Political News

‘ఉచిత’మే అయినా.. మ‌న‌సు పెడుతున్నారుగా!

ఉచితంగా ఇచ్చే పథకాలకు సంబంధించి ప్రభుత్వాలు పెద్దగా మనసు పెట్టవు. ఉదాహరణకు రేషన్ బియ్యం, ప్రభుత్వ ఆసుపత్రుల విషయంలో ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవు. ఎలాంటి నాణ్యమైన బియ్యం ఇస్తున్నాం, వాటి తూకం ఎలా ఉంది అనేవి కూడా ప్రత్యేకంగా పట్టించుకోవు. కానీ మారుతున్న ప్రజల ఆలోచనలు, మారుతున్న ప్రజల అంచనాలు ప్రభుత్వాలను చైతన్య దిశగా నడిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉచితంగా ఇచ్చే పథకాలకు కూడా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు చేతిలో సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఎక్కడ ఏం జరిగినా వెంటనే వైరల్ అవుతుంది.

ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో మంచి చేస్తే ప్రశంస కూడా దక్కుతుంది. అది ఓటుగా మారుతుంది. ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న రేషన్ పంపిణీ విషయంలో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. దీనిని సరి చేసేందుకు ఉచితంగానే ఇస్తున్నప్పటికీ వీటిని నాణ్యంగా ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. అంటే ఇక నుంచి బియ్యాన్ని నేరుగా 5 కేజీలు, 10 కేజీలు, 20 కేజీలు చొప్పున బస్తాల రూపంలోనే ఇవ్వనున్నారు. తద్వారా నాణ్యమైన బియ్యమే ప్రజలకు అందనున్నాయి. అదేవిధంగా ఇతర నిత్యావసర సరుకులను కూడా ఇదే పద్ధతిలో నాణ్యతను పరిశీలించిన తర్వాతే ఇవ్వాలని నిర్ణయించారు.

ఇది ఒక రకంగా మంచి పరిణామం. అదేవిధంగా, ఆగస్టు 15 నుంచి అమలు చేయాలని భావిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గానే ఉన్నారు. ఏదో డొక్కు బస్సులు పెట్టేసి మమ అనిపించుకుంటే బ్యాడ్ నేమ్ వస్తుంది అన్న భావనతో కొత్త బస్సులను ప్రవేశపెట్టాలని ఆయన చూస్తున్నారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలను ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. గత ఏడాది ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఒకటి.

దీనిని కీలకంగా భావిస్తున్న ప్రభుత్వం వారికి కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని, ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని భావిస్తోంది. దాదాపు 350 బస్సులను రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టనున్నారు. తద్వారా ఉచిత పథకమే అయినా “చేతులు దులుపుకోలేదు” అనే సంతృప్తి ప్రజల్లో కలిగేలా చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న తీరు సంతోషించాల్సిన విషయం. ఇదే జరిగితే… ఉచిత బస్సు, అందునా కొత్త బస్సులు ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుకు, కూటమి సర్కారుకే దక్కనుంది.

This post was last modified on June 22, 2025 5:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

3 hours ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

4 hours ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

4 hours ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

4 hours ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

5 hours ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

6 hours ago