున్నారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలను ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. గత ఏడాది ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఒకటి.

దీనిని కీలకంగా భావిస్తున్న ప్రభుత్వం వారికి కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని, ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని భావిస్తోంది. దాదాపు 350 బస్సులను రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టనున్నారు. తద్వారా ఉచిత పథకమే అయినా “చేతులు దులుపుకోలేదు” అనే సంతృప్తి ప్రజల్లో కలిగేలా చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న తీరు సంతోషించాల్సిన విషయం. ఇదే జరిగితే… ఉచిత బస్సు, అందునా కొత్త బస్సులు ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుకు, కూటమి సర్కారుకే దక్కనుంది.

Satya

Recent Posts

గొడవలతో భార్యతో మాట్లాడకపోతే గృహ హింస కాదు

గొడవలు కానీ మనస్పర్థలతో కానీ భార్యతో భర్త మాట్లాడకపోవటం గృహ హింస కిందకు వస్తుందా? మాట్లాడకుండా ఉండటం వేధింపులకు గురి…

3 hours ago

ప్రభాస్ సినిమా పోతుందని ముందే తెలుసట

‘బాహుబలి’కి ముందు ప్రభాస్ కెరీర్లో అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘రెబల్’ ఒకటి. కింగ్ నాగార్జునతో ‘మాస్’ లాంటి బ్లాక్…

6 hours ago

లెనిన్ మీద మెగాభిమానుల గుస్సా

అదేంటి లెనిన్ మీద మెగా ఫ్యాన్స్ కి కోపం ఎందుకు వస్తుందనుకుంటున్నారా. మ్యాటర్ ఉంది లెండి. కొంచెం ఫ్లాష్ బ్యాక్…

8 hours ago

చిరుకు తండ్రిగా గ‌ర్వం… న‌టుడిగా క‌ష్టం

రెండో సినిమా మ‌గ‌ధీర‌తోనే తాను తండ్రికి త‌గ్గ త‌న‌యుడిని అని చాటుకున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. ఇక…

9 hours ago

పాప రాలేదు.. కుక్క ఇక లేదు.. ఏపీకి స‌వాల్‌గా కేసు!

ఏపీ ప్ర‌భుత్వానికి.. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా పోలీసుల‌కు కూడా ఓ కేసు స‌వాల్‌గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…

9 hours ago

కంగనా క్రేజ్ మటాష్

ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…

11 hours ago