దక్షిణాది రాష్ట్రం తమిళనాడుకు గత కొంతకాలంగా గవర్నర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఆర్ఎన్ రవి నిత్యం వార్తల్లోనే ఉంటున్నారు. నిన్నటిదాకా తమిళనాడులోని అదికార డీఎంకే నిర్ణయాలను వ్యతిరేకించిన కారణంగా ఆయన వార్తల్లో వ్యక్తిగా నిలిస్తే… ఇప్పుడు ఇంటర్నేషనల్ యోగా డేను పురస్కరించుకుని ఆయన ఏకంగా ఆపకుండా 51 పుషప్స్ తీశారు. అదేదో ఆయన ఇంటిలో తీసి వీడియో విడుదల చేశారు అనుకోవడానికి లేదు. ఎందుకంటే.. యోగా డేను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వేదిక మీద అందరి కళ్ల ముందే ఆయన కుర్రాళ్లు సైతం అసూయ పడేలా పుషప్స్ లాగించేశారు.
తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి తీసిన ఈ పుషప్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. ఎందుకంటే… రవి వయస్సు ఏ 20 ఏళ్లో, 30 ఏళ్లో కాదు… అక్షరాల 73ఏళ్లు. అంటే వృద్ధుడి కిందే లెక్క. అయితే నిత్యం ఫిట్ నెస్ తో కనిపించే రవి… తన బాడీని ఎప్పుడు తన అధీనంలో పెట్టుకుని కళకళలాడిపోతూ ఉంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరే రవి కూడా ఏం చేస్తారో గానీ 73 ఏళ్ల వయసులోనూ వయోభారమన్నదే కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు.
అయితే కొందరు మాత్రం రవి 51 పుషప్స్ తీయడంలో పెద్ద విశేషమేమీ లేదులే అని కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే… బీహార్ కు చెందిన రవి… పూర్వాశ్రమంలోఐపీఎస్ అదికారి. కేరళ కేడర్ ఐపీఎస్ అధికారిగా ఓ దశాబ్దం పాటు పనిచేసిన ఆయన ఆ తర్వాత సీబీఐలో ఓ రేంజిలో సత్తా చాటారు. పోలీసు అధికారి అయిన రవి ఆ మాత్రం ఫిట్ నెస్ మెయింటెన్ చేయడంలో ఆశ్చర్యం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అయితే 73 ఏళ్ల వయస్సున్న రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరినైనా తీసుకువచ్చి రవి మాదిరి పుషప్స్ తీయమనండి ఎదురు దాడికి దిగుతున్నారు. వెరసి రవి వీడియో వైరల్ అయిపోయింది.
This post was last modified on June 22, 2025 9:49 am
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…