అహ్మదాబాద్ లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైన దగ్గర నుంచి అసలు విమాన ప్రయాణాలంటేనే జనం హడలెత్తిపోతున్నారు. అయితే బిజినెస్ మెన్, పొలిటీషియన్లు, ఇతరత్రా అత్యవసర పనులు ఉన్నవారు తప్పనిసరి పరిస్థితుల్లో విమాన ప్రయాణాలను ఎంచుకోక తప్పడం లేదు. అయినా కూడా వారిలో ఎక్కడో భయం బిక్కుబిక్కుమంటూనే ఉంది. తాజాగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రయాణించిన విమానం లోనూ సాంకేతిక లోపం తలెత్తింది. ఈ ఘటనపై విమానయాన సంస్థల తీరుపై జనాగ్రహం వ్యక్తం అవుతోంది.
తమిళనాడులో ఆదివారం రాత్రి జరగనున్న మురుగన్ మానాడుకు హాజరయ్యేందుకు ఆదివారం ఉదయం తర్వాత పవన్ ప్రత్యేక విమానంలో మధురై బయలుదేరేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం హోదాలో ఆయనకు ఓ ప్రత్యేక విమానం కేటాయించగా… అందుకోసం ఓ ప్రైవేట్ విమానయాన సంస్థ తన విమానాన్ని సమకూర్చింది. ఈ విమానం ఎక్కేందుకు పవన్ ఎయిర్ పోర్టుకు రాగానే… విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. చాలా సేపటికి గానీ ఆ సమస్య పరిష్కారం కాలేదు. అప్పటిదాకా పవన్ వేచి చూడక తప్పలేదు.
సరే… సాంకేతిక లోపాన్ని సవరించిన తర్వాత అదే విమానంలో పవన్ మధురై బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో పవన్ టూర్ లో ఒకింత జాప్యం చోటుచేసుకుంది. అయినా పవన్ మధురై ప్రయాణం కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందో, లేదంటే మురుగన్ మానాడు ఏర్పాటు చేసిందో, లేదంటే బీజేపీ ఏర్పాటు చేసిందో తెలియదు గానీ…వీవీఐపీలు ప్రయాణిం చేందుకు వినియోగించే ప్రత్యేక విమానంలో కూడా సాంకేతిక లోపాలు తలెత్తుతున్న తీరు నిజంగానే ఆందోళనకు గురి చేసేదేనని చెప్పక తప్పదు.
This post was last modified on June 22, 2025 4:51 pm
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…
దేశంలో రెండు కీలక అంశాలను తేల్చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు సిద్ధమైంది. 1) జమిలి ఎన్నికలు. 2) పార్లమెంటు…
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. చాలా వేగంగా కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాలను…
జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాజాగా బీఆర్ ఎస్ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ అధినేత…
జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి దూరితే.. పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ. హైదరాబాద్కు…
దేశవ్యాప్తంగా మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో ప్రధానంగా బిజెపి ఎక్కువగా ఆశలు పెట్టుకున్న రాష్ట్రం…